రచన: ఉమాదేవి కల్వకోట
అది ఫిబ్రవరి మొదటివారం.అంత ఎండగానూలేదూ అంత చల్లగానూ లేదు.వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.బయటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆఇంట్లో మాత్రం
అందరూ చాలా ఆందోళనగా,అసహనంగా ఉన్నారు.
“మనకిదేం ఖర్మ అన్నయ్యా. ఎక్కడయినా పిల్లలతో తల్లిదండ్రులకు ఏవో సమస్యలు రావడం గురించి విన్నాం కానీ,
తండ్రితో తమ పిల్లలకు ఇంత పెద్ద సమస్య రావడం మనవిషయం
లోనే చూస్తున్నాం.నాకయితే పిచ్చిలేచిపోతోంది.ఎలా అన్నయ్యా
ఈసమస్యనెలా పరిష్కరించడం?”అసహనంగా అన్నాడు కిషోర్.
“ఏమోరా.నాకేం పాలుపోవడంలేదుఇది నేనసలు కలలోకూడా
ఊహించలేదు.ఎవరినయినా సలహా అడుగుదామన్నా సిగ్గుచేటు.
ఛ…ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు”అంటూ తలని ఓచేత్తో నొక్కుకుంటూ కోపంగా అన్నాడు ప్రదీప్.
“మావారికయితే ఎలాగోలా నచ్చచెప్పొచ్చుకానీఈవిషయం
వింటే మాఅత్తగారువాళ్ళేమనుకుంటారో ఏమో.వాళ్ళందరి
ముందు ఎలా తలెత్తుకుతిరిగేది.పరువు పోయేట్టుంది”అన్నది
సునీత.
“సరేలెండి…అలాజరక్కుండా చూద్దాం. ఎలాచేయాలో,ఏం
మాట్లాడాలో బాగా ఆలోచించి,రేపు ఎదోఒకటి తేల్చేద్దాం”అన్నాడు
కిషోర్.
ఇంతకీ వీళ్ళందర్నీ అంతలా కలవరపరుస్తున్న విషయమేంటంటే…
రాజారాంగారు,విమలమ్మగార్లది అన్యోన్యదాంపత్యం.
చక్కని సంసారం.రాజారాంగారు ఉద్యోగంలో స్వశక్తితో అంచెలం
చెలుగా ఎదిగి,మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు.ఇద్జరబ్బాయిలు,
ఒకమ్మాయినీ బాగా చదివించి,మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు
చేసారు.అందరూ పిల్లాపాపలతో సుఖంగా ఉన్నారు. ప్రదీప్ చెన్నైలో,కిషోర్ బెంగుళూర్లో,సునీత వైజాగ్ లో స్థిరపడ్డారు.
రాజారాందంపతులు పిల్లలకు అవసరమన్నప్పుడు అప్పుడప్పుడూ పిల్లలదగ్గరికి వెళ్ళొస్తూ,తీర్థయాత్రలతోపాటు,సింగపూర్, హాంకాంగ్ లాంటి
విహారయాత్రలూచేస్తూ హాయిగా కాలక్షేపం చేస్తుండేవారు.
ఇద్జరిదీ ఉన్నంతలో జీవితాన్ని చక్కగా అనుభవించాలనే
మనస్తత్వం కావడంతో,అందులో ఇప్పుడు బాధ్యతలు కూడా
పెద్దగాఏమీలేకపోవడంతో,సినిమాలూషికార్లు,హోటళ్ళంటూ
సంతోషంగా ఉండేవారు.
చుట్టాలూస్నేహితులు అందరూ జీవితమంటేవీళ్ళదే అని
అనుకునేంత ఆనందంగాఉండేవారు
విమలగారికి సరోజ అనే చిన్నప్పటి స్నేహితురాలు ఉంది.
పాపం ఆవిడకి మూడేళ్ళక్రితం భర్త చనిపోవడంతో ఒంటరిదయిపోయింది.ఉన్న ఒక్కగానొక్కకొడుకు కెనడాలో
స్థిరపడిపోయి, ఈవిడని పట్టించుకోవడంమానేసాడు.విమలగారి
బలవంతంమీద ఎక్కడోదూరంగాఉన్న ఇల్లు అమ్మేసి,విమలగారిఇంటిదగ్ఖర్లోనే ఓఫ్లాటు కొనుక్కుంంది
అయినా సరోజ తనపరిధిలోతానుండేది.సినిమాలకీహోటళ్ళకీ
రాజారాంవిమలగార్లు రమ్మన్నా వెళ్ళేదికాదు.విమలాతానూ
కలిసి గుళ్ళకిమాత్రం వెళ్ళేవారు.ఎందుకంటేరాజారాంగారు గుడికి
వెళ్ళేందుకు పెద్దగా ఆసక్తిచూపేవారుకాదు.వారంలో మూడునాల్గు
సార్లయినా స్నేహితురాళ్ళిద్దరూ కలుసుకునేవారు.
ఇలా ఆనందంగా సాగిపోతున్న రాజారాంగారిజీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది.విమలగారికి వారంరోజులు విడవకుండా వైరల్ ఫీవర్ పట్టుకుంది.బాగా నీరసించిపోయింది.ఆజ్వరంలోనే
ఒకరోజు రాత్రి మందులేసుకొని పడుకున్న విమలతెల్లవారు మరిలేవలేదు.వెంటనె ఆసుపత్రికి తీసుకెళ్తే నిద్రలోనే గుండెపోటువచ్చి ప్రాణం పోయిందన్నారు. రాజారాంగారి సంతోష
కరమైన జీవితం ముగిసిపోయింది.
పిల్లలూ,బంధువులు అందరూ వచ్చారు.ఎవరితోనూ చేయించుకోకుండా,ముత్తైదువగా చనిపోయింది.చావులోనూ విమలమ్మ అదృష్టవంతురాలేనన్నారు.జరగాల్సిన కార్యక్రమాలు
అన్నీ సవ్యంగా జరిపించారు.ఇక ఏడాదిపాటు జరపాల్సినవన్నీ
అంటే మాసికాలూఅవీ ఎలాఅని తర్జనభర్జనలు జరిగాయి.తనకు
ప్రతినెలా రావడం కుదరదని,తండ్రినీ,తమ్ముడినీ చెన్నై కేరమ్మని,
అక్కడే ఏదో మఠంలోజరిపించేద్దామన్నాడు ప్రదీప్.ప్రతినెలారావడం తనకికూడా కుదరదని,పెద్దవాడుకాబట్టి
అన్నయ్యనే అవన్నీ చూసుకొమ్మన్నాడు కిషోర్. అలా ఏడాది
గడిచిపోయింది.సంవత్సరికాలు చనిపోయిన ఊర్లోనే పెట్టాలని,
అదే విమలగారిఆత్మకికూడా ఆనందమని,అందర్నీ తమ ఊరికేరమ్మన్నారు రాజరాంగారు.
ఇంటికి రంగులువేయించాలని,కోడళ్ళని వీలయితే కాస్తా తనకి
సాయంగా రమ్మన్నా రు రాజారాంగారు. కానీ వాళ్ళెవ్వరూ తమకు
వీలుకాదని,మనుషుల్ని పెట్టుకొని పనికానిచ్చుకొమ్మని,సంవత్సరి
కానికి ఎలాగోలా వస్తామన్నారు వాళ్ళు.సరోజ సాయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు రాజారాంగారు.
సంవత్సరీకానికి ఒకరోజు ముందు రాజారాంగారి ముగ్గురు పిల్లలు
వచ్చేసారు.కోడళ్ళు,అల్లుడు, పెద్దమనవడు కార్తీక్ ,అమ్మాయి కూతురు సాహితి మాత్రం వచ్చారు.మిగతా పిల్లలకు స్కూళ్ళు, కాలేజ్ లతో కుదర్లేదన్నారు.కార్తీక్ చిన్నప్పుడు కొన్నేళ్ళు తాతాబామ్మలదగ్గరున్నాడు కాబట్టి వాళ్ళంటే చాలా ఇష్టం.
తాతగారికి ఆరెండుమూడు రోజులయినా సాయం చేస్తానని
పట్టుబట్టి వచ్చాడు
శ్రాద్ధకర్మ జరిగేప్పుడు పురోహితుడు ఏదో ఒక సామాగ్రి కావాలని అడగడము,సరోజే అన్నీ చూసుకోవడంచూసి,కొడుకులూకోడళ్ళూ
మిగతావాళ్ళందరూ ఆనాల్రోజులు ఇంట్లోపనులుచూసువడానికి
ఆవిడని సాయమడిగారేమోననుకున్నారు.
ఆమూడురోజులూ అయ్యాక అసలు విషయానికి వచ్చారు
“నాన్నగారూ! ఇక మీరొక్కరే ఇక్కడ ఉండడం ఎందుకు?మీరూ
మాదగ్గరకు వచ్చేయండి”అన్నాడు ప్రదీప్.
“లేదురా..ఇది నాకు అలవాటైన ఊరు.ఇక్కడకాకుండా నేనెక్కడా
కంఫర్టబుల్ గా ఉండలేను”అన్నారు రాజారాంగారు.
“సరే ఈఊరు వదల్లేనంటే ఇక్కడే ఏదయినా ఓల్డేజ్ హోంలో
చేర్పిస్తాము”అన్నాడు కిషోర్”
“మీరెవరూ నాగురించి ఆలోచించి వర్రీ అవకండి. నేనుమీతోవస్తే
ఇక్కడ ఈఇల్లూఅదీ ఎవరుచూస్తారు.మీఅమ్మ జ్ఞాపకాలతో నేనిక్కడే ఉంటాను. మీకు తెలుసుగా మీఅమ్మ ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇల్లిది.పోనీ ఎవరికయినా అద్దెకిచ్చినా ఇంత పెద్దిల్లు సరిగా చూసుకోలేరు”అన్నారు రాజారాంగారు నిరాసక్తంగా.
“అదే మేమంటున్నది.మీఒక్కరికే ఇంత ఇల్లెందుకు?ఇదిఅమ్మేసి,ఓపదోపదహేనులక్షలో మీరుంచుకొని,మిగతాది మాకిచ్చెస్తే సరిపోతుందిగా”అన్నాడు ప్రదీప్.
“మీరు కావాలంటే మామగ్గురిదగ్గిరా తలా నాలుగునెల్లుంటే
గొడవుడదు కదా”పరిష్కారం సూచించాడు కిషోర్.
“నాదగ్గరుంటే మాఅత్తగారువాళ్ళేమనుకుంటారో..అయినా ఆడపిల్లదగ్గరుంటే నలుగురిలో బాగుండదు”అంది సునీత.
“అలాఅంటే ఎలా కుదురుతుంది… ఆస్థిదగ్గరేమో అందరూ సమానమేనంటావు.ఈక్వల్ షేర్ అంటావు.బాధ్యతనుండి
మాత్రం ఎస్కేప్ అయేందుకు చూస్తావేంటీ.”కోపంగా అన్నాడు
కిషోర్.
ఇంతలో లోపలిగదిలో ఉన్న కార్తీక్”మీఅందరికో విషయంచెప్పాలి
మొన్న ఇంటికి రంగులు వేయిస్తున్నప్పుడు,బామ్మ రోజూ చదువుకునే లలితాసహస్రనామాల పుస్తకంలో ఈ ఉత్తరం ఉందిట.తాతగారెంతో బాధపడుతూ నాకు చూపించారు.ఈ
విషయం మీకెవరికీ చెప్పొద్దన్నారు.కానీ నేనే మీకీవిషయం తెలిస్తేనే మంచిదని తెచ్చాను.”అంటూ ఒక లెటర్ ఇచ్చాడు.
దానిలో”. ఏవండీ!ఈజ్వరం నన్ను పీల్చిపిప్పి చేస్తోంది.నేను
బ్రతకనేమోననిపిస్తోంది.ఒకవేళ నేను బాగయితే మంచిదే..ఎప్పటిలాగే మీతో ఆనుదంగా జీవిస్తాను.ఒకవేళ
నాకేమయినా అయితే మీరొక్కరు అసలుండలేరు.పోనీ పిల్లల
దగ్గర సర్దుకుపోయి ఉండనూలేరు.మీగురించిన బెంగే నన్ను
కృంగదీస్తోంది.నాచివరి కోరికగా ఒకటడుగుతాను.నామీదేమాత్రం
ప్రేమ ఉన్నా కాదనకండి.
నాఫ్రెండ్ సరోజ చాలామంచిదని మీకూతెలుసు.తనూ ఒంటరిదే
పదిమందీఏమనుకుంటారో అనే ఆలోచన వద్దు. వాళ్ళెవ్ళరూ
మిమ్మల్ని ఆదుకోరు.సరోజ అయితేనే మనగురించి అన్నీ తెలిసిన
మనిషి కనుక మిమ్మల్ని బాగా చూసుకుంటుంది.తనకీఓతోడు దొరుకుతుంది. తల్లిపోతే పుట్టిల్లు ఉండదంటారు.మనపిల్లలకి
సరోజ తల్లి అయి నేనులేనిలోటు కొంతవరకు తీరుస్తుంది.
సునీతకి పుట్టింటికి వచ్చినప్పుడు చలిమిడి పెట్టే అమ్మ దొరుకు
తుంది.దయచేసి నా చివరికోరిక కాదనకండి”
మీ
.———
విమల.
అదిచదివిన ముగ్గురూ ససేమిరా ఒప్పుకోలేదు.ఈవయసులో
పెళ్ళేంటన్నారు.ఒకవేళ సరోజ ఈపెళ్ళికి ఒప్పుకున్నా అది డబ్బుకోసమేని తేల్చేసారు.కానీ కార్తీక్ అందరికీ ఖచ్చితంగా
సమాధానమిచ్చాడు.
“అమ్మా!తాతగారు బెంగుళూరుకు రెండంటేరెండు మాసికాలకి
వచ్చి నాలుగురోజులుంటేనే ఇలాప్రతినెలా ఈయనకిసేవలు
చేయాలా అని విసుక్కున్నావే.ఇక తాతయ్య ఉన్నంతకాలం
ఆయన్ని సరిగా చూసుకోగలవా?నిజంచెప్పు”
“బాబాయ్!నిజంచెప్పు.తాతయ్యని వృద్ధాశ్రమానికి పంపించే
ప్రతిపాదన పిన్నిదేకదా.తనమీద ఎలాంటి భారం పడడం పిన్నికి
ఇష్టంలేదు.పిన్నిమాటకు నువ్వు సై అన్నావు”
“ఇక అత్త ఆడపిల్లకి ఆస్థి కావాలంటుంది కానీ తండ్రి బాధ్యత
వద్దంటుంది.”
“అందుకేమీకెవరికీ ఏబాధాలేకుండా పాపం పోతూపోతూకూడా బామ్మ అందరి గురించీ ఆలోచించింది.దయచేసిదీనికి ఆడ్డు చెప్పకండి.సరోజగారు, తాతయ్యకూడా ఈపెళ్ళికి అస్సలు
ఒప్పుకోలేదు.నేనే బలవంతంగా ఒప్పించాను.ఇక సరోజ గారికి
మన ఆస్థిఅక్కర్లేదు.ఆవిడకి పెన్షన్ వస్తుంది. ఆవిడిల్లు ఆవిడకుంది.మీఆస్థి ఎక్కడికీ పోదు.దయచేసి అందరూ
తాతయ్య గురించి ఆలోచించి,బామ్మ చివరి కోరిక తీర్చండి.అన్నాడు.
ఎవ్వరూ ఏమీమాట్లాడకుండా ఆలోచించసాగారు.మళ్ళీ కార్తీకే
“ఎల్లుండి ముహూర్తం బాగుందట.నాకుకావాలని తాతయ్య
దగ్గరడబ్బు తీసకొని,గుళ్ళోపెళ్ళికి అన్నిఏర్పాట్లూ చేసేసాను.
మీరందరూవస్తే సంతోషం.లేదంటేమీ ఇష్టం”అని నిక్కచ్చిగా
చెప్పాడు కార్తీక్.
రాజారాంగారికి విమలగారి మాటగుర్తొచ్చింది”నువ్వన్నమాట నిజం విమలా.మనవడెప్పుడూ “మనవాడే”అని మనసులోఅనుకొని చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకున్నారు.