April 19, 2024

గోదావరి అలలలో అమ్మపిలుపు వినిపిస్తోంది

రచన : శ్రీపాద శ్రీనివాస్

ఉదయాన్నే 5.30 కి లేవడం…అమ్మ నిద్ర లేచిందో లేదో చూసుకోవడం..బయటకి వెళ్ళి పాలు తెచ్చి వాటిని మరగబెట్టి అమ్మని నిద్ర లేపడం, తదుపరి ఇంటి పనుల్లో అమ్మకి సహాయపడుతూ దైనందిన జీవితానికి ఉపక్రమించడం….ఇది రోజువారి మోహనవంశీ జీవితం….!!!!
ప్రతిరోజులాగే తనకి ఉదయం 5.30 కి నిద్ర నుండి మెలుకవ వచ్చింది..అవును బయటకి వెళ్ళి పాలుతేవాలి అనుకుంటూ ఆవలిస్తూ నిద్ర లేచాడు మోహనవంశీ..అమ్మ నిద్రలేచిందో లేదో చూద్దాం అనుకుంటూ ఒక్కసారి అమ్మ మంచం కేసి చూసాడు….అక్కడ అమ్మ లేదు..ఒక వేళ బాత్రుంకి వెళ్లిందేమో అనుకుంటూ కాసేపు అట్లాగే మంచం మీదనే ఉన్నాడు…ఎంత సేపు అయినా ఇంకా అమ్మరాకపోయేటప్పటికి గుండెల్లో ఏదో కొద్ది పాటి అలజడి ప్రారంభం అయ్యింది…ఈలోగా గోడ గడియారం 6 గంటలు అయిందంటూ గంటలు కొడుతూ శబ్ధం చేసింది..ఒక్కసారి ఉలిక్కిపడి మోహనవంశీ వర్తమానంలోకి వచ్చేసాడు….అప్పుడు అర్ధం అయింది తనకి…బాత్రుంకి వెళ్లిన అమ్మ ..ఇంకా రాలేదేంటబ్బా అని తాను అనుకుంటున్నది అంతా తన మనస్సును కమ్మేసిన అమ్మ జ్ఞాపకాలు అని…ఇంక అమ్మ ఎప్పటికిరాదని కాదు..కాదు…ఇంక లేదని.. అమ్మ అస్వస్ధతోదేవుని వద్దకు చేరుకున్నప్పటినుండి మోహనవంశీ ప్రతిరోజు అమ్మ దూరం అయిన అనంతరం అనుభవిస్తున్నమానసిక క్షోభ ఇది…!!.
అంతేనా మధ్యాహ్నం లంచ్ టైమ్ లో భోజనంచేసావా అంటూ అమ్మ చేసే ఫోన్ ఇంక రాదు అనితెలిసినప్పుడు మోహనవంశీకి ముద్ద గొంతు దిగడంలేదు… ఆఫీస్ నుండి ఇంటికి 10 కి.మిఉంటుంది…ప్రతిరోజులాగే ఆఫీస్ అయిపోయిన వెంటనేఇంటి వైపు పోయే బస్సు ఎక్కి చిన్నపాటి కునుకుతీస్తున్నాడు…ఈ లోగా ఏదో చిన్నపాటి శబ్ధం వినబడి ఇంటికి వచ్చేటప్పుడు ఏవైనా మందులు కాని,, పండ్లుఫలాలు తెమ్మంటూ ప్రతి రోజులాగే అమ్మ ఫోన్చేసిందేమో అనుకుంటూ ఉలిక్కిపడి లేచి జేబులో ఉన్నతన సెల్ ఫోన్ కేసి చూసుకున్నాడు మోహనవంశీ..కానిఫోన్ ఏమి రాలేదు..బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్వెయ్యడంతో వచ్చిన శబ్ధం అది…అప్పుడు మరలవర్తమానంలోకి వచ్చాడు మోహనవంశీ…అవును అమ్మచనిపోయింది కదా…ఇంక ఫోన్ ఎందుకు వస్తుంది అనుకుంటా తలంపు రాగానే అప్రయత్నంగానేమోహనావంశీ కంటిలోనుండి కన్నీళ్ళు కట్టలుత్రెంచుకుంటున్నాయి….చిన్నతనంలో గోరు ముద్దలుతినిపించిన అమ్మ…మరియు అదే చేతులలో నా చెయ్యిపట్టుకుని అడుగులు వేయడం నేర్పించిన అమ్మ ఇంకలేదా అనుకుంటూ మోహనవంశీకి గుండేలు ఉప్పెనస్పీడ్ తో బాధతో నిండి పోయింది…. భారమైన హృదయవేదనతో ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ సెల్ ఫోన్ లోనుండి తన ఫోన్ కి రింగ్ చేసుకున్నాడు…అప్పుడు తనసెల్ ఫోన్ లో అమ్మ అని డిస్ ప్లే రావడం చూసి అమ్మఫోన్ చేసింది అనుకుంటూ..ఆమె ఎక్కడికి పోలేదుఅనుకుంటునే బోర్ మని ఏడ్చేసాడుమోహనవంశీ…అప్పటి నుండి అమ్మని చూడలనిఅనిపిస్తున్నప్పుడల్లా అమ్మ సెల్ ఫోన్ లో నుండి తనసెల్ ఫోన్ కి డయల్ చేస్తూ సెల్ ఫోన్లో అమ్మ అనిచూడటాన్ని రీవాజుగా చేసేసుకున్నాడుమోహనవంశీ..!!!. ఇవేమీ పట్టనట్టుగా కాలచక్రంతనపని తాను చేసుకుపోతోంది..వారాలు..నెలలుగడుస్తున్నాయి..మోహనవంశీ మది లో మాత్రం అమ్మజ్ఞాపకాలు అట్లానే గూడు కట్టుకుని అయ్యి పలకరిస్తూనేఉన్నాయి…. హైదరాబాద్ లోనే ఉంటున్న మోహనవంశీ ఒకరోజు ఓ పని నిమిత్తం రాజమండ్రి బయలు దేరాడు
“హ్యాపి బర్త్ డే”…”జన్మదిన శుభాకాంక్షలు”.. “లాంగ్ లివ్”…అంటూ హితుల నుండి ఫోన్ లు, మెసెజ్లు వస్తూ ఉంటే హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తూట్రైన్ లో ఉన్న మోహనవంశీకి మెలుకవ వచ్చింది. తనజేబులోనుండి ఫోన్ ను తీసుకుని చూసుకుంటున్నాడుమోహనవంశీ ..అవును “ఈ రోజు తన పుట్టిన రోజు!!.. పుట్టినరోజు జరుపుకునే సందర్భం కాదు ఇది ఎందుకంటేఅమ్మపోయి రెండు నెలలు కూడ కాలేదు… మా అమ్మచనిపోయిన విషయం తెలియనికొందరు..తెలిసినప్పటికి బాధనుండి నన్ను డ్రైవర్ట్చేయడానికి మరి కొందరు తనకు మెసెజ్ లుపంపుతున్నారు అనకుంటున్నాడు మోహనవంశీ..ఆక్షణంలో కాస్తాంత బాధతో కండ్లు మూసి తెరిచి ట్రైన్ లోనుండి బయటకి చూస్తున్నాడు…తాడేపల్లి గూడెం రైల్వేస్టేషన్ కి ట్ర్తైన్ చేరుకుంది…!!
అలవోకగా ఒక్కసారి మోహనవంశీ కళ్ళుచెమ్మగిల్లాయి..ఎందుకంటే తనని అమ్మ ఈ ఉర్లోనేకనింది… అమ్మ నన్ను కనిన తేది వచ్చింది…అట్లాగేఅమ్మ తనను కన్న ఊరు కూడ ఇప్పుడు తన కళ్ళముందే ఉంది…కాని ఆ అమ్మే ఇప్పుడు తన చెంతనలేదు!!..ఓరి దేవుడా అనుకుంటూ మనస్సులో నుండిఉబికి వస్తున్న బాధను తొక్కిపెట్టుకునే ప్రయత్నంచేసుకుంటున్నాడు…ఆయినా ఆ దేవుడ్ని తలచుకుని ఏప్రయోజనం??..వాళ్ళందరు అమృతం తాగిన వాళ్ళుకదా!!.. మనుఘలు దూరం అవ్వడం దరిమిలా మిగిలిఉన్న వారికి దూరమైన వారి మమతానురాగాలజ్ఞాపకాలు ఉప్పెనలా చుట్టూ ముట్టం వంటి బాధలుఉండవు…ఆయినా తన అమ్మ వారి కంటే ఏమితక్కువ!!..వారి కంటే నా అమ్మే గొప్పది అనిమోహనవంశీ తన మనస్సులో అనుకుంటూ గుండెల్లోబాధని తమయించుకునే ప్రయత్నం చేసుకుంటున్నాడుమోహనవంశీ…
కాని తన మనస్సులో ఏదో తెలియనిబాధ..ఎందుకంటే అమ్మ బ్రతికున్న రోజులలో ఏదైనాప్రయాణం నిమిత్తం ట్రైన్ ఎక్కిన క్షణం నుండి అమ్మఫోన్ లు వచ్చేవి…ట్రైన్ జాగ్రత్తగా ఎక్కావా ??…ట్రైన్లో ఏమైనా తిన్నవా??…పని చూసుకుని వెంటనే తిరిగివచ్చేయ్ అంటూ అమ్మ ఫోన్ చేసేది!!… అంతేనా..తిరిగిఇంటికి చేరుకోగానే అమ్మ తన కోసం ఎదురు చూస్తూగుమ్మంలో ఎదురు చూస్తూ ఉండేది..ఇంటిదాకా వచ్చినవాడ్ని ఇంటిలోకి రానా ఆ మా త్రం దానికి గుమ్మంలోనిల్చుని ఎదురు చూడం ఎందుకు అంటూ ప్రయణబడలికలో ఉన్న తాను చిరు కోపం చూపించిన సందర్భంగుర్తుకు వచ్చింది మోహన వంశీకి…ఆ క్షణంలో తనయెక్క ఆ చిరు కోపాన్ని నవ్వుతూనే స్వీకరిస్తూ తనఅమ్మ అనేది.. నీకు “మా అన్నయ్యలాగే” కోపం ఎక్కువ అంటూ “తన తోబట్టువులలోని” పోలికలను తనకుఆపాదిస్తూ ఆనందపడేది…!! అలాంటి తన అమ్మ నేడుఎక్కడ..?? ..నా కోసం గడప దగ్గరే ఎదురు చూసే మాఅమ్మ నేడు ఎక్కడ??.. నేను అమ్మ…అమ్మ అనిపిలుస్తూ ఇంటి తలుపుకొడ్తున్నప్పటికి తలుపు తీయడంలేదు!!..అవును అమ్మ ఇప్పుడు లేదు కదా!!…అసలునేను ఏమి తిన్నానో..తినలేదో అడిగేవారు లేరు!!…నారాకపోకల గురించి ఎదురుచూసే చూపులేకరువయ్యాయి!!…అనుకుంటూ బాధ పడుతున్నమోహనవంశీ కి తాను ఎక్కిన ట్రైన్ రాజమండ్రిసమీపానికి చేరుకోవడాన్ని గమనించాడu
అతను ప్రయాణిస్తున్న రైలు నెమ్మదిగారాజమండ్రి లోని గోదావరి బ్రిడ్జికి పైకిచేరుకుంటోంది…ట్త్రైన్ బ్రిడ్జిపైనుండి వెళ్తూంటే ఆ బ్రిడ్జ్రికింద నుండి ప్రవహిస్తున్న గోదావరి నది వైపు చూస్తున్నాడు మోహనవంశీ…ఎందుకో ఒక్కసారిగాగోదావరి అలల మధ్య నుండి అమ్మ తననుపిలిచినట్టుగా భ్రాంతి కలిగింది మోహనవంశీకి!!…అప్పుడు గుర్తుకు వచ్చింది…అమ్మ మరణించినపిమ్మట జరిగిన కర్మక్రియలలో భాగంగా అమ్మ అస్తికలనుఇక్కడే కదా కలపబడింది..!! భౌతికంగా ఆమెదూరమైనప్పటికి ఈ గోదావరి ఆలలలోనే ఆమె నిలిచిఉందని అనిపిస్తోంది…తనను చూసిన అమ్మే ఆలలరూపంలో తన దగ్గరికి వస్తున్నట్టుగా మోహనవంశీకిఅనిపిస్తోంది!!…ఆ ఆలల రూపంలో ఉన్న తన అమ్మేతనకేదో చెప్పాలని తపన గోదవరి అలలలో కనిపిస్తోందిమోహనవంశీకి……ఆ నదిలోని పడిలేచే ఆలలు మాఅమ్మ నాకు ఏదో చెప్పటానికి పడుతున్న ఆరాటంగాకనిపిస్తూ ఉంటోంది మోహన్ వంశీకి…!!..
……”జాతస్యహి ధృవో మృత్యు: ధ్రువం జన్మమృతస్యచ తస్తాద పరిహార్ధేనత్వం శోచితుమర్హసి” అనిగోదావరి అలల హోరులో లీలగా వినిపిస్తునట్టుఅనిపించింది మోహనవంశీకి… ఒహో…”పుట్టిన వానికిమరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుకతప్పదు..కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీపుశోకించవద్దు..!” అని భగవద్దీతలోని జీవిత సత్యాన్ని నాకు చెప్పడానికే అలలు రూపంలో అమ్మ నా వైపుకువస్తోందన్నభావన ఒక్క క్షణంపాటు మోహనవంశీకికనీళ్ళు ఉబికి వచ్చాయి….!!….. ” అహా నిజంగాగోదావరి అలల హోరులో ఎంతో గూఢర్ధాం దాగిఉంది,అందుకే కదా” కవులు వేదంలా ఘోషించే గోదావరి ….!” అని పేర్కొన్నది అని ఒక్క క్షణంపాటు కళ్ళుమూసుకున్నాడు మోహనవంశీ..!!
ఇంతలోనే మోహనవంశీని ఊరడింపుచేస్తున్నట్టుగా గోదావరి నుండి వచ్చే చల్లటి గాలులుతనను తాకగానే వర్తమానంలోకి వచ్చాడుమోహనవంశీ…అప్పుడు తనని తానుతన్మయింటుకుంటూ..అమ్మ భౌతికంగా లేకపోవచ్చు… ఈ గోదావరి ప్రవహిస్తున్నంత కాలం గోదావరి ఒడిలోనే మా అమ్మ సేద తీరుతూ ఉంటుంది..!! .. పడిలేచే ఆగోదావరిలోని అలలే నాకు అమ్మ పలకరింపులు..!!..మనచూట్టు అవహించి ఉండే పంచభూతలే మా అమ్మతోబుట్టువులు..మా అమ్మయొక్క ఆ తోబుట్టువులే నాకు బందువులు…!!…అని తనని తాను తన్మయించుకుంటూ భారమైన హృదయంతోమోహనవంశీ జీవిత గమనంలోకి అడుగులువేస్తున్నాడు….!!

1 thought on “గోదావరి అలలలో అమ్మపిలుపు వినిపిస్తోంది

  1. ఎప్పుడూ కళ్ళెదుట వుండేవాళ్ళు ఒక్కసారిగా కనిపించనప్పుడు మనకు తెలిసినా బ్రెయిన్ “వాళ్ళేరి?” అనే ప్రశ్న వేస్తుంది. దేహం చుట్టూ వున్న పరిసరాలనుండే సమాధానాన్నిఅదే వెతుక్కుంటుంది. ఈ ఫీలింగ్ నాకు తెలుసు. సహజ కధ. చాలా బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *