April 18, 2024

బహుజన సమీకరణకు ‘సమూహం’

రచన: జ్వలిత డెంచనాల

కులాల గుట్టు రట్టు చేసే మార్గం అంతర్‌ వివాహాలు మాత్రమే అని చెప్పారు అంబేద్కర్‌. అస్తిత్వవాదం ఇప్పుడు మొదయింది కాదు. జ్యోతిరావుపూలే తన రచను బోధన ద్వారా చేసినది అదే. పుట్టుకతో అందరూ సమానులే అయినా చదువు లేని కారణంగా బానిసలుగా, పాపులుగా భావించబడు శూద్ర, అతిశూద్రు సమానమని వారు ఐక్యంగా కలిసినపుడు ద్రోహపూరిత వ్యూహాను తిప్పికొట్టగలుగుతామని, కులం కన్న, మతం కన్న మానవత్వం గొప్పదని, విద్య అందించిన జ్ఞానం వల్లనే మానవీయత సాధ్యమని చాటిన గొప్ప మార్గదర్శకుడు. మరి పూలే రచను, బోధను మరుగున పెట్టిన కుట్రలు ఇప్పుడు బీసి అస్తిత్వ వాదుల ఐక్యతను కూడా చీల్చుతాయి. స్త్రీ విద్య మహా పాపమని కొన్ని వంద వే సం॥ల స్త్రీని విద్యకు, స్వేచ్ఛకు దూరంగా ఉంచిన బ్రాహ్మణ భావజాలం ఇప్పటికి మన బహుజనులను ప్రభావితం చేస్తూనే ఉంది.

బీసీ కవులు ఏమి రాయాలి జరిగిన మోసాలు, ద్రోహాలు, జరుగుతున్న కుట్రల గురించి రాయగలగాలి, తేనె పూసిన కత్తుల వంటి ప్రచారాలను అడ్డుకునే చైతన్యాన్ని, జ్ఞానాన్ని కలిగించాలి. బీసీలు కాని ఇతర కవులు రాసిన బహుజన హిత సాహిత్యాన్ని చదవాలి. బీసీలు మనువాదాన్నే మోసే ఏజంట్లు అనడగానికి కారణాలను గుర్తించాలి. మన లోపాలను, బహీనతలను నిజాయితీగా అంగీకరించాలి. అప్పుడే వాటిని సరిదిద్దుకోగలుగుతాం. పురాణాల్లో ఇతిహాసాల్లో బహుజనుల పాత్రను వక్రభాష్యాలను అర్ధం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా పూలే, అంబేద్కర్‌ రచనలను చదవాలి. బుద్ధుని బోధలను చదవాలి. మూఢనమ్మకాలు మంత్ర తంత్రాలను నమ్మేది అధికభాగం బహుజనులు కనుక హేతువాద పద్ధతిలో అర్థం చేసుకోవాలి. అంబేద్కర్‌ రాసిన కులం దాని పుట్టుక నుండి కొండలరావు రాసిన బీసిలవాదం వరకు చదవాలి.

ఆధ్యాత్మికత, భక్తి వేరు, మనువాదం బ్రాహ్మణవాదం వేరు అనే విషయాన్ని గ్రహించాలి. దానికి విద్య ఒక్కటే మార్గం. విద్య అంటే అక్షరజ్ఞానం డిగ్రీ సముపార్జన కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

అన్నింటి కంటే ముఖ్యంగా బహుజనుంతా ఐక్యతను సాధించడానికి కృషి చేయాలి. ఆ బాధ్యత బహుజన రచయితపై ఉన్నది అని గ్రహించాలి. ప్రస్తుతం ముఖ్యంగా బహుజనులకు సంధికాలం, కష్టతరమైన కాలం. మనకు ఒక ఐకాన్‌ కావాలి అది జ్యోతీబాపూలే అని గ్రహించాలి.

