March 29, 2024

దానశీలత

రచన: సి. హెచ్. ప్రతాప్ దానంలో కర్ణుడి ఖ్యాతి జగద్విఖ్యాతం. నభూతో నభవిష్యతి అన్న చందాన అతని దాన ప్రస్థానం సాగింది. జన్మత: సహజ కవచకుండాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన ఇంద్రుడు ఒక కపట ఉపాయం ఆలోచించి పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా కోరాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు. . దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వమని […]

రైభ్య మహర్షి

రచన: శ్యామ సుందరరావు రైభ్య మహర్షి వృత్తాంతాన్ని ధర్మరాజుకు అరణ్య పర్వంలో పాండవులు తీర్ధయాత్రలు చేస్తున్నప్పుడు లోమాంశుడు అనే ఋషి చెపుతాడు. రైభ్యుడు, భరద్వాజుడు ఇద్దరు మంచి స్నేహితులు అన్నదమ్ములులా మెలుగుతూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. రైభ్యుడు చిన్నతనము నుండి గురు శుశ్రుహ చేస్తూ వినయవిధేయలతో గురువులనుండి వేదాధ్యయనము చేస్తూ ఉండేవాడు గురువులు కూడా రైభ్యుని గురుభక్తికి మెచ్చి ఆయనకు అన్ని వేదాలను నేర్పారు. కొన్నాళ్ల వేదధ్యాయనము చేసినాక రైభ్యుడు దేవా గురువైన బృహ స్పతిని కలిసి […]

కురువంశ మూల పురుషుడు “వసు (ఉపరిచరుడు) చక్రవర్తి”

రచన: శ్యామసుందరరావు ఒకసారి వేటాడాలన్న ఆసక్తితో చేది రాజు వసు తన పరివారముతో వేటకు బయలుదేరాడు కొంచము సేపు వేటాడినాక అలసిపోవటం వల్ల ఆ ప్రాంతములోని ఒక ఆశ్రమాన్ని చేరి అక్కడి ఆశ్రమ ప్రశాంతత ఆహ్లాదకరమైన వాతావరణానికి సంతోషపడి తాను ప్రస్తుతము గడుపుతున్న జీవితము మీద విరక్తి కలిగింది.ఈ భోగభాగ్యాలు సుఖాలు అన్ని అశాశ్వతమని పరమాత్ముడే శాశ్వతమని నిర్ణయించుకొని అన్నిటిని త్యజించి తపస్సు ప్రారంభించాడు.ఈ తపస్సు తన ఇంద్రపదవికి అన్న అనుమానంతో రాజు కోరకుండానే ఇంద్రుడు ఇతర […]

చిత్రగుప్తుడు

రచన: శ్యామసుందరరావు యమగోల యమలీల లాంటి హిందూ దేవుళ్లను కించపరిచే సినిమాల పుణ్యమా అని పురాణాల్లోని ఉదాత్తమైన పాత్ర చిత్రగుప్తుడు ఒక హాస్య పాత్రగా మన మనస్సుల్లో ముద్ర పడింది నిజానికి చిత్రగుప్తుడు బ్రహ్మ యొక్క పదిహేడు మంది మానసపుత్రులలో ఒకడు. యమధర్మరాజుకు ధర్మ నిర్వహణలో సహాయకుడిగా ఉంటూ భూలోకవాసుల మరణానంతరము వారి పాప పుణ్యాల అనుగుణముగా వారికి న్యాయ బద్ధముగా ఏ విధమైన పక్షపాత ధోరణి లేకుండా శిక్షలు నిర్ణయించటంలో యమధర్మ రాజుకు సహకరించే వ్యక్తి […]

మకరద్వజుడు

రచన: శ్యామసుందర రావు హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారి అని భక్తులు విశ్వసిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఉదంతము రామాయణములో ఒక ఆసక్తికరమైన వృత్తాంతము. ఈ వృత్తాంతానికి మూలం లంకాదహనం సమయంలో కనిపిస్తుంది. శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ కామవశుడైన రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా… అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. […]

