రచన: వసంతశ్రీ
పొద్దున్న లేస్తూనే దేముణ్ణి పూజిస్తాం-
ఇంట్లో ఇల్లాలిపై మాత్రం కసుర్లు.
శివుడు తనలో అర్ధ భాగమిచ్చాడని తలుస్తూ-
నీకేమీ తెలీదని భార్యని దెప్పి పొడుస్తూ.
పుస్తకాన్ని సరస్వతీ అని నమస్కరిస్తుంటాం-
ప్రతీదానికీ పేపర్ చెత్త కోసం వాడతాం.
అగరబత్తి డబ్బా పైన ఉండే దేముని బొమ్మనీ దాస్తాం-
ప్రతీ అబద్దానికీ దేముడిపై ఒట్టేస్తూ.
లక్ష్మీ దేవిని పూజిస్తూ-
లక్ష్మీ బాంబుని పెల్చేస్తూ దీపావళి.
ప్రతీ రోజూ గుడి కెళ్లాలని ప్రయత్నిస్తాం-
వెళ్ళినా వరసలోనిలబడకుండా ముందుకు తోసుకెళ్ళిపోతూ.
ప్రసాదం కళ్ళకద్దుకుని తింటాం-
చేతిని గుడి గోడలకి రాసేస్తూ…(మనం శుభ్రంగా ఉండాలి కదా!!)
అందర్లో దేముణ్ణి చూడమన్నాడని తెలుసు-
కానీ మన స్వార్ధం మాత్రం మనదే!!
మన సుఖం,మన సంతోషం మన భావోద్వేగాలూ మనకి ముఖ్యం.
మన ఈర్ష్యా అసూయాలని సరి అయినవే అని చూపడానికి –
మనం ఎంతైనా వాదిస్తాం.
చేసింది ఎంత తప్పైనా సమర్ధించుకోడానికీ మన తెలివితేటల్ని వాడతాం.
కానీ మనకి తెలిసిన జ్ఞానాన్ని మన అభ్యున్నతికి వాడే అవకాశం తీసుకోము.
ఉన్న ఒక్క జన్మని పరోపకారానికీ వాడి,
సక్రమంగా ఉపయోగించడానికే 84కోట్ల జీవరాశులలో ఉత్కృష్టమైన ఈ జన్మని వృధా చేసుకోవద్దు.
అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని..
అందుకే ఇలా ఉంటామేమో..
ఏవిటో….నేననుకునేవన్నీ మీరు అక్షరరూపం ఇచ్చేసేరు….
చాలా బాగుంది