అంతేకాదు భావజాలంతో పాటు మన భాష మారాలే, మనం మనని మోసిన వారిని అగ్రకులాలు, పెద్దకులాలు అంటున్నాము. వారిది ఆధిపత్య కులాలని మనమే ‘పెద్ద’ వారు అని అంగీకరిస్తూ, మనని చిన్నవాళ్ళుగా ఆత్మన్యూనతను వ్యక్తపరుస్తున్నాము.

బహుజను కవిత్వాలు కూడా చాలా అసహనంగా ఉంటున్నాయి. వ్యక్తపరచాలిసినది అసహనాన్ని కాదు, ధిక్కారాన్ని. అది సామాన్యులకు ఆత్మ విశ్వాసాన్ని కలిగించాలి. మనకోసం కొందరున్నారనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఉద్యమస్ఫూర్తిని కలిగించాలి. కష్టాలు, కన్నీళ్ళు మాత్రమే కాదు పొందాల్సిన ప్రోత్సాహాన్ని సాహిత్యం అందించాలి. డా॥ చింత ప్రవీణ్‌కుమార్‌ సంపాదకత్వంతో వచ్చిన సమూహం ఆ బాధ్యతను మోస్తూ ముందుకు వచ్చింది.

అందరు మాట్లాడుకోవాలె, మనలో మనం, మనతో మనం మాట్లాడుకోవాలె. అందుకు పుస్తకంలో కవుల చిరునామాలు, ఫోన్‌ నెంబర్లుండాలి. ఒక సమిష్టి బాధ్యత సామాజిక బాధ్యతతో అచ్చువేస్తున్న పుస్తకాలలో అందులో రచయితలు ఒకరితో ఒకరు మాట్లాడేందుకు సాధ్యపడుతుంది. పాఠకుడు విమర్శను కాని, ప్రశంసను కాని తెలియజేయడానికి వీలవుతుంది, అస్తిత్వ స్పృహతో రాసే కవి పాఠకుడు కలిసి సామాన్యులను సమీకరించగలరు. అప్పుడు ఆ రచన యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఐకమత్యాన్ని చైతన్యాన్ని పెంపొందించడానికి వీలవుతుంది.

ఒక ప్రయోగాన్ని గురించి లేదా ఒక వంట గురించి రాస్తున్నపుడు, పరికరాు వస్తువు, నిర్మాణం, తయారు చేసే పద్ధతి, ప్రయోగం, ప్రయోజనం అని సైడ్‌ హెడ్డింగ్ పెట్టి రాసినట్టు, అస్తిత్వ కవిత్వ ప్రయోజనాన్ని సాధించాలి. మనమంతా నిజంగా ఒక్కటైతే మన మధ్య అంతరాలు తొలగడానికి, కుల నిర్మూలన జరిగి మనవంతు కృషి మనం చేయాలి. బీసీల్లో అనైక్యతను తొలగించడానికి బహుజన కులాలు ఒక కులం మరొక కులంతో వివాహాలు జరగాలి అప్పుడు ‘‘నేనెక్కువ నువ్వెక్కువ’’ ప్రశ్న ఉండదు. బహుజనుంతా ఒకే కుటుంబంగా ఏర్పడి రాజ్యాధికారం కోసం ఉద్యమించడానికి ఉపయోగపడతది. అంతేకాదు బహుజనులకు ప్రత్యేక రాజకీయ పార్టీ కావాలి. దాని మ్యానిఫెస్టో బహుజనుల సంక్షేమమే అయి ఉండాలి. ఇది ఇప్పటికప్పుడు సాధ్యమైనా కాకపోయినా భవిష్యత్తు తరానికి మార్గదర్శకంగా మాత్రం పని చేస్తుంది. ప్రభుత్వాలను ఏర్పాటు చేయకపోయిన బహుజను వాదన చట్ట సభకు చేరగలదు.