దేవశర్మ పత్ని- రుచి

రచన: శ్యామసుందర రావు ఈ కధను భీష్ముడు అంపశయ్య మీద ఉండగా తన దగ్గరకు వచ్చిన ధర్మరాజుకు అనేక నీటి సూత్రాలు , ధర్మబోధ చేస్తూ చెపుతాడు. ఆడవాళ్ల కోసము యుద్దాలు జరగటం అనేది చరిత్రలో సర్వసాధారణంగా జరిగేదే మనము ఎప్పటి నుంచో వింటున్నదే. చివరకు మేధావులు ఆడదాని మనస్సును తెలుసుకోవటం కష్టము అని సింపుల్ గా తేల్చేశారు. దీనికి ఉదాహరణగా పురాతనకాలములోని భారతములోని కథ చెప్పుకుందాము. పూర్వము దేవశర్మ అనే బ్రాహ్మణుడికి రుచి అనే సౌందర్యరాశి […]

బ్రహ్మ జ్ఞాని జాబాలి మహర్షి

  రచన: శ్యామసుందరరావు   జాబాలి వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో కనుపించే ఒక పాత్ర.   త్రేతాయుగంలో జాబాలి లేదా జాబాలి ఋషి, అనే వ్యక్తి హిందూ మతములోని ఒక పుణ్యాత్ముడు.  జబాల అనే ఒక విప్ర స్త్రీకి కన్యత్వ దశలోనే దేవతా వర ప్రసాదమున పుట్టిన వాడే ఈ జాబాలి.  జాబాలికి యుక్త వయసు రాగానే ఇతనిని తల్లి హరిద్రుమతుడు అనే గురువు దగ్గర విద్య నేర్చుకునేందుకు అప్పగిస్తుంది.   కొంతకాలానికి గురువు జాబాలికి ఉపనయనము చేసే […]

గృహస్థాశ్రమ ధర్మాలను వివరించిన “ఔర్వ మహార్షి “

రచన: శ్యామసుందరరావు   ఔర్వ మహార్షి  కధ మహాభారతము ఆదిపర్వంలోని చైత్ర రద పర్వము అనే ఉప పర్వంలో 79,80అధ్యాయాలలో 55 శ్లోకాల్లో ఉంది. ఈ కథను వశిష్ఠుడు తన మనుమడైన పరాశరునికి చెబుతాడు.  ఆంధ్ర మహాభారతములో నన్నయ ఈ కథను ఆదిపర్వం సప్తమాశ్వాసములో 132 వచనము నుండి 149 వ వచనము వరకు 18 గద్య పద్యాలలో ఎటువంటి మార్పులు చేయకుండా చెప్పాడు.   ఈ కథ మొత్తము అనౌచిత్యమైన అంశాలతో కూడుకొని ఉంటుంది.   ఋషుల మహాత్యము […]

అంగారపర్ణుడు

రచన: శ్యామసుందర రావు మహా భారతములో ఆదిపర్వంలో ఈ అంగారపర్ణుడి కద వస్తుంది. వారణావతములోని లక్క గృహము దహనము నుండి బయటపడ్డ పాండవులు కుంతీ, విదురుని సలహా మేరకు కొంత కాలము ఏకచక్రపురంలో బ్రాహ్మణ బ్రహ్మచారులుగా రహస్య జీవనము సాగిస్తూ, బకాసురిని వధ తరువాత బ్రాహ్మణుడు ఇచ్చిన సమాచారంతో పాంచాల రాజ్యానికి ద్రౌపది స్వయంవరానికి బయలు దేరుతారు. ఆ సమయములో వారు గంగానది ఒడ్డున గల అరణ్యము గుండా ప్రయాణిస్తున్నప్పుడు, వారి అడుగుల సవ్వడి విన్న అంగారపర్ణుడు […]

మునికుల చూడామణి “కణ్వ మహర్షి”

రచన: శ్యామ సుందరరావు కణ్వుడు కశ్య ప్రజాపతి వారసుడైన అంగీరసుని వంశంలో ఘోరుడు అనే ఋషికి జన్మించాడు ఈయనను “మునికుల చూడామణి”అని అంటారు అంటే మునులలోకెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం. ఈయన బాల్యము నుండి తపోనిష్ఠలో ఉండి బ్రహ్మచారిగా ఉండిపోయాడు కణ్వుడు మహా నిష్ఠాగరిష్ఠుడు. గొప్ప తపస్సంపన్నుడు అతను మన వేదాలలో పెక్కు మంత్రాలకు ద్రష్టగా నిలిచారన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. రుగ్వేదంలో కణ్వుడి పేరిట చాలా మంత్రాలే ఉన్నాయి. కణ్వుడు, అతని వంశజులు […]