రచన: ఝాన్సీరాణి కె
స్కూల్ నుంచి వచ్చిన రాహుల్ ఏదో ఆలోచనల్లో మునిగిపోయినట్లు కూర్చున్నాడు.
‘ఏమిటి? రాహుల్ ఏమి తినకుండా అలా కూర్చుండి పోయావు’ అని అడిగారు లక్ష్మీగారు. లక్ష్మీగారి కూతురు లావణ్య కొడుకు`రాహుల్. లావణ్య ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఆస్యం అవుతుంది. అందుకని రాహుల్ స్కూు నుంచి క్ష్మీగారి దగ్గరికి వస్తాడు. అక్కడ బట్టు మార్చుకుని అమ్మమ్మ పెట్టిన టిఫన్ తిని కాస్సేపు ఆడుకుని తర్వాత చదువుకుంటాడు. ఒక్కోసారి తల్లి లావణ్యగాని తండ్రి శేఖర్ గాని వస్తే వాళ్ళతో వెళ్ళి ఇంట్లో చదువుకుంటాడు. లావణ్య వాళ్ళు కూడా క్ష్మీగారి ప్రక్క అపార్ట్మెంట్స్లో ఉంటారు.
‘ఏమిలేదు అమ్మమ్మా’ అన్నాడు రాహుల్
‘నీవు మామూలుగా లేవు. స్కూల్లో ఏమి జరిరిందో చెప్పు’ అన్నారులక్ష్మిగారు.
‘ఈ రోజు మా టెస్ట్ పేపర్స్ ఇచ్చారు అమ్మమ్మా మన అపార్ట్మెంట్లో అందరికి మంచి మార్కులే వచ్చాయి కాని కిరణ్కి తక్కువ వచ్చాయి. మాస్టారు బాగా కోప్పడ్డారు’ అన్నాడు రాహుల్.
‘ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు కదా’ అన్నారులక్ష్మిగారు. ‘అవును, కాని పరీక్షంటే ఎందుకో భయపడుతాడు. సరిగ్గా వ్రాయడు’ అన్నాడు.
‘కాస్సేపయ్యాక మీ పి. ఆర్.ఎస్ ని తీసుకురా’ అన్నారులక్ష్మిగారు.
పీ.ఆర్.ఎస్. ఏమిటి మేడం టి.ఆర్.ఎస్.లా? అన్నారు
వేణుగోపాల్రావు గారు మనవడి ప్రక్కన కూర్చుంటూ “పిల్ల రాక్షసుల సంఘం. మన అపార్ట్మెంట్లో ఆడవాళ్ళు పిల్లలకు ముద్దుగా పెట్టుకున్న పేరు. చదువులో, ఆటల్లో, అల్లరిలో అన్నిట్లో మనవాళ్ళు ముందుంటారుగా, అందుకే అలా పిలుస్తామన్నమాట అన్నారు లక్ష్మిగారు` కాఫీ అందిస్తూ.
మరి ఈ ఇవాళ ఈ బోధనా కార్యక్రమం ఏమిటి? అన్నారు వేణుగోపాల్రావుగారు.
కిరణ్ సంగతంతా వివరించారు లక్ష్మిగారు.
“ఐతే మళ్ళీ పరీక్షల్లో టాపర్ కిరణన్న మాట” అన్నారు వేణుగోపాల్రావుగారు. నేనలా పార్క్దాకా వెళ్ళి వస్తానంటూ, వంట ఇంట్లో అన్ని సర్ది మూడు పాకెట్ల బిస్కెట్లు నీళ్ళ బాటిల్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వచ్చేసరికి హాల్లో రెండు చాపలు, ఒక బెడ్షీట్ వేసి వున్నాయి. తొమ్మిదిమంది పిల్లలు లక్ష్మీగారి కోసం ఎదురు చూస్తున్నారు. “అమ్మమ్మా! మేం రెడీ “అంటూ.
ఈ రోజు నెట్ (ఇంటర్నెట్)లో ఒక కథ చదివాను చాలా బాగుంది. మీకు చెప్పాలనిపించింది అందుకే పిలిచాను అన్నారు లక్ష్మిగారు.
మా లెక్చరర్ ఒకరు ఇంగ్లీషు క్లాసు ప్రారంభంలో బోర్డు మీద వ్రాసిన మొదటి వాక్యం.
‘ఇట్ఈజ్ ఇంపాసిబుల్ టుసే వాట్ ఈజ్ ఇంపాజిబుల్’ అని, ముందు ఇంగ్లీష్ చాలా కష్టంగా ఉండేది.
‘ప్రపంచంలో అసాధ్యమైనదేదో చెప్పడం అసాధ్యం’ అని అంటే ప్రపంచంలో అసాధ్యమైనది మనం చేయలేనిది లేదు. అలాంటి కథ ఒకటి చదివాను అన్నారు లక్ష్మిగారు. మీకు తెలిసిన వంతెనలు (బ్రిడ్జెస్)ఏవో చెప్పండి అన్నారు లక్ష్మిగారు.
కృష్ణా బేరేజ్ అంది లాస్య
ధవళేశ్వరం అన్నాడు రఫీ
హౌరా అన్నారు అందరూ ఒక్కసారిగా
న్యూయార్క్లో ‘బ్రూక్లిన్ బ్రిడ్జ్’ తెలియని వారుండరు.
150 ఏళ్ళ క్రితం జాన్ రోయిబ్లింగ్ అనే అతడు ఒక జర్మన్, అతడు న్యూయార్క్కి ఒక బ్రిడ్జి కట్టాలని అనుకున్నాడు. కాని ఎవరూ అతడి మాటకు విలువ ఇవ్వలేదు. పైగా ‘అసాధ్యం’ అన్నారు. చాలా ఏళ్ళకు అతడి కొడుకు వాషింగ్టన్ తండ్రి మాటకు సరే అన్నాడు. ఇద్దరూ ఒకప్లాన్ తయారు చేశారు. కొంతమంది ఇంజనీర్లను కూడ కట్టుకున్నారు. బ్రిడ్జ్ పని ప్రారంభం అయింది. కొన్నేళ్ళకు బ్రిడ్జి దగ్గర జరిగిన ప్రమాదంలో తండ్రి అయిన జాన్ రోయిబ్లింగ్ మరణించాడు. అయినా పని ఆపకూడదు తండ్రి కోరిక తను నెరవేర్చానుకున్నాడు వాషింగ్టన్ రోయిబ్లింగ్. కాని విధివశాత్తు `వాషింగ్టన్కు (కొడుకు) బ్రైన్ దెబ్బతినడంతో శరీరం మొత్తం చచ్చుబడి పోయింది. అతను మంచం మీదనుంచి కదలేడు. మాట్లాడలేడు.
‘మేం చెబితే విన్నారా తండ్రీ కొడుకులూ ఇప్పుడేమయింది. ఆ బ్రిడ్జ్ కట్టడం మీ వల్ల కాదు’ అని రోయిబ్లింగ్ ఫామిలీ గురించి, తండ్రీ కొడుకుల ఆలోచనలను తెలిసినవారు వెక్కిరించారు.హేళన చేశారు..
తన గదిలో మంచం మీద పడుకున్న వాషింగ్టన్ కిటికీ పరదాలు తొలిగి ఒకరోజు సూర్యకిరణాు లోపలికి వచ్చి పడ్డాయి. ఒక్క వేలు మాత్రం కదిలేది. దానితో భార్య చేతిమీద కొట్టాడు. ఆవిడ అతడికేసి చూసింది కొన్నాళ్ళకు ఒక కోడ్ భాష తయారు చేసుకున్నారు భార్యాభర్తలు. భర్త కోరిక మీద బ్రిడ్జ్ మీద పని చేసిన ఇంజనీర్లను పిలిపించింది. అతడి కోరిక తెలిపి ఆదేశాలు వినిపించింది. వాళ్ళు పని ప్రారంభించారు. పదమూడు ఏళ్ళు వాషింగ్టన్ రోయిబ్లింగ్ భార్య చేతిమీద కొడుతూ చెప్పిన ప్రకారం అమె ఆ ఇంజనీర్లకు చెప్పేది. ఆ ప్రకారం వాళ్ళు చేశేవారు.
అందరూ అసాధ్యం అన్న బ్రిడ్జి అందంగా ఆవిష్కరించబడింది. ఒక చారిత్రాత్మక కట్టడంగా నిలిచిపోయింది.
ఆ బ్రూక్లిన్ బ్రిడ్జి మొత్తం శరీరం చచ్చుబడి ఒక వేలు మాత్రం కదల్చగలిగే ఒక వ్యక్తి పట్టుదలకు ప్రతిరూపం. తండ్రి కోరిక తీర్చాలనే ఆ కొడుకు తపనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఆ బ్రిడ్జిని ఎవరికి అంకితమివ్వాలో అనుకున్నప్పుడు తొలిసారి అందరూ హేళన చేసినా వాషింగ్టన్ రోయిబ్లింగ్ మీద నమ్మకముంచి అవిరామంగా శ్రమించి బ్రిడ్జి పూర్తి చేసి ఇంజనీర్లకు అంకితమివ్వాలి లేదా పదమూడేళ్ళు భర్తకు సహకరించి అతడి సంజ్ఞు అర్థంచేసుకుని ఇంజనీర్లకు ఆదేశాలిచ్చిన వాషింగ్టన్ రోయిబ్లింగ్ భార్యకు అంకితమివ్వాలి. అంటూ ముగించారు లక్మిగారు. అందరూ చప్పట్లు కొట్టారు.
ఒక్క వేలు మాత్రమే కదల్చగలిగిన వాడు ఆత్మవిశ్వాసంతో పదమూడేళ్ళు, తెలివి తేటలున్న వాళ్ళు మీరంతా ఎలా వుండాలో మీకే తెలుసుగా అన్నారు లక్ష్మిగారు. బిస్కెట్లు రెండు ప్లేట్లలో పెట్టి ముందు పెట్టి నీళ్ళు ఇస్తూ.
థాంక్యూ అమ్మమ్మా!! ఈసారి పరిక్షల్లో మా పట్టుదల ఏమిటో చూద్దురు గానీ అన్నారందరూ ముక్తకంఠంతో.. వారిలో కిరణ్ కూడా ఉండటం చూచి విజయసంకేతం చూపిస్తూ లోపలికి వచ్చారు వేణుగోపాల్రావుగారు.
*****
1 thought on “మాడర్న్ అమ్మమ్మ చెప్పిన మాడల్ కధలు … బ్రిడ్జి”