పూలే అంబేద్కర్‌ బోధను పాటిస్తూ ఆ భావజాలాన్ని ప్రచారం చెయ్యాలి, ‘‘బిసి రైటర్స్‌ వింగ్‌’’ ఆ పని తన భుజాలపైన వేసుకోవాలి. కవులు, సాహిత్యకారులు ముందుచూపుతో అస్తిత్వ చైతన్యాన్ని కలిగించాలి. కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు నిర్వహించి వాటికి కేవలం కవులు రచయితలు కాకుండా సామాన్య ప్రజానీకాన్ని ఆహ్వానించాలి. కళ కళ కోసమే కాదు కవిత్వం కేవలం సాహితివేత్తల కోసం కాదు దానికొక సామాజిక బాధ్యత ఉన్నది కనుక, కవిత తన కవిత్వం ఉద్దేశం, దాని దృష్టికి వెనుక అనుభవాలను రాయవలసిన అవసరం, సాధించవలసిన ప్రయోజనాన్ని పాఠకునికి వివరించగలగాలి, చైతన్యపరచాలి, ఐక్యత సాధించాలి కవులు ఒక ప్రత్యేక వర్గం అనే భావాన్ని వదిలి ప్రజతో మమేకం కాగలిగినపుడే అస్తిత్వ సాహిత్య ప్రయోజనం చేకూరుతుంది అని నా అభిప్రాయం.

ఈ మధ్య ఒక కవి, తన రచనను అంకితమిచ్చి పదవిని పొందిన కవి, కుల సంఘాల గురించి ఎంతో చులకనగా మాట్లాడారు. ‘‘బుడ్డ గోసి కుల సంఘాలు’’ ఏమి చేస్తయి. డిమాండ్లు నినాదాంటూ ఒర్రుతరు ఏమి జరుగుతది అని తమ అమ్యూల అభిప్రాయాన్ని సెవిచ్చారు. ఏ కళ అయినా ప్రజాప్రయోజనం కోసమే అని తెలియని వారు గతంలో కవు రాజకీయాలు చెయ్యొద్దు అని సెవిచ్చారు. స్వయంగా వారే రాజకీయాలు చేస్తూ ఇటువంటి కవులు అస్తిత్వ వాదులయినా మనకు ఒరిగేదేముండదు.

