April 25, 2024

అతి పెద్ద పాద‌ముద్ర కొంద‌రికి హ‌నుమంతుడు, మ‌రికొంద‌రికి జాంబ‌వంతుడు… ఇంత‌కీ య‌తి ఉందా?

రచన: మూర్తి ధాతరం భారతీయ సైనికులు ఆ మ‌ధ్య హిమాల‌యాల్లో భారీ మంచు మనిషి అడుగుల్ని గుర్తించారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఇండియన్‌ ఆర్మీ ట్వీట్‌ చేసింది. హిమాలయాల మంచుపై యతి అడుగులు ఉన్నట్లు ఆర్మీ వెల్లడించింది. భార‌తీయ‌ పురాణాల ప్రకారం యతి అనేది ఒక‌ భారీ మంచు మనిషి. నేపాల్‌, టిబెట్‌, భారత్‌తో పాటు సైబీరియాలోని మంచు ప్రాంతాల్లో అతిభారీ పాదాలు కలిగిన రాకాసి జీవులు ఉన్నట్లు కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ […]

కాసుకో నా రాజా – గుణపాఠము ఏకపాత్రాభినయం

రచన: కన్య స్థలము: ఫేసుబుక్కు గోడ వాచకుడు: సెల్ఫీ సార్వభౌముడు (సెల్ఫీసార్వభౌముడు ఫేసుబుక్కులోని న్యూసుఫీడు వద్దకు యొచ్చి, కలయగ జూచి – ఆశ్చర్యానందముతో) ఔరా! ఈ రోజటి న్యూసుఫీడు చమత్కృతి ఏమియో గాని, ఏ దినము ఏ మిత్రుడు ఏ పోష్టు వేయుదురోనన్న శంక లేకుండగ న్యూసుఫీడు నెల్ల యౌపోసన పట్టిన నా మానసమును సైత మాకర్షించుచున్నదే! (పోష్టుల గెల పక్కకు జూచి) ఈ పోష్టరులు, వాలు మిత్రులు నా మతిని, అందుండు శాంతిని తస్కరించరు గదా! […]

పౌరాణిక రత్నం. . . పాండవ వనవాసం!

సేకరణ : మూర్తి ఎన్ జీడిగుంట ఒక మహా ప్రస్థానాన్ని ఆరంభించినప్పుడు తొలి అడుగులు వేసే వ్యక్తి కొండలనూ. . గుట్టలనూ. . ముళ్లనూ రాళ్లనూ దాటుతూ దారి నిర్మించుకుంటూ ముందుకు సాగుతాడు. తన వెంట నడిచేవారికి అది మార్గాన్ని చూపుతుంది. తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రను వేసి ఇతరులకు మార్గనిర్దేశం చేసిన పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు. దేవుళ్ల కళారూపాలు ఎలా ఉండాలో నిర్దేశించిన బ్రహ్మ ఈ కమలాకరుడు. పంచమ వేదంగా పరిగణించే మహాభారత ఇతిహాసంలోని […]

కవి పరిచయం – సాయి కామేష్

రచన: లక్ష్మీ రాధిక ఆలోచనకి చక్కని అభివ్యక్తి తోడై, మనసుని మాటల్లోకి అనువదించడం అందరికీ రాని ప్రత్యేక లక్షణం. భావ కవిత్వంలో అభావాన్ని. . ముభావాన్ని సముపాళ్ళలో రంగరించి కదిలిస్తారు సాయి కామేష్. ఆకతాయి వయసు అల్లరితనం, దుఃఖాన్నే కవ్వించే చాతుర్యం, జీవితంతో రాజీపడుతూ ఒదిగిపోవడం, సహజమైన సుప్తచేతనావస్థలన్నీ తన కలానికి వెన్నతో పెట్టిన విద్యలు. సరళంగా ఉన్నట్లుంటూనే మనసుని మెలిపెట్టే భావాలు కొన్నయితే, సున్నితమైన సంవేదనలు కొన్ని. తను, నేను అనే శీర్షికన ఎన్నో కవితలు […]

నన్నెచోడుడు – “జానుతెలుగు”

రచన: సంధ్య యెల్లాప్రగడ జాను తెలుగు అంటే అందమైన, స్వచ్ఛమైన తెలుగు అని నిఘంటువు అర్థము. ఆ మాటను 12 వ శతాబ్దాపు కవి నన్నెచోడుడు మొదటిసారి వాడాడు. శివాచార తత్పరుడై, జంగమ భక్తుడిగా, విలక్షణ శైలిలో రచనలు చేశాడు నన్నెచోడుడు. నన్నెచోడుడు గురించి, ఆయన రాసిన అపూర్వ గంథ్రం ‘కుమారసంభవము’ గురించి చాలా శతాబ్ధాలు తెలియదు తెలుగువారికి. 1909 లో శ్రీ మానపల్లి రామకృష్ణ కవి ప్రపంచానికి ఈ ‘కుమారసంభవ’మన్న అత్యద్భుత తెలుగు ప్రబంధము పరిచయము […]

బర్బరీకుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు మహాభారతములో మనకు అనేక పాత్రలు తారస పడతాయి, కానీ మనము చాలా తక్కువగా వినే పేరు “బర్బరీకుడు”. యుద్దము ప్రారంభము అవటానికి ముందు ప్రతి యోధుడిని యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించ గలవు అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తే, భీష్ముడు 20 రోజులని, 25 రోజులని ద్రోణాచార్యుడు, 24 రోజులని కర్ణుడు, 28 రోజులని అర్జునుడు చెపుతారు. దూరముగా ఉండి ఇవన్నీ గమనిస్తున్న బర్బరీకుడుని శ్రీ కృష్ణుడు బ్రాహ్మణుని వేషములో దగ్గరకు వచ్చి”ఈ […]

కంచి కామాక్షి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు . కంచి కాంచీపురం, కాంజీవరం, వంటి పేర్లతో పిలిచే ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాల్లో ఒకటి , కంచి లోని కామాక్షి అమ్మవారి దేవాలయము అతి పురాతనమైనది ఎప్పటి నుంచి ఉన్నదో ఇదమిద్ధముగా తెలియదు..జగద్గురు అది శంకరాచార్య ఈ దేవాలయములో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు..ఆర్కియాలజీ వారి లెక్కల ప్రకారము ఈ దేవాలయము 1600 ఏళ్ళనాటిది. అది శంకరాచార్యులవారు ప్రతిష్టించిన శ్రీ చక్రము 5 బీసీఈ నుండి 8th […]

అర్జునుడు

రచన: శ్యామసుందరరావు మహాభారతం లోని అతిరధ మహారధులలో బాగా పేరు ప్రఖ్యాతులు గడించినవాడు కురుక్షేత్ర సంగ్రామములో కీలక పాత్ర వహించి సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుని ద్వారా గీతోపదేశము పొందినవాడు అర్జునుడు కుంతికి ఇంద్రుని వరము వల్ల జన్మించిన వాడు అర్జునుడు శ్రీకృష్ణుని సాంగ్యత ము వలన ఇద్దరి జోడి నర నారాయణులుగా ప్రసిద్ధి చెందింది అర్జునికి గురువు మార్గదర్శి నిర్దేశకుడు అన్ని శ్రీ కృష్ణ భగవానుడే అందుచేతనే కురుక్షేత్ర సంగ్రామానికి ముండు శ్రీ కృష్ణుడు అస్త్ర […]

గరుడ పురాణం

రచన: శారదాప్రసాద్ వేదవ్యాస మహర్షి రాసిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. గరుడుడు(గరుత్మంతుడు)పక్షులకు రాజు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు వాహనం కూడా!ఈ పురాణంలో అనేక కధలు కూడా ఉన్నాయి. ఇవి విష్ణువుకు, గరుడుడికి జరిగిన సంభాషణ రూపంలో ఉంటాయి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి. తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని […]

మహా భారతము నుండి ఏమి నేర్చుకోవచ్చు ?

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. మహాభారతమును పంచమ వేదము అంటారు. అంటే వేదాలు మనకు అనేక విషయాలను తెలియజేస్తాయి. చాలా విషయాలకు వేదాలలో చెప్పబడ్డవే ప్రామాణికంగా ఈ నాటికి నిలుస్తున్నాయి. అలాగే మహాభారతము దాయాదుల పోరు అయినప్పటికీ రాజనీతి అనేక ధర్మసూక్ష్మాలు, వేదాంత విషయాలు, యుద్ధ తంత్రాలు మొదలైన అనేక విషయాలు విపులముగా చర్చింపబడ్డాయి. విదురుడు, భీష్ముడు లాంటివారు అనేక రాజనీతి సూత్రాలు వివరిస్తారు. దురదృష్టము ఏమిటి అంటే దృతరాష్ట్రుడు దుర్యోధనుడు లాంటి వారు పెడచెవిన బెట్టి […]