రచన: సి. ఉమాదేవి మనిషి అనగానే మానవత్వానికి చిరునామా అని అర్థం చేసుకోవాల్సిన సమాజంలో మనిషి దొంగ అని కవిత్వీకరించి మనుషులలోని భిన్న స్వభావాలను బహిర్గతపరచి మనసును ఆలోచనలతో కుదిపిన కవి మొవ్వ రామకృష్ణగారు. వంద కవితలు రచించిన కవి తన మనసుననున్న భావాలను అక్షరబద్ధం చేసి సమాజతీరును పారదర్శకం చేసారు. ఆశలపల్లకి కవితలో ప్రతివాడికి ఆశ ఉంటుంది అది అత్యాశ కాకూడదని ప్రతిక్షణం తపన మాత్రమే నాకు మిగిలింది అని చెప్తూ కల్మషంలేని మనసు ఏ […]