చైతన్యవంతులయిన కవులు అన్ని కాలాల్లో ఉండరు. తెలంగాణ ఉద్యమం అందించిన స్ఫూర్తి ఇప్పటి అస్తిత్వ సాహిత్యంపై ఎంతో ప్రభావం చూపుతున్నది. నేను చరిత్రలోకి వెళ్ళను కాని తెలంగాణ ఉద్యమం మిగిలిన అస్తిత్వ ఉద్యమాలను మింగేసింది. స్త్రీవాదం రూపుమార్చుకొని మరొక వాదంలోకి ఒదిగిపోయింది. కొందరు స్త్రీవాదులు దళితవాదులయితే మరికొందరు మానవీయ వాదులయ్యారు. ఒక్కరిద్దరు దిక్కుతోచక ఎటూ ఒదగలేక మౌనాన్ని ఆశ్రయించారు. సాహిత్యమంతా ముఠాలుగా విడిపోతున్న సందర్భంలో ‘‘సమూహం’’ ఒక మెరుపులాగా బీసీకుల మార్గదర్శనం చేసేందుకు ముందుకు వచ్చింది. ఉక్కు కండరాలు, ఇనుప నరాలున్న యువత సమాజానికి తమ కంచు కంఠంతో అస్తిత్వాన్ని చాటడానికి ముందుకొచ్చారు. ‘‘బిసి రైటర్స్‌ వింగ్‌’’ వేదికగా డా॥ చింత ప్రవీణ్‌కుమార్‌ చేసిన ప్రయత్నం చారిత్రాత్మకమైనది. ఇంతకు ముందు ఇటువంటివి జరగలేదా అంటే జరిగాయి ‘‘వెంటాడే కలాలు ` వెనుకబడ్డ కులాలు’’ (2011) వచ్చి దాదాపు 15 సంవత్సరాయినా మళ్ళీ బహుజనుల తరుపున ముఖ్యంగా బీసీ కవులను, బీసీ అస్తిత్వాన్ని సమిష్టిగా ముందుకు తెచ్చిన వారు లేరనొచ్చు. బీసీ సాహిత్యం వచ్చింది కథలు, వ్యాసాలు వచ్చాయి అవి ఎవరికి వారు వ్యక్తులుగా రాసారు కాని సంకలనం రాలేదు. ‘రుంజ’ 2013లో వచ్చినా అది విశ్వకర్మ కవుల కవిత్వం మాత్రమే. ఇంకా కొన్ని బీసీ కులాలు ప్రయత్నించారు. బీసీ కవులందరి కవిత్వం మాత్రం ‘సమూహం’ అనొచ్చు. ‘‘బిసి అస్తిత్వవాద యువ కవిత్వం’’ అనే ట్యాగ్‌తో వచ్చేసరికి నాలాంటి చాలా మంది బీసీ కవులు ఇందులో లేరు. నేను ‘‘వెంటాడే కలాలు’’లో లేను ‘‘సమూహం’’లో లేను. మరి నేను బీసీ రచయితను కాదా? కథలు, వ్యాసాలు, కవిత్వం బిసి అస్తిత్వంతో రాసాను. నా మొదటి కవిత సబ్బండ జాతుల ఆడది. అంటే కొంచెం అసంతృప్తే. నాలాంటి వాళ్ళు బహుజన అస్తిత్వంతో రాసేవాళ్ళు ఇంకా కొందరున్నారు. ఇది విమర్శకాదు.

‘‘సమూహం’’లో ముప్పై తొమ్మిది మంది రచనులుంటే అందులో బీసీ రచయిత్రులు ఏడుగురుండడం నాకు చాలా ఆనందంగా ఉన్నది.
1) సొన్నాయి కృష్ణవేణి ‘‘మారని బతుకు’’ అనే కవితలో ‘‘మార్చే ప్రయత్నం చెయ్యమని నా కొడుక్కు జెప్పాలె’’ అని రేపటి తరానికి వాయిదా వేసింది
2) డా॥ కందాళ శోభారాణి ‘‘మరణానికి దగ్గరైన కులాలు’’ కవిత జరిగిన మోసాలు గురించి చెప్పింది. ‘‘బ్రాహ్మణ ఛాందన సారాన్నే ప్రభుత్వాలు పాటిస్తున్నాయి’’ అన్నారు
3) రామారత్నమా తన కవితలో నేతన్నకు సంక్షేమ పథకాలు రూపక్పన జరగాలన్నారు.
4) అంబటి భాగ్య అనే కవయిత్రి ‘‘చదువుకున్న సావిత్రిబాయిలు’’ అంటూ ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించింది.
5) వంగా యశోద ‘‘పేరైతే ఉంది’’ అనే కవితలో సంచారజాతు గురించి రాసింది
6) గూడూరు ఉమ ‘‘మనసు కఠినం కాదు’’ అనే కవితలో శ్రీశ్రీ కూడా కటికసాయి అన్నాడు అని ఆవేదన వ్యక్తపరిచింది ఆయన ఆదిపత్యకులస్తుడే కాదు.
7) జగం హైమావతి ‘‘పోగుగూడు’’ అనే కవితలో నేతన్న గురించి రాస్తూ ‘‘బహుజన రాజ్యపు కుర్చీ’’ గురించి రాసింది. ముందుమాటలో ‘‘సీతారాం’’ రాసినట్లు కవితల్లో ధిక్కారస్వరం లేకపోవచ్చు కాని అస్తిత్వవాదం పుష్కలంగా ఉన్నది. హైద్రాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ‘‘సమూహం’’ ఆవిష్కరణ సమయంలో ఒక్కరిద్దరు మొదటి కవిత నాది అన్నట్టు గుర్తు.

చిర్రా రాజేష్‌ఖన్నా తన కవితలో ‘‘మనుషు మనవాళ్ళేరా లొ మొదళ్ళు మాత్రం శత్రువులది అన్న అంబేద్కర్‌ మాటను గుర్తు చేస్తూ మన మెదళ్ళు మార్చుకోవసిన అవసరాన్ని చెప్పాడు. ఆధిపత్యకులాల కుర్చీ రాజకీయాల నాటకాల్లో బీసీలు పాత్రదారులై పరికరాలుగా మారిన అనేక సంఘటలను ‘‘లక్ష్మీపేట’’ వంటివి జరగకూడదు, తెలివిడితనం అలవరచుకోవాలి బీసీలు.

‘‘కొండ్రు బ్రహ్మం’’ ‘మేమే పాలించుకుంటం’ అని ప్రకటించుకుంటూ ఓట్లాయుధాలతో సిద్ధంగున్నం అంటే, ‘‘కొలిపాక శ్రీనివాస్‌’ సముద్రం తలాపునుంటే సరిపోదు సముద్రం మనదవ్వాలి`అంటూ రాజ్యాధికారం కావాలని ఆశ వ్యక్తపరిచాడు. ‘రాపాక శ్రీనివాస్‌’ బసిన సింహాన్ని బరిగొడ్లు తరుముడు చూసిన అంటూ మనం ఏమి చెయ్యాలో చెప్పాడు. ‘‘కటుకోజ్వల రమేష్‌’’ విశ్వకర్మ పరిస్థితికి చింతిస్తున్నాం, విచారిస్తున్నాం అన్నారు. దేవరకొండ భగవాన్‌ ఐక్యత లోపం అని వ్యక్తపరిచారు. రోగ క్షణం తెలిసింది కనుక నివారణ త్వరగానే జరుగుద్ది. ‘‘అగపాటి అరుణ్‌’’ ఇంకెన్నాళ్ళు సహిస్తవ్‌ అని కత్తులు నూరాడు. ‘‘దార్ల నాగేంద్రాచారి’’ కొలిమి కవితలో బ్రతుకుదెరువు కోసం వెతుక్కునే స్థితిని తెలిపాడు. ‘‘బిల్లా మహేందర్‌’’ ఆదిపత్యాలకు చరమగీతాన్ని పాడాలన్నారు. జయవీర్‌ కోటగిరి కులమూలాలు ఊడబీకి సంఘజ్ఞానం కావాలన్నాడు. వజ్జీరు ప్రదీప్‌ ఇది పీష్వాకారులం కాదు బహుజనకారులం అని ప్రకటించాడు. రణమో రాజ్యమో తేల్చుకోవాంటాడు అడపరాజు. చింతం నాగరాజు జారుకుంటు వచ్చిన ప్రతిమెట్టు మళ్ళీ పైకెక్కాలని కర్తవ్యబోధ చేసాడు. అనంతోజు మోహనకృష్ణ మళ్ళీ కంసాలోళ్ళనే కలిసి రమ్మంటున్నడు, ఇంకెక్కడి ఐకమత్యం. కంచర్ల శ్రీనివాస్‌ చచ్చినా సమానత్వం లేదంటాడు. చేరా సుధాకర్‌ బడుగుకాపు రైతు గురించి రాస్తే, రేనా ఈశ్వరయ్య స్త్రీ గొంతుతో దొమ్మరిదనే ముద్రతో పుట్టిన దాన్ని అంటూ ఒక ఆధిపత్య కులం తమని ఎంత దిగజార్చిందే చెపుతూ తనను యస్‌.సి.ల్లో చేర్చాంటాడు. ఇక్కడ నా కవిత ‘‘మేమెవరం’’ రాస్తూ ఎఫ్‌.బి.లో చూసి భోగమోళ్ళం అని రాసాను. అది నీచార్ధం దాన్ని మార్చాలి అని ఫోను చేశారు. కులం పేరు నేనే మార్చుతాను అర్థం కాలేదు. గాంధీగారు దళితులను హరిజనులు అన్నారు కదా అన్నారు. హరిజనుడు అనడం కరెక్టు కాదు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు. బీసీకు తెలియటం లేదు. మనం ఇంకా చాలా నేర్చుకోవలసి ఉన్నది.

వడ్లసాయిుచారి తన కవితలో ‘‘ఆకాశమంత ఎత్తుకు ఎగిరి త ఎత్తుకు జీవించేలా చెక్కిన పెద్ద బాడిసి దిక్కులేనిదై దిగులు పడుతుంది’’ అని వృత్తుల ధ్వంసం అయిన విధానాలు చెప్పాడు. గిరివర్మ చింతం పాతిక లక్షల జనాభాలో పాంచ్‌ శాసనసభ్యులు అంటూ తన వాటా అడుగుతున్నాడు. ‘‘సమూహం’’ సంపాదకు చింతం ప్రవీణ్‌ బీసీలకు కూడా అట్రాసిటీ కావంటాడు. మిసిలినీయస్‌ ఖాతా అంటూ సంచార జాతుల గురించి ప్రశ్నించారు. యోచన అనే కవి ‘కాలుతున్న తనువు’ అనే కవితలో అంటరానితనం వెంటాడుతూ ఒంటరిని చేసిందంటాడు. వెంకటకిష్‌ ఇట్యా మనందరి బాపూ జ్యోతిపూలే అంటూ పూలే భావజాల వ్యాప్తి ఒక్కటే బీసీలకు రాజ్యాధికారమిప్పించదని అంగీకరించాడు.

‘‘సమూహం’’ అచ్చు వెయ్యడమే కాదు మొత్తం తెలంగాణ జిల్లాన్నింటికి పర్యటించి ఆవిష్కరణ సభలు నిర్వహిస్తూ బహుజన వాదాన్ని ముందుకు తీసుకువెళ్ళిన చింత ప్రవీణ్‌కుమార్‌ ఐ.పి.యస్‌. ప్రవీణ్‌కుమార్‌ స్థాయికి ఎదిగి ఆయన దళిత విద్యార్థుల కోసం చేస్తున్న కృషిని ఆదర్శంగా బీసీలకు చెయ్యాని కోరుకుంటున్నాను.

చివరగా పండ్లు కాసే చెట్టుకే రాతి దెబ్బంటాయి. పనిచేసే వాళ్ళకే విమర్శలుంటాయి కనుక విమర్శను బలాన్నిచ్చే టానిక్‌గా ఉపయోగించుకుంటూ ముందు ముందు ఇంకా బీసీ సాహిత్యాన్ని సంకనాలుగా తేవాలని, అదొక ఉద్యమంలా కొనసాగాలనీ రాజ్యాధికారమే అంతిమలక్ష్యంగా బీసీ కావు ఉద్యమ కార్యకర్తలుగా ముందు నడవాలని కోరుకుంటూ నా వంతు కలంగా గళంగా అవసరమయిన చోట ఉంటాననీ హామీనిస్తూ….““

4 thoughts on “బహుజన సమీకరణకు ‘సమూహం’

    1. బహుజనులం మా విస్మరణ గురించి రాసుకున్నం . మీరన్నది నిజమయితే మీరు రాయండి

  1. చాలా మంచి వ్యాసం. అభినందనలు జ్వలిత గారు
    డాక్టర్ నూకతోటి రవికుమార్

Leave a Reply to Sudheer Cancel reply

Your email address will not be published. Required fields are marked *