విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ లౌకిక ప్రపంచమంతా మాయామయం. ఈ మాయను మానవుడు సులభంగా దాటగలడా? భగవద్గీతలో భగవానుడు….దైవసంబంధమైనదియు, త్రిగుణాత్మకమైనదియునగు ఈ మాయ దాటుటకు కష్టసాధ్యమైనది. అయితే నన్ను ఎవరు శరణు బొందుచున్నారో వారీమాయను సులభంగా దాటగలరు అంటున్నాడు. భగవంతునిచే కల్పించబడిన యోగమాయ, సత్త్వం – రజస్సు – తమస్సనే మూడు గుణాల రూపంలో ఉన్నది. ఇది జీవులకు దాటరానిది. ఈ మూడు గుణములను జయించగలిగినవాడే ఈ మాయను దాటగలడు. అటువంటి సామ్యావస్థ భగవంతుని శరణుజొచ్చిన వారికే […]
చార్వాకులు
రచన: శారదాప్రసాద్ 2500 సంవత్సరాల క్రితం మనుషులకి ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువ. ఆ రోజుల్లో కూడా భారతదేశంలోనూ, గ్రీస్ లోనూ కొందరు నాస్తికులు ఉండేవారు. ప్రాచీన భారతీయ నాస్తికులని చార్వాకులు లేదా లోకాయతులని అనే వారు. లోకాయతులు అంటే ఉన్న లోకాన్నే నమ్మేవారు. వీరు పరలోకాన్ని నమ్మరు. వీరు దేవుడు, ఆత్మ లాంటి ఊహాజనిత నమ్మకాల్ని, కర్మ సిధ్ధాంతాల్ని తిరస్కరించారు. చార్వాకము లేదా లోకాయతం లేదా బృహస్పత్యం భారతదేశపు ప్రాచీన భౌతికవాదం. ఈ వాదాన్ని […]
కార్టూన్స్…
కార్టూనిస్ట్: తోట రాజేంద్రబాబు
పాడు పండగలు..
రచన: రాజి పల్లె పల్లెలా వాడ వాడలా వస్తాయంట మాయదారి పండగలు ముస్తాబులూ, మంచి మంచి వంటకాలు తెస్తాయంట ఇంటింటా ఆనందాలు విరజిమ్ముతాయంటా. మరి మా మురికివాడ జాడ తెలియలేదా వాటికి వెలుతురు లేని వాడల అరుగులు వెతకలేదా ఈ వగలమారి పండగలు ఆకలి ఆర్తనాదాలు, చిరుగు చిత్రాలు కనరాలేదా కలహమారి పండగలకు మాయదారి పండగలు కలవారి ఇంటనే విడిది చేస్తాయంట బంగళాల్లో, కనక, కాంతుల్లోనే కనపడతాయంటా గుడిసెల్లో, నిరుపేదలను కనికరించవంట ఈ పాడు పండగలు.
ఒక్క క్షణం ఆలోచించు!
రచన: నాగులవంచ వసంతరావు మనిషికి మత్తెక్కించి మనసును మాయచేసి ఇల్లు ఒళ్ళు రెంటిని గుల్లచేసి సంఘంలో చులకనచేసే మద్యపాన రక్కసీ! మానవజాతి మనుగడపై నీ ప్రభావం మానేదెప్పుడు? ఆడపడచుల ఆక్రందనలు, ఆవేదనలు “చీర్స్” చప్పుళ్ళలో కలిసిపోయాయి ఐస్ ముక్కల హిమతాపానికి మంచులా కరిగిపోయాయి మహాత్ముల ఉపన్యాసాలు, నీతిబొోధలు సంఘ సంస్కర్తల త్యాగఫలాలు మద్యం మత్తులో చిత్తుగా ఓడిపోయాయి అర్ధరాత్రి స్వాతంత్ర్యం అర్థం తెలిసిపోయింది గాంధీజీ కలలుగన్న భరతమాత గౌరవం బక్కచిక్కి బరువెక్కి బజారుపాలైంది మధ్యం నిషాముందు ఇoద్రభోగం […]
సశస్త్రీ సుశస్త్రీ స్త్రీ
రచన: ఉమా పోచంపల్లి విశాల గగనం, వినీలాకాశం అనంత విశ్వం, ఆవేశపూరితం మనోబలం కావాలి ఇంధనం తేజోబలం అవ్వాలి సాధనం మానవమేధ మహా యజ్ఞం చేయాలి లోకముద్దీప్తి మయం విశాల అవని వినిపించెనదె ఆమని వలె వికసించెనదె అణుమాత్రమైనా, ప్రతిధ్వనించెను అష్టదిక్కులు మారుమ్రోగగా తారలమించే తేజోమయం ఆనందభైరవి నాట్యాలు వెలిగి మనసానంద నాట్యాల ఉర్రూతలూగించి వనితా అవని సుశాస్త్రజ్ఞానం అవని పరిధినే అధిగమించెనే కెంపులకేల కరవాలము వలెనే కుజగ్రహ మున నిలిపెను మన భారత క్షిపణి కుజగ్రహమున […]
మాలిక పత్రిక నవంబర్ 2017 సంచికకు స్వాగతం
Jyothivalaboju Chief Editor and Content Head ఈ మధ్యే కదా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నాం. అప్పుడే సంవత్సరాంతానికి చేరువలో ఉన్నాం. కాలం ఎంత వేగంగా కదులుతుంది కదా. పాఠకులను అలరించడానికి మరిన్ని కథలు, సీరియళ్లు, కార్టూన్లతో మళ్లీ మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక. ఈ నెల నుండి ప్రముఖ రచయిత్రి మంథా భానుమతిగారి నవల “కలియుగ వామనుడు” సీరియల్ గా వస్తోంది. వినూత్నమైన ఈ రచన మీద మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తారు […]
“కలియుగ వామనుడు” – 1
రచన:మంథా భానుమతి. 1 “ఏటేటి తిన్నా ఏ పన్జేసినా ఎవ్వురైన.. ఏటి సేత్తారీ నిశి రేతిరీ ఏమారి ముడుసుకోని తొంగుంటే ఏడనుంచొత్తాదొ నిదురమ్మ ఏమడగకుండ తన ఒడికి సేర్సుకోదా!” వీధి చివరున్న ముసలి బిచ్చగాడు సన్నగా పాడుతూ, మలుపు మూల బొంత పరచి ముడుచుకుని పడుక్కున్నాడు. వెంటనే గుర్రు పెట్ట సాగాడు. మధ్యరాత్రి ఒంటిగంట దాటింది. రెండో ఆట సినిమాకి వెళ్లొచ్చిన వారు కూడా గాఢ నిద్రలోకి జారుకున్నారు. వీధి దీపాలు నాలుగింటికి ఒకటి చొప్పున, నీరసంగా […]
మాయానగరం – 41
రచన: భువనచంద్ర ‘గురువు’ గారి అడ్డ మహా గంభీరంగా వుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో చిన్న సైజు తీర్ధంలా వుంది. పార్టీ సామాన్య కార్యకర్తల నుంచీ, పార్టీ అధ్యక్షుడి దాకా, చిన్న చిన్న ఫేవర్స్ కోసం పడిగాపులు గాచే నిరుపేదవాడి నుంచి కేంద్రమంత్రివర్యుల దాకా వచ్చిపోతూనే వున్నారు. కారణం ఏమైనా’ప్రెస్’ వాళ్ళకీ,’ఛానల్’ వాళ్ళకీ పండగ్గా వుంది. “మాదేముంది గురూ, పైన పటారం లోన లొటారం.. ఉత్త డొల్ల.. ఏదో ఈ కార్డుని పట్టుకొని తిరగడం కానీ, మా యాజమాన్యం […]