రచన: అంబడిపూడి శ్యామసుందర రావు గంజాయి వనములో తులసి మొక్కలలాగా కద్రువ సంతతి నాగులలో శ్రేష్ఠులు ధర్మనిరతి గలిగి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, పరమశివులకు ప్రీతిపాత్రులైన వారు ఆదిశేషుడు, వాసుకి. . కశ్యప ప్రజాపతికిని కద్రువకును పుట్టిన పుత్రులలో జ్యేష్ఠుఁడు అది శేషుడు. కాని తల్లి దుస్సాహసము, తమ్ముల దుష్ట స్వభావమును భరించలేక వారికి దూరముగా తపోమూర్తిగా వెలుగొందాలని తలంచి గంధమాదనము, బదరికాశ్రమము, గోకర్ణము మొదలగు దివ్యక్షేత్రములయందు మహా తపమాచరింపఁగా, శరీరము శుష్కించిపోగా అప్పుడు బ్రహ్మఅతని సత్యనిష్ఠకును, […]