April 24, 2024

విశ్వపుత్రిక వీక్షణం – 2035 లో…?!!

రచన: విజయలక్ష్మీ పండిట్

 

మా నాలుగో అంతస్తు అపార్ట్‌మెంట్  బాల్కనిలో రాత్రి 8 గం. సమయంలో కూర్చొని చూస్తున్న నాకు, బషీర్‌బాగ్‌  ఫ్లై ఓవర్‌పై వచ్చే వాహనాల లైట్లు మిణుకు మిణుకుమంటూ క్రిందికి జారుతూంటే కార్తీక పౌర్ణమినాడు నదిలో వదలిన దీపాలు అలలకు మెల్లగా కదులుతూ నదీ ప్రవాహంతో కూడా క్రిందికి ప్రయాణిస్తున్నట్టు అందంగా తోచాయి. ఆ దృశ్యాన్ని తిలకిస్తూ అలాగే ఆస్వాదిస్తూ వున్నాను.

అంతలో రెండు రోజుల ముందు నాతో పదవతరగతి చదువుతున్న నా మనుమడు జయ్‌ జరిపిన సంభాషణ గుర్తుకొచ్చింది.

ఆ రోజు జయ్‌ ఇంటికి వచ్చి ఫ్రెషప్‌ అయి టీవీ చూస్తూన్న నా పక్కన కూర్చున్నాడు.

”హాయ్‌ అమ్మమ్మా…’ అంటూ..,

”హాయ్‌ నాన్నా జయ్‌, వాట్ ఈజ్‌ ద టుడేస్‌ న్యూస్‌ అబౌట్ యువర్‌ స్కూల్‌. ఈ రోజు మీ స్కూల్‌ విశేషాలేంటి చెప్పు” అన్నాను.

తెలుగు భాష కూడా అర్థం కావాలని రెండు భాషల్లో అడుగుతూ, మాట్లాడుతుంటాను. స్కూల్స్‌లో ఎలాగూ అంతా ఇంగ్లీష్‌లోనే కదా మాట్లాడుకుంటారు. మన తెలుగు భాషను మరిచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను తెలుగులో సంభాషణకు దింపుతాను. మధ్యలో అర్థం కాకపోతే ఇంగ్లీషులో చెప్పి తెలుగు అర్థాలు చెపుతూ. మన మాతృభాష తెలుగును బతికించుకోడానికి మనం పాటించాల్సిన పద్ధతనిపించింది నాకు. ముఖ్యంగా అమెరికాలో పెరిగి ఇండియాకు వచ్చిన పిల్లలకు.

”అమ్మమ్మా ఈ రోజు మా స్కూల్‌లో చాలా వండర్‌ఫుల్‌ డిస్కషన్‌ జరిగింది మా ఫిజిక్స్‌ క్లాస్‌లో. మా టీచర్‌ సెల్‌ఫోన్స్‌, నెట్వర్క్స్‌ను, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంపాక్ట్‌ గురించి మాతో డిస్కస్‌ చేస్తూ, ఒక ప్రశ్న వేశారు” అంటూ ఆగి..

”క్యాన్‌ యు ఇమాజిన్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ ద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ 5జి  టెక్నాలజీ నెట్వర్క్‌ మొబైల్స్‌ ఆన్‌ హూమన్‌ సొసైటీ? ఇమాజిన్‌ ద పిక్చర్‌ ఆఫ్‌ ద సొసైటీ ఇన్‌ 2035” అని అడిగారు. అంటే కృత్రిమ మేధస్సు, 5 జి టెక్నాలజీ సెల్‌ఫోన్స్‌ యొక్క ప్రభావం మానవ సమూహాలపై ఎలా వుంటుందో, 2035 సంవత్సరం నాటికి మానవ జీవితాన్ని గూర్చి ఊహించగలరా? అని ప్రశ్నించారు. మా ఫ్రెండ్స్‌ నలుగురైదుగురు మ్లాడినాక నేను 2035లో హుమన్‌ సొసైటీ ఎలాగుంటుందో, ఎదుర్కొనే సమస్యలేవో నా ఇమాజినేషన్‌ను చెప్పాను. నా సమాధానం విని మా టీచర్‌ నన్ను అప్రిషియేట్ చేశారు అమ్మమ్మా” అన్నాడు జయ్‌.

”అవునా నాన్నా.. వెరీగుడ్‌..” అని ” ఏంటి  నీ సమాధానం జయ్‌ ఎలా ఉంటుంది 2035లో మన సొసైటీ. ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, 5 జి టెలికమ్యూనికేషన్‌ నెట్వర్క్‌లు తెచ్చే మార్పులు ఏమి చెప్పు” అన్నాను.

జయ్‌.., ”నేను మొదట, ప్రపంచ దేశాలు ముఖ్యమైన ఇన్నోవేషన్స్‌ చేపట్టాల్సి వుంటుందన్నాను. అదేమంటే మనిషికి ఆకలి లేకుండా చేయడం. మనిషి శరీరాన్ని పోషించే పోషకాలు చెట్టులాగ మనిషే తన శరీరంలో తయారు చేసుకొనే జీవరసాయన పరిశోధనలు చేయాల్సి వుంటుంది” అన్నాను.

”ఎందుకు అలా అనుకుంటున్నావు జయ్‌”అని అడిగారు మా టీచర్‌.

” ఎందుకంటే 2035/2040కి దాదాపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోట్స్  ప్రపంచంలో విద్య, వైద్య వ్యవసాయం, ఫుడ్‌ ప్రొడక్షన్‌ దాదాపు అన్ని రంగాలలో మనుషులు చేసే పనులన్ని మెషీన్స్‌ చేపట్టటం జరుగుతుంది. వాహనాలు డ్రైవర్స్‌ లేకుండా నడుస్తాయి. హోటల్స్‌లో, రెస్టారెంట్స్ లో వంట మనుషులు, క్యాటరర్స్‌ లేకుండా మిషన్స్‌ను రోబోట్స్ ను కంట్రోల్  చేయడానికి ఇద్దరు ముగ్గురు మనుషులుంటే చాలు.  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ సహాయంతో రోబోట్స్  చేతనే అన్ని పనులు జరిగిపోతాయి. ఒకసారి మెషిన్స్‌పై ఇన్‌వెస్ట్‌ చేశాక చాలామంది మనుషుల సేవలు అవసరం లేకుండా లాభాలు గడిస్తారు పరిశ్రమల, అన్ని రంగాల పెట్టుబడిదారులు. మనిషికి సంపాదనకు  ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఉద్యోగాలు లేక డబ్బులు లేకపోతే వారికి ఆకలి ఎలా తీరుతుంది? ఎలా పోషించుకుంటారు కుటుంబాలను.  జనాభా ఎక్కువగా ఉన్న మన దేశం, చైనా దేశంలోని ప్రజలకు ఉపాధి, ఆదాయం కోల్పోయే పరిస్థితి వస్తుందేమో. ఇక 5జి టెక్నాలజీతో పరిశ్రమలలో ఇప్పటికంటే దాదాపు వందరెట్లు వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసే నెట్వర్క్‌ వచ్చి మనుషుల ఇన్‌వాల్వ్‌మెంట్ ను డ్రాస్టిక్ గా తగ్గిస్తాయి. మైక్రో సెకండ్స్‌లో అతి వేగంగా డేటా అంది ఒక దాని వెంబడి ఒకటి పనులన్ని మిషన్స్‌ చేసే సిస్టమ్స్‌ వస్తాయి. ఇక ప్రజలకు ఉపాధి ఏది? ప్రజలకు ఆకలెలా తీరుతుంది? నిరుద్యోగం వల్ల అరాచకాలు పెరుగుతాయి. మరి ఇక ఉన్న సొల్యూషన్‌ మనిషికి ఆకలి లేకుండా చేయడమే కదా? శరీర వృద్ధికోసం తన  ఆహారం తానే వృక్షాల్లాగా తయారు చేసుకోవడంతో ఎన్నో సమస్యలు లేకుండా పోతాయి కదా అమ్మమ్మా? నా సమాధానానికి మా టీచర్‌, క్లాస్‌మేట్స్  పెద్దగా నవ్వుతూ క్లాప్స్‌ కొట్టారు.” అని మరలా జయ్‌..,

