March 29, 2024

“పడతి! ఎవరు నీవు?” కథలపోటి ఫలితాలు

అభినందనలు… శుభాకాంక్షలు…

శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ , మాలిక పత్రిక సంయుక్త నిర్వహణలో “పడతీ! ఎవరు నీవు?” శీర్షికన కథల పోటి ప్రకటింపబడింది. ఈ పోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. వందకు పైగా కథలు వచ్చాయి…
ముందుగా మేము ఉత్తమమైన 25 కథలను పుస్తకంగా అచ్చువేయాలి, రచయితలకు తలా రెండు కాపీలు ఇవ్వాలని అనుకున్నాము. కాని ఉత్తమమేమోగాని , చాలా మంచి కథలు ఎక్కువ రాలేదు. అందుకే పుస్తక ప్రచురణ వద్దనుకుని అయిదుగురికి మొదటిబహుమతిగా ఒక్కొక్కరికి రూ.1000 , ఏడుగురికి ఒక్కొక్కరికి రూ.500 రెండవ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము.

మొదటి బహుమతి పొందినవారు

1.రాములోరి కుర్చీ…. ఉప్పలూరి మధుపాత్ర శైలజ
2.స్వయంసిద్ధ… వారణాసి వెంకట విజయలక్ష్మి
3.ట్రీట్ మెంట్ … నండూరి సుందరీ నాగమణి
4.ఉషాకిరణాలు. ..రమా శాండిల్య
5.మా అమ్మ రాక్షసి. .. గరిమెళ్ళ సుబ్బలక్ష్మి

రెండవ బహుమతి పొందినవారు:
1. అలనాటి వాల్జడ… మంథా సీతా శర్మ
2. కాలింగ్ బెల్… ఉగాది వసంత
3. ఎవరూ రాకపోయినా సరే… లలితా వర్మ
4. ఇంకా ఎందుకీ నిశ్శబ్దం? స్ఫూర్తి కందివనం
5. మణిదీపం… శ్రీనివాసరావు శింగరాజు
6. నేను సాధించాను…. జి. స్వాతి
7. పడతి, ఎవరు నీవు?… విశాలి పేరి

ఈ కథలపోటీలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు.. విజేతలకు అభినందనలు.. త్వరలో మీ బహుమతి సొమ్ము మీకు అందజేయబడుతుంది.
ఈ 12 బహుమతి కథలతో అచ్చు పుస్తకం కాకున్నా ఈ పుస్తకంగా అతి త్వరలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తాం.
బహుమతి రానివారు మీ కథలు తిరిగి తీసుకుని వేరే పత్రికలకు పంపుకోవచ్చు.

నిర్వాహకులు:
ఉమాభారతి
మంథా భానుమతి
జ్యోతి వలబోజు