రచన: రమా శాండిల్య
హరి ఓం
మిత్రులందరికీ శుభోదయ వందనం
ఈ రోజు నుంచి యోగాను గురించి తెలుసుకొందాం
యోగా అనగానే అందరికీ ఆసనంలో కూర్చోడం అనుకుంటాము. కదలకుండా ఒక చోట కూర్చోవడం అనుకుంటాము
కానీ మా గురుదేవులు యోగా అంటే ఒక క్రొత్త అర్థం చెప్పారండి.
యోగా అంటే యోగం అంటే మహర్జతకం అని అర్థంట.
అందుకే ప్రతి వారు రోజులో కొంత సమయం ఆ యోగాన్ని అనుభవించి తెలుసుకోవాలని అనేవారు.
కొంత సమయం యోగా చేయడం వల్ల 24 గంటల సమయం ప్రశాంతంగా ఉండొచ్చు
యోగాను 3 భాగాలుగా చేస్తుంటాం. అవి ఆసనం, ప్రాణాయామం, ధ్యానం కానీ అవి మూడు కలిసి ఒక్కటిగా చేయాలి ఆ పద్ధతిలో చేస్తే మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే యోగా అంటే ఆసనం, ప్రాణాయామం, ధ్యానం కలిపి చేసే ప్రక్రియ.
ఆసనం గురించి తెలుసుకుందాము ఏ ఆసనం వేయాలన్న మూడు స్థితులు ఉంటాయి.
ఒకటి శరీరాన్ని, మనసుని ఆసనం వైపుకు దృష్టి మళ్లేలా చేయడం.
రెండు ఆసనంలో కూర్చుని ఆ స్థితిని అనుభవించడం.
మూడు విశ్రాంతి స్థితి.
తప్పని సరిగా ఈ మూడు స్థితులు గమనించాలి.
ఆసనం వేయడం మొదలు పెట్టిన పటినుంచి విశ్రమా స్థితి అయేవరకు మన శ్వాసను గమనిస్తూ ఉండాలి.
శ్వాస అంటే పై పెదవి మీద తగిలే గాలి రూపంగా వచ్చే ఉచ్వసా, నిశ్వస లను గమనిస్తూ ఉండాలి.
ఆసనం వేస్తున్నంతసేపు కళ్లు మూసి ఉంచాలి.
ఆసనం నుంచి విశ్రమం అయ్యేవరకు అయ్యాక కూడా కొంచంసేపు అదే స్థితిలో ఉండాలి
రోజు యోగాకు కూర్చున్నపుడు ఓం కారం మూడుసార్లు గట్టిగా నాభి నుంచి తల వరకు ఊహిస్తూ శబ్దం చేస్తూ తల పై భాగానికి చేరగానే పెదవులు మూసి గొంతుతో శబ్దం చేస్తూ శబ్దం తక్కువ చేయాలి ఇలా మూడు సార్లు చేసి ఆసనాలు మొదలు పెట్టాలి.
ముందుగా సుఖాసనం గురించి తెలుసుకుందాం..
సుఖాసనంలో అందరం
ఈ ఆసనం వేయడం అందరికి తెలుసు. సాధారణంగా దీన్ని ఒక ఆసనం అనుకోరు. బాసింపట్టు వేసి కూర్చోవడం అని చెప్తారు. కానీ ఆసనాల్లో కెల్లా సుఖమైన ఆసనం అందుకే దీన్ని సుఖాసనం అంటారు.
ఎక్కువ సేపు కూర్చుని ఏ పనైనా చేయగల ఆసనం ఇది. ఈ ఆసనంలో పూజలకు, ధ్యానానికి ఎక్కువసేపు కూర్చోడం అవసరమవుతుంది
ఆసనం వేయడం వలన వెన్నుముక నిటారుగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది
సుఖాసనంలో ధ్యాన ముద్రలో కూర్చుంటే శాంతి పెరుగుతుంది. ప్రాణాయామం చేయడానికి అణువు అనువుగా ఉంటుంది
రోజు సుఖాసనంలో పది నిమిషాలు నుంచి కూర్చో గలిగినంత సేపు కూర్చోవచ్చు
శ్రీ గురుభ్యోనమః