”అమ్మమ్మా.. 2030/40 నాటికి భూమిపై అప్పటి వాతావరణం మార్పులు విపరీతంగా వుంటాయి. రాబోయే పరిస్థితులను ఊహిస్తే మనుషులు ఎక్కువ ఇంటిపట్టునే ఉండే పరిస్థితి వస్తుంది. ఇంటివద్దనుండే పనులు సర్వీసెస్‌ చేయడం వల్ల ఎక్కువ వాహనాలు నడువవు. ట్రాన్స్‌పోర్ట్‌ కొరకు కార్ల డిమాండ్‌, తయారి తగ్గుతుంది. పెట్రోలు బాధలు వుండవు. వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యం తగ్గుతుంది. సర్వీసెస్‌ ఇంటివద్దనుండే చేస్తారు. కాని అన్ని రంగాలలో  మనిషి అవసరం లేకుండా క్రమంగా రోబోలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మెషిన్స్‌ మనిషి చేసే పనులు చేయడం మొదలు పెడితే మనిషి ఎలా బతుకుతాడు సంపాదన లేకుండా? ఇప్పటికే కొన్ని పెద్ద పెద్ద హోటల్స్‌లో రోబోలు వండటం, వడ్డించడం చేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆపరేషన్స్‌ చేయడానికి గంటలు, గంటలు నిలబడి చేయలేక, ఇతర అసిస్టెంట్స్  ఖర్చులు తగ్గించుకోవడానికి డాక్టర్స్‌ రోబోలను ఆశ్రయిస్తున్నారు. విద్యారంగంలో కూడా ‘లర్నింగ్‌ త్రూ రోబో’ అని భవిష్యత్‌లో ఆన్‌లైన్‌లోనే చదవడం, రోబోల ద్వారా పరీక్షలు వ్రాయడం అన్ని జరిగిపోతే టీచర్స్‌ అవసరం లేకుండా పోతుందేమో కదా అమ్మమ్మా..” అన్నాడు జయ్‌.

నేను జయ్‌ మాటలు వింటూ అలా చూస్తూండి పోయాను వాడివైపు. ఎంత ఎదిగిపోయారు ఈ కాలం పిల్లలు. మన సమాజంలో వచ్చే మార్పులను ఎంతగా గమనిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ తెచ్చే మార్పులు యువతను ఆకట్టుకుంటున్నాయి, అనుకుంటూ..,

”ఎక్కడ ఎప్పుడు చదివావురా నాన్నా.. ఈ కొత్త టెక్నాలజీల గురించి” అన్నాను.

”నేను ఎక్కువ లేటెస్ట్‌ టెక్నలాజికల్‌ డెవలప్‌మెంట్స్  గురించి నెట్ లో చదువుతుంటాను. అవన్నీ చదువుతున్నప్పుడు, రాబోయే ప్రపంచ పరిస్థితులను ఊహిస్తూ ఉంటాను అమ్మమ్మా” అన్నాడు.

మా ఇద్దరి ఆ సంభాషణతో నా మెదడు నుండి ఒక పాత జ్ఞాపకం జారిపడింది. ఆ జ్ఞాపకం నా చిన్ననాి, నేను చదివిన ఒక కథల పుస్తకం నా మెదడులో అప్పుడప్పుడు మెదలుతుండేది. ఆ కథ పేరు ‘అంతా గమ్మత్తు’. ఇప్పుడు జయ్‌ ఊహించిన భవిష్యత్‌ కాల పరిస్థితులు దాదాపు ఏభై అరవై సంవత్సరాల ముందే నేను చదివి ఆశ్చర్యపోయిన  కలలాిం ఆ కథ గుర్తుకొచ్చి జయ్‌తో అన్నాను.

”జయ్‌ నా చిన్నప్పుడు దాదాపు నీ వయసులో మా ఊరి లైబ్రరీలో చదివిన ‘అంతాగమ్మత్తు’ అనే కథ గుర్తుకొస్తూందిరా నాన్నా నీ ఊహా ప్రపంచాన్ని వింటూంటే” అన్నాను.

” ఏంో ఆ కథ చెప్పు అమ్మమ్మా” అన్నాడు జయ్‌.

ఆ కథను నెమరు వేయడానికి నా మెదడు, అదే నా జ్ఞాపకాలు ఏభై ఏండ్లు వెనక్కి నడిచాయి టైం మెషిన్‌లో. ఆ కథను చెప్పసాగాను.

*****

”అంతా గమ్మత్తు’ కథ ఎవరు రాసారో గర్తులేదు నాకు కాని ఆ కథ చదివినప్పుడు ముద్రించిన చిత్రాలు నా మెదడులో బలమైన జ్ఞాపకాలుగా మిగిలి పోయాయి జయ్‌”

”ఆ కథలో ఒక మనిషి దాదాపు నిర్మానుష్యంగా వున్న భూమిపై నుండి భూమిలోకి ప్రయాణించే ఒక టన్నెల్‌ ద్వారా భూ గర్భంలోకి దిగుతాడు. దిగిన దారి ఒక భూగర్భ పట్టణ వీధిలో నిలబెడుతుంది అతన్ని. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంాయి. అతనికి మండిపోతున్న వేడిగాలులు వీస్తున్న భూతలంపైనుండి భూగర్భంలో కొంచెం చల్లగానే అనిపిస్తుంది. అంతలో ఒక కారు వచ్చి అతని ముందు నిలబడుతుంది. కారులో ఎవ్వరూ వుండదు. డ్రైవర్‌ కూడా లేకుండా ఆ కారు నడిచింది. డోర్‌ తెరుచుకుని లోపలకూర్చో మని ఇన్‌స్ట్రక్షన్‌ వినిపించడంతో అతడు కారులో ఎక్కి కూర్చుంటాడు. ఆ కారు అతన్ని ఒక అరగంట తరువాత ఒక భవనం ముందు దింపుతుంది లోపలికి వెళ్ళమని ఆదేశిస్తూ. అతడు కారు దిగి లోపలకు వెళతాడు. మనుషులెవరూ కనిపించరు. లోపల నడిచి వెళుతుండగా ఎదురుగా ఉన్న పెద్ద గది నుండి ‘లోపలికి రండి’అన్న పిలుపు వినిపిస్తుంది. అతడు మెల్లగా తలుపు తెరుచుకుని లోపలకు వెళతాడు. ఆ గదిలో గోడలపై చుట్టూ టీవి స్క్రీన్‌లు, మధ్యలో పరుచుకున్న ఒక పెద్ద కీ బోర్డుల ముందు ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. కీ బోర్డు నొక్కుతున్న మనిషికి రెండు వేళ్లు మాత్రమే ఉంటాయి చెరొక చేతికి.

రమ్మని తలవూపి తన పని, కీ బోర్డ్‌ ఆపరేట్ చేస్తూ ”ఎక్కడ వుంటావు” అని అడుగుతాడు. హోటల్‌ పేరు చెపుతాడు. వచ్చిన మనిషి ‘మీ పట్టణంలో మనుషులు కనిపించలేదని’ అడుగుతాడు. మా దేశంలో జనాభా చాలా తక్కువ. దాదాపు ఇరవై సంవత్సరాల ముందు భూమి మీద వాతావరణ కెలామిటీల వల్ల జనం చాలామంది చనిపోయారు. అందరు భూగర్భంలోని ఇండ్లలోనే వుంటారు. వేడిగాలుల వల్ల ఎక్కువ బయటకు తిరగడం తక్కువ. అందరికి అన్ని ఇంటికి సప్లై అవుతాయి మెషిన్స్‌ ద్వారా. ఆ వాతావరణాన్ని తప్పించుకోడానికి భూగర్భంలో సిటీలను నిర్మించాము. అంతా ఎక్కువ మిషన్స్‌తో నడుస్తుంది అని ముగిస్తాడు. వచ్చిన అతను తిరిగి బయటకు వెళ్ళినపుడు తాను వచ్చిన కారు అతన్ని హోటల్‌ ముందు దింపుతుంది. హోటల్‌ ప్రక్కన ఉన్న షాపులోకి వెళతాడు. మనిషిని బోలిన ఆకారంలోని మిషన్‌  స్వాగతం చెప్పి ఏమి కావాలని అడిగి టైప్‌ చేసుకుని అన్ని తెచ్చి పెడుతుంది. అతను ఆ రోబో ఇచ్చిన బిల్లును చెల్లించి హోటల్‌ లోకి వెళతాడు. హోటల్‌ రిసెప్షన్లో కూడా రోబోనే చెకిన్‌ ఏర్పాట్లు చేస్తుంది. ఆ మనిషి అనుకుంటాడు ఈ సిటీలో అంతా గమ్మత్తుగా ఉందే అని.

”ఆ కథ నా జ్ఞాపకాలలో నిలిచిపోయి ఒక కలలాగా అనిపించినా, ఇప్పుడు నీ భవిష్యత్‌ ఊహల ప్రపంచాన్ని తలపిస్తుంది జయ్‌”అన్నాను.

”వెరీ ఇంటరెస్టింగ్‌ అమ్మమ్మా.. ఫిఫ్టీ, సిక్స్‌టీ ఇయర్స్‌ ముందు వ్రాసిన కథ అంటే ఆ రైటర్‌ ఫ్యూచర్‌ను ఎంత బాగా ఇమేజిన్‌ చేశాడో కదా! అమ్మమ్మా. నీవు చదివిన ఆ కథలోని పరిస్థితులు మార్పులు వస్తాయేమో క్రమంగా. వాతావరణ మార్పుల వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగిపోయి, నీరు లేక జననష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక నివాసాలన్నీ అండర్‌ గ్రౌండ్‌లో వెలుస్తాయేమో, అంతేకాదు ఇంకో గ్రహానికి ”మార్స్‌” గ్రహంపై మానవ నివాసానికి ప్రయోగాలు జరుగుతున్నాయి” అని జయ్‌ అంటుండగా షాపింగ్‌ చేసుకుని వాళ్ళ అమ్మ రావడంతో ”హాయ్‌ అమ్మా…” అంటూ లేచి వెళ్ళాడు జయ్‌.

*****

ఇప్పుడు బాల్కనీలో ఆ దీపాల ధారలాగా మిణుకుమిణుకు మని మెరుస్తూ జారుతున్న కార్లను చూస్తుంటే.. సన్నగా వస్తున్న కార్ల శబ్దం వింటుంటే.. ఇంకో పది ఇరవై సంవత్సరాలకు కార్ల సంఖ్య తగ్గి కారు నడవడం తగ్గిపోతుందా? ముందు ముందు వేగవంతమైన సాంకేతిక మార్పులతో ప్రజల జీవితంలో ఏ అనూహ్య మార్పులు చోటు చేసుకో నున్నాయో. వాతావరణం మార్పులతో మనుషులు ఏ అవాంతరాలు ఎదుర్కోవలసి వస్తుందో అని ఒక రకమయిన భయంతో కూడిన ఆలోచనలు చుట్టుమ్టుాయి నన్ను.

బాల్కనీకి దగ్గరగా లైట్ల వెలుగులో మా వీధికి ఇరువైపులా ఉన్న చెట్లు నాకు అకస్మాత్తుగా చెట్టు ఎత్తున్న పదిచేతులు పైకి చాచి నిలుచున్న పచ్చని దేహాలతో ఉన్న మనుషులుగా తోచారు.

జయ్‌ చెప్పినట్లు మనుషులు కూడా చెట్లలాగా స్వయం పోషకాలుగా మారిపోతే ఈ ఈతిబాధలు  సమిసిపోతాయా అనే ప్రశ్న నా మనసులో ఉదయించింది.

 

******

1 thought on “విశ్వపుత్రిక వీక్షణం – 2035 లో…?!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *