రచన-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
సతీ సహగమనం పేరుతొ
చితి మంటల్లోకి దూకింది.
అతని ఆజ్ఞానం
ఆమెను బూడిదగా చేసింది.
పతి ప్రాణం కోసం
యముడిని వెంబడించింది.
ఆమె పిచ్చి ప్రేమ
అతనికి జీవితాన్నిచ్చింది.
ముసలివానికిచ్చి పెళ్లిచేస్తే
మౌనంగా భరించింది.
అతని మూర్ఖత్వం
ఆమె పాలిటి నరకమయింది.
మగవాని అత్యాశకు
కట్నం కోరల్లో బలి అయింది.
అతని రాక్షసత్వం
ఆమె పాలిటి శాపమయింది.
చిత్రహింసలకు చెలి అయింది.
ఘోరకలి అయింది.
ఆతని అహంకారం వల్లే
ఆమె వక్తిత్వం దహనమయింది.