April 19, 2024

వేదకర్త “జమదగ్నిమహర్షి”

రచన: శ్యామ సుందరరావు భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి వివాహము చేసుకోవాలనే తలంపుతో కుశ వంశానికి చెందిన గాది మహారాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు సత్యవతిని ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు రాజు. నున్నటి శరీరము, నల్లటి చెవులు ఉండే వెయ్యి ఆశ్వాలను ఇమ్మని కోరతాడు. అప్పుడు ఋచీకుడు వరుణుని ప్రార్ధించి వెయ్యి అశ్వాలను పొంది గాది మహారాజుకు ఇచ్చి సత్యవతిని పెళ్లాడుతాడు. వివాహము చేసుకున్నాక సత్యవతి తనకు ,తన తల్లికి పుత్ర […]

బహువిధ యజ్ఞకర్త “శౌనక మహర్షి”

రచన: శ్యామసుందర రావు పూర్వము విజ్ఞాన ఖని తపస్సంపన్నుడు అయినా శునక మహర్షి ఉండేవాడు అయన కుమారుడే శౌనక మహర్షి ఈయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నైమిశారణ్యము తండ్రి దగ్గర సకల యజ్ఞ నిర్వహణా సామర్థ్యము, వేద వేదాంగములు, నియమ నిష్టాగరిష్టుడై నేర్చుకొని తల్లిదండ్రుల అనుమతితో నిర్జన ప్రదేశము కొరకు బయలు దేరి, చివరకు నైమిశారణ్యము చేరుకొన్నాడు. ఇంక ముందుకు వెళ్ళలేక, ఆక్కడే స్థిర నివాసము ఏర్పరుచుకొని, అనేక మంది ముని పుంగవులని శిష్యులుగా చేసుకొని, […]

అత్యంత విశిష్ఠుడు వశిష్ఠ మహర్షి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు   వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి.  మహాతపస్సంపన్నుడు.  సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకడు.  వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు .  మొదట్లో బ్రహ్మ మానస పుత్రుడై ఉండి నిమి శాపము వల్ల ఆ శరీరము లేకుండా పోవడముతో మరల మిత్రావరుణులకి జన్మించాడు ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వశిని చూచి రేతస్సు స్ఖలితము అయి అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి […]

ధర్మసూత్రాలకు ఆద్యుడు గౌతమ మహర్షి

రచన: శ్యామసుందర్ రావు గౌతమ మహర్షి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్తర్షులలో ఒకడు. గౌతమ గోత్రానికి మూలపురుషుడు భరధ్వాజుడు. ఈయన అంగీరస మూలానికి చెందిన వారే. వేద కాలానికి చెందినవాడు ఈయన రాహూగణుడి కొడుకు. ఈయన భార్య పేరు అహల్య. ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. పురాణాల ప్రకారం బ్రహ్మ ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా […]

శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన “కపిల మహర్షి”

రచన: అంబడిపూడి శ్యామసుందరం రావు   కపిల మహర్షి వేదకాలపు మహాముని మహాభారతములో పేర్కొన్నట్లుగా ఈయన ఏడుగురు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. ఈయన శ్రీ మహావిష్ణువు అవతారంగా విష్ణు పురాణములో పేర్కొనబడినది. కృత యుగములో కర్దమ ప్రజాపతి అనే మహర్షి సరస్వతి నదీతీరంలో శ్రీ మహావిష్ణువు కోసము పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై “నీకు దేవహూతి అనే భార్య వలన తొమ్మిది మంది కుమార్తెలు పుడతారు ఆ తరువాత నా అంశతో […]

దానవ గురువు ‘శుక్రాచార్యుడు’

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు తెలివితేటలలో బృహస్పతి ఎంతటివాడో శుక్రాచార్యుడు కూడా అంతటి వాడు. దేవతలు బృహస్పతిని గురువులుగాఉండమని అడిగినప్పుడు బృహస్పతి , “నాకన్నా శుక్రాచార్యుడు సమర్ధుడు ఆయనను అడగండి” అని చెపుతాడు. కానీ దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకుంటారు బృహస్పతి మీద, దేవతల మీద కోపముతో శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా ఉంటాడు. ఆనాటి నుంచి దేవా దానవుల సంగ్రామాల్లో దానవులకు అన్ని విధాలుగా సహకరించివారి విజయాలకు తోడ్పడినవాడు శుక్రాచార్యుడు, కానీ దేవతలా పక్షనా న్యాయము ధర్మము […]

అగస్త్య మహర్షి

రచన: శ్యామసుందర్ రావు ఈ రోజుకి కూడా తల్లులు వారి పిల్లలకు ఆహారాన్ని పెట్టి ,”జీర్ణము, జీర్ణము వాతాపి జీర్ణము”అని అంటూ ఉంటారు ఎందుకో తెలుసా? అగస్త్యుడు వాతాపి అనే రాక్షకుడిని తిని జీర్ణించుకుంటాడు కాబట్టి తల్లులు వారి పిల్లలకు కూడా ఆవిధమైన జీర్ణ శక్తి కావాలని కోరుకుంటూ అగస్త్య మహర్షిని స్మరించుకుంటారు. అలాగే భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలను చేసిన మహాత్ముడు అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో కనిపిస్తాడు.ముఖ్యముగా రామాయణ, మహాభారతాలలో అయన ప్రస్తావన వస్తుంది […]

అత్రి మహర్షి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు అత్రి ఒక మహా ఋషి.అత్రి సప్తర్షి మండలంలో ఏడవ ఋషిపుంగవుడు అంటే దైవిక వృత్తాంతం ప్రకారం సప్త ఋషులలో చివరివాడు, నాలుక నుండి ఉద్భవించినట్టుగా నమ్ముతారు. వైఖానస సంప్రదాయాలను అనుసరించి మహామునులను నలుగురుగా నిర్ధారించారు. వారు అత్రి, భృగువు, మరీచి, కష్యపుడు.అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు అంటే బ్రహ్మ దేవుని మనస్సు లోనుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు అత్రి మహమునితో తనకు సృష్టి కార్యములో సాయపడటానికి పుట్టించాను అని చెపుతాడు అత్రి […]

సాందీప మహర్షి

రచన: శ్యామసుందర రావు మన హిందూ ధర్మములో గురువుకు చాలా ప్రాముఖ్యత ప్రత్యేకతలు ఉన్నాయి రాజులైన మహాపురుషులైన గురువుల దగ్గర గురుకులాలలో గురువులకు సేవ చేసిన ప్రముఖులు ఎంతమందో ఉన్నారు త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు వసిష్ఠల వారిదగ్గర విశ్వామిత్రులా దగ్గర విద్య నభ్యసించాడు ఆయనతో పాటు అయన సోదరులు అలాగే ద్వాపరయుగములో సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణపరమాత్ముడు ,బలరాముడు అవంతికాపురములో (ప్రస్తుత ఉజ్జయిని) సాందీపుడు అనే మహర్షి ఆశ్రమములో విద్యనభ్యసించారు వారితో పాటు కడు సామాన్యుడు సుదాముడు (కుచేలుడు) […]

బ్రహ్మవేత్త, ప్రశ్నోపనిషత్తు ఆవిష్కర్త ‘పిప్పలాదుడు’

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. అతను అతని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. ప్రశ్నోపనిషత్తు శంకరాచార్యుడు బాష్యరచన చేసాడు. ప్రశ్నోపనిషత్తు పది ముఖ్య ఉపనిషత్తులలో ఒకటి. ఈయన దయాళువు. త్యాగశీలి. దేవతల కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన దధీచి, సువర్చలల కుమారుడు. దధీచి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన ఎముకలను దేవతలకు దానము చేస్తే, వాటితో వారు బ్రహ్మ చక్రము, ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసుకొని […]