రచన: టి.వి. యస్. శాస్త్రి
(మహాభారతం లోని ఈ కధను మీరు ఎప్పుడైనా విన్నారా?వినకపోతే తప్పక ఇది చదవండి!)
పురాణాల్లో కొన్ని కధల్లో కొన్ని పక్షులు ,జంతువులు మనుషుల్లాగే మాట్లాడుతుంటాయి. అంతే కాదు కొన్ని సార్లు మేలుచేసే సూచనలు ఇస్తాయి. మరికొన్ని సార్లు వేదాంతపరమైన భాషణలు కూడా చేస్తుంటాయి.పురాణాల్లో ఉన్న ఈ అద్భుత కధలు వింటానికి ఉత్సాహంగా కూడా ఉంటాయి. పక్షులు,జంతువులు మాట్లాడే కధలు చిన్న పిల్లలకు చాలా ఇష్టం.కానీ పురాణాలు మాత్రం పెద్దవారు చదవటానికి నిర్దేశించపడ్డాయి,అవి వారికే అర్ధమవుతాయి!అలా మాట్లాడే పక్షులకు, ,జంతువులకు ఒక నేపధ్యం,గత చరిత్ర ఉంటాయి.వాటికి మాట్లాడే వరం ఎలా వచ్చిందో కూడా పురాణాలే చెబుతాయి.సాధారణంగా అవి పూర్వజన్మలో మనుష్య జన్మ పొంది ఉండొచ్చు. ఉదాహరణకు ఒక జింక పూర్వ జన్మలో ఋషి ఆయి ఉండొచ్చు,అలానే ఒక నక్క పూర్వ జన్మలో రాజు అయి ఉండొచ్చు. శాపవశాత్తు , కర్మఫలం వలన వాటికి ఈ జన్మలు లభించి ఉండొచ్చు.అటువంటి సందర్భాలలో జింక రూపంలో ఉన్న ఋషి ,ఋషిలాగే మాట్లాడుతాడు.నక్క రూపంలో ఉన్న రాజు, రాజులాగే తెలివితేటలు కలిగి ఉంటాడు.అలాంటి కధలు నీతిదాయకంగా,జీవిత సత్యాలను చెబుతాయి.ఖాండవప్రస్థం ఎన్నో ఔషధాలు, ముళ్ళు,మిట్టపల్లాలు, భయంకరమైన జంతువులున్న ఒక పెద్ద అడవి. కృష్ణార్జునులు కలసి దాన్ని దహనం చేసి వారి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడ ఒక సుందరమైన నగరాన్ని నిర్మించాలని వారి ఆలోచన.ఆ సమయంలో ఆ అడవిలో ఒక సారంగ పక్షి తన పరివారంతో నివసిస్తుంది. వాటిల్లో ఒక మగ సారంగ పక్షి ఆనందంగా మరొక ఆడపక్షితో కలసి అడవంతా విహరిస్తుంది.ఆ మగ పక్షి భార్యాపిల్లలను వదిలేసి తిరుగుతుంది. పాపం ఆ తల్లిపక్షే పిల్లల మంచి చెడులు చూస్తుంది.అడవికి నిప్పు అంటుకునే వేళ,ఆ అగ్నికీలలు అడవంతా వ్యాపిస్తుంటే,తల్లిపక్షి పిల్లల క్షేమాన్ని గురించి బాధపడుతుంది.ఆ తల్లిపక్షి పిల్లలతో ఇలా అంటుంది, “అడవంతా నిప్పు అంటుకుంది.మీ తండ్రి మీ గురించి పట్టించుకోకుండా ఎక్కడ తిరుగుతున్నాడో కూడా తెలియదు. నేనొక్క దాన్ని మిమ్మల్ని కాపాడలేను! అడవిలో జంతువులన్నీ కకావికలై క్షేమమైన ప్రదేశాలకు పోవటానికి పరుగిడుతున్నాయి.ఈ పరిస్థితులలో నేను ఒక్కదాన్నే మిమ్మల్ని తీసుకొని ఎగిరి మరో చోటికి వెళ్ళలేను.” బాధపడుతున్న తల్లిని చూసి పిల్లలు ఇలా అన్నాయి,” అమ్మా! మా గురించి నీవు బాధపడవద్దు. మా కర్మకు మమ్మల్ని వదిలెయ్యి!కృష్ణార్జునులు దహనం చేస్తున్న ఈ అడవిలో మేము ఒక వేళ చనిపోతే,మరు జన్మలో మాకు ఉత్తమమైన జన్మ లభించటానికి అవకాశం ఉంది. కానీ నీవు చనిపోతే మన జాతి నశిస్తుంది.అందుచేత మమ్మల్ని వదిలేసి నీవు క్షేమమైన చోటికి ఎగిరిపో! అక్కడ మరొక మగపక్షిని జత చేసుకొని ఆనందంగా ఉండు. కాలగతిలో నీకు మళ్ళీ సంతానం కలగొచ్చు, క్రమేణా మమ్మల్ని మరచిపోవచ్చు కూడా! మన జాతికి ఏది మేలో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకో!” పిల్లలు అన్ని విధాలా నచ్చచెప్పినప్పటికీ తల్లికి వాటిని వదలి వెళ్ళాలనిపించలేదు.”మీ తోటే నేను కూడా ఈ మంటల్లోనే మసి అయిపోతాను” అని అంది తల్లిపక్షి .ఈ పక్షుల గత చరిత్రను తెలుసుకుందాం!పూర్వం మందాలపుడు అనే ఋషి బ్రహ్మచర్య దీక్షను బూని తపస్సు చేసి ఉత్తమలోకాలకు వెళ్ళాలనుకుంటే. స్వర్గ ద్వారం వద్ద ఉన్న రక్షకుడు ఋషితో,”సంతానం లేని వారికి స్వర్గ ప్రవేశం లేదు”అని చెప్పి వెనక్కి తిప్పి పంపాడు. అప్పుడు అతను సారంగ పక్షిగా మారి జరిట అనే స్త్రీ పక్షితో కలసి సంసారం చేస్తాడు! జరిట నాలుగు గుడ్లను పెడుతుంది. కొద్దికాలం తర్వాత సారంగ (మగపక్షి) కట్టుకున్న భార్యను వదిలేసి, లపిట అనే మరో స్త్రీ పక్షితో నివసిస్తున్నాడు! జరిట తన నాలుగు గుడ్లను పొదిగి వాటికి ఒక రూపాన్ని ఇచ్చింది.నిజానికి ఆ పక్షి పిల్లలు ఒక ఋషి సంతానం కావటం వల్ల వాటికి ఆ ఉన్నతమైన భావాలు వచ్చి, తల్లితో అలా చెప్పాయి! ఆ తల్లిపక్షి పిల్లలతో మళ్ళీ ఇలాగా అంది,”ఆ చెట్టు కింద ఒక ఎలుక కన్నం ఉంది. అక్కడ మిమ్మల్ని ఉంచుతాను. ఆ కన్నాన్ని నేను మట్టితో పూడుస్తాను. ఆ కన్నంలో ఉంటే మిమ్మల్ని అగ్ని దహించలేదు!అగ్ని చల్లారగానే మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను!” అందుకు పిల్లలు అంగీకరించలేదు. వాళ్ళు తల్లితో ఇలా అన్నారు,” కన్నంలో ఉన్న ఎలుక మమ్మల్ని తినేస్తుంది,దాని కన్నా మంటల్లో మసి కావటమే మేలు!” పిల్లలకు ఉన్న భయాన్ని గ్రహించిన తల్లి ఇలాగా అంది,”ఆ కన్నంలో ఉన్న ఎలుకను ఒక గద్ద తినటం నేను చూసాను. అందువల్ల మీకేమీ భయం లేదు”. “కన్నంలో ఇంకా కొన్ని ఎలుకలు ఉండొచ్చు,కాబట్టి మేము ఆ కన్నంలో ఉండలేము. నీవు క్షేమమైన చోటికి వెళ్ళు! మా కోసం నీ జీవితాన్ని త్యాగం చేయొద్దు. నీవు మమ్మల్ని పెంచి పెద్ద చేసావు,కానీ మేము నీకేమీ చేయలేకపోయాం!నీ కడుపున పుట్టి నీకే దు:ఖాన్ని కలిగిస్తున్నాం!”అని పిల్ల పక్షులు బదులు చెప్పాయి. అడవంతటిని దహించిన అగ్ని ఆశ్చర్యంగా ఆ పక్షి పిల్లలను మాత్రం దహించలేదు. మంటలు ఆరిన తర్వాత తల్లి పక్షి వచ్చిఆశ్చర్యంగా,ఆనందంగా తన పిల్లలను ముద్దాడింది. మంటలు రేగుతున్నప్పుడు మగ సారంగ పక్షి తన పిల్లల కోసం పరితపించింది.అదే భయాన్ని తన కొత్త భార్య అయిన లపిటకు చెప్పింది. అప్పుడు లపిట, ” నీ ఉద్దేశ్యం నాకు తెలుసు,నీకు నా మీద మోజు తీరింది.నీవు మళ్ళీ నీ మొదటి భార్య జరిట దగ్గరికి వెళ్లాలని చూస్తున్నావు.నీ మాయలన్నీ నాకు తెలుసు. నీవు మొదటి భార్య దగ్గరికే వెళ్ళు” అని చీదరించుకుంది లపిట.సారంగ పక్షి(ఋషి మందాలపుడు) ఇలా అంది,”నీవు ఊహించింది అంతా అబద్ధం.సంతానం కోసం నేను ఈ జన్మ ఎత్తాను. సంతానం కలిగింది. సంతానం మీద ప్రేమ ఉండటం సహజం!నా సంతానాన్ని చూసి మళ్ళీ నీ దగ్గరకే వస్తాను!” అని అలా నచ్చచెప్పి మొదటి భార్య ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళింది.వచ్చిన భర్తను జరిట పట్టించుకోలేదు.ఇక్కడికి ఎందుకొచ్చావని అడిగింది కూడా!అప్పుడు ఆ సారంగ పక్షి,”నాకు కలిగిన సంతానాన్ని చూడాలని వచ్చాను,వాళ్ళు బాగున్నారా?” అని అడిగింది.అప్పుడు జరిట దు:ఖంతో ,”నీవు పిల్లలను గురించి ఎప్పుడు పట్టించుకున్నావు? దాని దగ్గరికే వెళ్ళు!” అంది.సారంగ పక్షి(మందాలపుడు) ఇలా అనుకుంటాడు–స్త్రీకి సంతానం కలిగిన తర్వాత భర్తను గురించి పెద్దగా పట్టించుకోదు.లోకపు తీరే ఇది.వశిష్టుడి అంతవాడికే ఈ బాధలు తప్పలేదు.పతివ్రత అయిన వరుంధతి కూడా సంతానాన్ని పొందిన తర్వాత భర్త అయిన వసిష్టుడిని పెద్దగా పట్టించుకోలేదు!
సృష్టిలోని సకల జీవరాసుల ప్రవృత్తి ఒకే రకంగా ఉంటుందనే సందేశాన్ని ఈ కధ మనకు ఇస్తుంది!
టీవీయస్.శాస్త్రి
Manchi katha chepparu sir
చక్కగా వివరించారు సార్ దన్యవాదములు _/’_
అమ్మ తనం ప్రేమ చక్కగా వివరించారు ధన్యవాదములు అండి
very fine ….
a thought provoking story.it is true when one disowns his own projeny
a thought provoking story.it is true when one disowns his own projeny
పురాణకధల్లో -ఏకధ తీసుకున్నా- ఏదో ఒక చక్కని నీతిగాని, సందేశంగాని ఉంటుందనడానికి మన శాస్త్రిగారు ఇపుడు మన ముందుంచిన ఈ “సారంగ-పక్షులు” అనే కధే ఓ తాజా ఉదాహరణ! ఈ రచన – “సృష్టిలోని సకల జీవరాసుల ప్రవృత్తి ఒకేరకంగా ఉంటుంది” – అనే సందేశాన్ని మనకు చెబుతోంది. మంచి సదేశాత్మక పురాణకధను మనకు చేరవేసిన శ్రీ శాస్త్రిగార్కి ధన్యవాదాలు.
చాల బాగా సాగింది ఈ సారంగా పక్షుల సంవాదము. మొత్తమీద పక్షి పిల్లల జ్ఞానం పూర్వ జన్మ సంస్కారం వారికి ఉత్తమ ఆలోచనా విధానాన్ని అందించాయి తద్వారా వాటికి శ్రీకృష్ణ పరబ్రహ్మ మీది అలౌకిక నమ్మకం వాళ్ళ అంత దావాగ్ని గూడ వాటిని దాహించక చల్లగా చూసింది. దీనివల్ల ఈ విషయమై నేను గ్రహించినదేమనగా పూర్వ జన్మ కృత సంస్కారం ఉన్నప్పటికీ గొప్ప రుషి అయిన సారంగా మగ పక్ష్మి సంసార వ్యామోహంలో తన సుఖాన్ని కోరుకున్నదే గానీ భగవత్ చింతన ఇసుమంతైన లేదా తన కర్తవ్యపాలన్ చేయాల్సిన ధర్మం మరిచాడు. చిన్ని పక్షులైన దైవంపైని అపారమైన నమ్మకంతో తమ ప్రాణాన్ని సైతంత్యజించడానికి సిద్దబడ్డాయి. కావున ధర్మం వాటిని సంరక్షించింది. చాల బాగా మీ భావం పంచుకున్నారు. శుభం.
ఇందులో విశ్లేషణ చేయాలిసిన అంశాలు .
ఒక ఋషి సంతానం లేని వారికి స్వర్గ ప్రవేశం లేదు అని పక్షి జన్మ ఎత్తి , పిల్లలని కంటాడు. కానీ తన మగ బుద్ధిని మాత్రం వదలలేక పోయాడు. పక్షి జన్మే ఎందుకు ఎంచుకున్నాడు . త్వరగా జన్మ విమోచన కొరకా. ఆ రోజులలో జీవితం , జీవన విధానం , ఋషుల శక్తులు , సంకల్ప శక్తి అలా ఉండేవా ? ఇక ఆ ఋషి , పక్షి జన్మ ఎత్తినా , తన పూర్వజన్మ జ్నానాన్ని కలిగి ఉంటాడు . క్రమం గా మనం అటువంటి శక్తి ని కోల్పోయామా ?
ఋషి సంతానానికి ఉన్నత భావాలు రావడానికి తమ తండ్రి కారణమా ? సంతానానికి తల్లి వైపు వారి రూపు రేఖలు , తండ్రి వైపు వారి స్వభావం రావడానికి ఎక్కువ అవకాశం ఉందా ? ఋషుల సంతానానికి సాధారణం గా తండ్రి మేధస్సు వచ్చినట్టు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి .
అగ్ని అందరినీ దహించి , ఆ పక్షి పిల్లలను ఎందుకు వదిలిపెట్టాడు ? పంచభూతాలకి ఆలోచన , వివేచన ఉన్నాయా?
ఇంకా స్త్రీ విషయానికొస్తే , పక్షి అయినా , మనిషి అయినా , సాటి స్త్రీ మీద అసూయ వదలలేదా ?
సంతానం కలిగిన తరువాత , స్త్రీ సంతానాన్నే ఎక్కువ ప్రేమిస్తుందా ? నిజమే అనిపిస్తుంది . చిన్నతనం లో తండ్రిని , వివాహం అయ్యాక భర్తను , సంతానం కలిగిన తరువాత సంతానాన్ని ప్రేమిస్తుంది. అది ఎలా ఉన్నా స్త్రీ తన ప్రేమను తార్కికముగా , న్యాయముగా మలుచుకోలేదా ? అది ఆమె వివశతా ?
ఇక ఆ ఋషి , పక్షి జన్మ ఎత్తినా , తన పూర్వజన్మ జ్నానాన్ని కలిగి ఉంటాడు . క్రమం గా మనం అటువంటి శక్తి ని కోల్పోయామా ?
ఇవి మనం ఆలోచించాలిసిన అంశాలు . ఇక ఆ తరువాత ఎవరి అభిప్రాయాలూ వారివి . తమ తమ చేతనాస్తితిని బట్టి , వారి వారి ఆలోచనలు ఉంటాయి .
ఇంకా మహాభారతం గురించి వాడుకలో ప్రాశస్త్యం పొందిన మాట ,
“ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు” అని ప్రశస్తి పొందింది. ఇంత చిన్న కధ కి ఇంత విశ్లేషణ ఉంటే , మహాభారతము విశ్లేషనకి ఒక జీవితం చాలదు . మనుషుల శక్తి చాలదు . ……………………….సాంబశివ
Nice sir it’s true…..
సంతానంకోసమే పక్షిజన్మ ఎత్తిన ఋషి మరో లంపటంలో ఎందుకు పడ్డట్టు?
ఖాంండవ దహనం గురించి చాలా మందికి విని వుంటారు. బహుశా సినిమాల ప్రభావం కావచ్చు, కానీ దాని వెనుక వున్న నేపధ్యం చాలా మందికి తెలియదు. చాలా వివరణాత్మకంగా తెలియచేసినందుకు ధన్యవాదాలు శాస్త్రిగారు. చాలా చక్కటి విషయాలను మాకు అందిస్తున్నారు.
జరిట పక్షి మాతృ ప్రేమ, పిల్లల ప్రతిస్పందన హృదయాన్ని కదిలిస్తాయి.
చక్కటి విషయాలను తెలియచేసినందుకు మరొకసారి ధన్యవాదాలు శాస్త్రి గారు.
ధన్య వాదాలు మీ మంచి SUBJECT ఇచ్చినందుకు
రచన SUPERATHHAMMB INTERESTING AND ALSO INFORMATIVE.చక్కని SUBJECT తీసు కొని మాకు ఇచ్చినందుకు THANKS
చిన్నప్పుడు మా ఇంగ్లీష్ సర్ చెప్తే అర్దం కాలేదు , ఇప్పుడు మా సర్ చెప్తే తెలిసింది
అందుకే తీర్థం శంఖం లోనే పోయాలి ,
ధన్యవాదాలు ససర్ జీ
పూర్వజన్మ వాసనలు పక్షులలోను, పశువులలోను కూడా ఎలా ఉంటాయో చెప్పే కథ. జాతి నిర్మాణం కోసం తల్లికి దిశానిర్దేశం చేసిన పిల్లపక్షుల ఆంతరంగం ఎన్నదగినది. పక్షుల్లోనూ సవతిపోరు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించేదైన, ప్రాణులన్నిటికీ సహజగుణమేమో?!
మిత్రులు వారి అభిప్రాయాలను చక్కగా చెప్పారు. వారితో ఏకీభవిస్తూ చక్కటి నీతితో కూడిన వ్యాసాన్ని అందించినందులకు శాస్త్రి గారికి ధన్యవాదాలు.
మిత్రులు వారి అభిప్రాయాలను చక్కగా చెప్పారు. వారితో ఏకీభవిస్తూ చక్కటి నీతితో కూడిన వ్యాసాన్ని అందించినందులకు శాస్త్రి గారికి ధన్యవాదాలు.
సారంగ పక్షులద్వారా తల్లీ పిల్లల అనుబంధం ,ప్రేమానురాగాలు, కర్తవ్య బోధ, చక్కగా చెప్పారండీ! కధ ప్రభోధాతమకంగా బావుంది .
సహజమైన విషయాన్ని చాలా సహజంగా చెప్పారు.స్త్రీపురుష సంబంధాలు,బాధ్యతల పట్ల మగవాని వైఖరులూ నాటికీ నేటికీ ఒకటే! ఎటొచ్చీ యిప్పటి వనిత చదువరి ఉద్యోగిని కాబట్టి సంతాన సంక్షేమానికి లోటుతగ్గింది.సందేశాత్మక మైనకథ! అభినందనలు!
శ్రీ శాస్త్రి గారు సమాజం నాడైనా నేడైనా వ్యక్తుల ఆలోచనదోరని, ప్రేమనురగాలు ఒకేలవున్నైఎంత చక్కగా నాదే మనీషినైజాన్నితెలిపారు. సమాజానికి ఒకమంచిసందేశంఇచ్చిన ఈకథచాలగాబున్నది. అభినందనలు.
thank u andi mee rachanalu chadiva bhagyam kaliginanduku
తల్లి పిల్లల అనుబంధం ఏ యుగం లో నైనా ఒకటే ా స్వఛమైన ప్రేమ కు కాలదోషం వుండదు.. చాలా చక్కని కథ చెప్పారు
ఇతిహాసాలనుండి విభిన్నమైన కధాంశాలు తీసుకుని వాటిని నేటి సమాజానికి అన్వయిస్తూ ప్రభోదాత్మకంగా చెపుతున్న తీరు బహు శ్లాఘనీయం. మీనుండి మరిన్ని అద్భుత అంశాలను ఆశిస్తూ ఎదురుచూస్తూ ఉంటాము.
చక్కని కధ చెప్పినందుకు ధన్యవాదాలు!
ప్రకృతిలోని అమ్మతనంలోని తియ్యదనాన్ని గురించి చక్కని కధ చెప్పినందుకు ధన్యవాదాలు!
ఇతిహాసాల నుండి కొన్ని నీతి కధలను తీసుకుని వాటిని నేటి సమాజానికి అన్వయిస్తూ సందేశ పూర్వకంగా , ఆసక్తికరంగా చెపుతున్న తీరు బహు శ్లాఘనీయం. మీ నుండి మరిన్ని అద్భుత సందర్భాలను ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటాం.
మానవనైజాన్ని పక్షుల పాత్రలతో చక్కగా వివరించారు యుగాలు మారిన ఆడది ఆడదే మగవాడు మగవాడే పిల్లలు పుట్టినాక ఆడవారికి పిల్లలపై శ్రద్ద పెరుగుతుంది అని ఈ కధలో చక్కగా వివరించారు నేటి సమాజములో కూడా పెళ్లి చేసుకొని పిల్లలను కని భార్యా బిడ్డలను వదిలి అ పిల్లలు పెద్దైనాక అ పిల్లలను చూడటానికి వచ్చే మగ మహారాజులు ఎంతమందో ఉన్నారు పురానా కదా అయిన నేటి సమాజానికి తగ్గట్టుగా ఉంది
నిజమే నేపథ్యం ఏదయినా–ముందు భార్యా పిల్లలను విడిచెయ్యటం-మరో జత కూడటం–తప్పు–ఇక పొతే ఆ తల్లి పక్షి ప్రాణాలకు కూడా లక్ష్య పెట్టక–తన బిడ్డల కోసం పడిన తపన-ఆ బిడ్డ సంస్కారమో ,అగ్ని దేముడు ఆ తల్లీ,పిల్లల అనుబంధం గుర్తించి కరుణించి వదిలేసాడు-అంతటి సంకట స్థితి లో బిడ్డకు తండ్రి అండ ఎంత అవసరం–అప్పుడు కనబడక తరవాత వస్తే. ఆ భార్యా పిల్లలు –ఆమోదించ లేక పోయారు-ఇలాటివి నేటి సమాజం లోను చూస్తున్నాము బాధ్యత లేని తలి తండ్రులను –పిల్లలు ఆమోదించరు-
మంచి కధ-ధన్య వాదములు–అభివాదములు–సర్
అమ్మతనము లోని తీయదనము, కమ్మ దనము, వెచ్చదనము, చల్ల దనమే -అమ్మధనం !!
మగతనము లోని కామదనమే [కోరికే] – అయ్యధనం !!