May 20, 2024

బ్రహ్మవేత్త, ప్రశ్నోపనిషత్తు ఆవిష్కర్త ‘పిప్పలాదుడు’

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. అతను అతని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. ప్రశ్నోపనిషత్తు శంకరాచార్యుడు బాష్యరచన చేసాడు. ప్రశ్నోపనిషత్తు పది ముఖ్య ఉపనిషత్తులలో ఒకటి. ఈయన దయాళువు. త్యాగశీలి. దేవతల కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన దధీచి, సువర్చలల కుమారుడు. దధీచి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన ఎముకలను దేవతలకు దానము చేస్తే, వాటితో వారు బ్రహ్మ చక్రము, ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసుకొని […]

పడతీ! ఎవరు నీవు??

రచన: ఉమా వెంకట్ ఓ స్త్రీ నువ్వు మహిళగా ఓ కూతురిగా, అమ్మగా, తోబుట్టువుగా, భార్యగా, ప్రేయసిగా, స్నేహితురాలిగా అత్తగా, చెల్లిగా ఇలా అన్ని రూపాలు ఉన్న ఓ వనిత…. మహిళ గా నువ్వు ఎంతో చేయగలవు కానీ నువ్వు ఒక ఆడపిల్ల అని సమాజం గుర్తుచేస్తుంది, వెనుకకి లాగడానికి ముందు ఉంటుంది, కారణం సమాజంలో ఉన్న చీడ పురుగుల వల్ల ఆడదాని ఔనత్యాన్ని చాటి చెప్పే అవకాశం రాకముందే ఆడపిల్ల ఒకరికి భార్య గా మరొకరికి […]

శిశుపాలుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుని కుమారుడు. శిశుపాలుడు కృష్ణునికి మేనత్త కొడుకు. అంటే ఈయన తల్లి కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుని సోదరి శ్రుతదేవి, ధర్మఘోషుని భార్య. సంస్కృతములో శిశుపాల అనే మాటకు అర్ధము శిశువులను సంరక్షించేవాడు. శిశుపాలుడు, అతని మేనమామ దంతవక్రుడు పూర్వము శ్రీమహావిష్ణువు వైకుంఠ ద్వారాల వద్ద ద్వారపాలకులుగా ఉండి ముని శాపము వల్ల మానవజన్మ ఎత్తి శ్రీ మహా విష్ణువుతో వైరము వహించి అయన చేతిలో […]

నాటి ‘కచుడు’ నేటికీ ఆదర్శమే

రచన: సీతాలక్ష్మి వేలూరి ఆంధ్రమహాభారతంలో ఉపాఖ్యానాలకు కొఱతలేదు. అద్భుతమైన కథలకు కొలువు కూటమి భారతం. ముఖ్యంగా నన్నయభట్టారకుని రచనలో ఉపాఖ్యానాలకు వన్నెలెక్కువ. ఆయన ప్రసన్నకథాకలితార్థయుక్తికి తార్కాణాలైన కథలలో యయాతి వృత్తాంతం ఒకటి. అందులో ఒక చిన్న పాత్ర ‘కచుడు’. కేవలం 33 గద్య పద్యాలకు మాత్రమే పరిమితమైన పాత్ర ఇది. అయినా పఠితల మనస్సునమితంగా ఆకర్షించి వారి హృదయాలలో శాశ్వతస్థానాన్ని ఏర్పరచుకుంటుదనడంలో విప్రతిపత్తి లేదు. కచుడు ఈ కథలో కేవలం 4 పద్యాలలోను, ఒక వచనంలో మూడు […]

గరుడ పురాణం

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు అష్టాదశ (18) మహా పురాణాల్లో గరుడ పురాణము ఒకటి. దీనికి గరుడ పురాణాము అని పేరు రావటానికి కారణము ఇది పక్షులకు రాజు అయిన గరుడుడికి శ్రీ మహావిష్ణువుకు జరిగిన సంభాషణ,ఈ గరుడ పురాణములో 19000 శ్లోకాలు ఉంటాయి.దీనిని సాత్విక పురాణాముగా వర్ణిస్తారు. ఈ పురాణము శ్రీ మహావిష్ణువు అవతారాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా భూమి పుట్టుక భౌగోళిక స్వరూపాలను భూమి మీద సృష్టి మొదలైన అంశాలను వివరిస్తుంది. ఈ పురాణములో […]

ప్రేమ సంస్థానం .. మధూలిక

సమీక్ష: శ్రీ సత్యగౌతమి   ప్రియుని ధ్యానంలో అంతర్ముఖురాలైన ప్రేయసి మధూలిక ‘నేనంటూ కదులుతున్నప్పుడు నీ అడుగులనే అనుసరిస్తున్నట్లూ నాలో మౌనం తెరవేసినప్పుడు నీ ధ్యాసలో ఎద రమిస్తున్నట్లు’ …. ఈ నాలుగు వాక్యాల్లో అంతర్లీనంగా అథ్భుతంగా మధూలిక తన ప్రణయ కోరికను ఆవిష్కరించింది .   అంతేకాదు, ‘చిరుముద్దుతో రెప్పల కదలికలు అలలలైనప్పుడు మనమో దీవికి వలసపోయినట్లు ….   ప్రియునితో దీవి ప్రాంతాన అచటి సముద్రతీరపు అలలలో మమేకమైన మధూలిక, ‘తన కనురెప్పలపై ప్రియుని […]

కవి పరిచయం – అనురాధ బండి

రచన: లక్ష్మీ రాధిక కదులుతున్నట్టు కనపడని కృష్ణవేణిలా ఆమె కవిత్వం ఒక నది. సరిగ్గా చూస్తే వెన్నెల్లో వీణానాదంలా, వెండిమబ్బు దూదిపింజెలా,నిస్పక్షపాతపు కవితలా, బంగారు కలల నుంచీ వాస్తవపు విడ్డూరాల దాకా విస్తరించి ఉంటుంది. తన కవనంలో.. కమ్ముకునే కలతలూ, నిరాశా నిట్టూర్పు గేయాలూ, అంతులేని ఆలోచనా స్రవంతిలూ, పునర్వేచన చేసేలా దీప్తివంతమై ఉంటాయి. ఆ పదాలు గుండెల్లో గెంతులేసే అలల సవ్వళ్ళలా ఉలిక్కిపెడుతుంటాయి. తనే మరి..మన అనురాధ బండి. ముఖపుస్తక నేస్తంగా తన కవనాల సాక్షిగా […]

గురువులు కృపాచార్యుడు, ద్రోణుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు మహా భారతములోని ముఖ్యమైన పాత్రలు కౌరవులకు, పాండవులకు విద్యలు నేర్పిన గురువులు కురుక్షేత్ర యుద్దములో సైన్యాన్ని నడిపించిన అతిరధ మహారధులు భీష్ముని తదనంతరము కౌరవ సైన్యానికి నాయకత్వము వహించినవాడు ద్రోణుడు. ద్రోణాచార్యుడు గురువులలో అగ్రగణ్యుడు అందుచేతనే ప్రభుత్వము వారు కూడా ఆటలకు శిక్షణ ఇచ్చే విశిష్టమైన కోచ్ లకు ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నారు. వీరువురు గురించి క్లుప్తముగా తెలుసుకుందాము. కృపాచార్యుడు బ్రహ్మ నాల్గవ అవతారము. ఈయన శతానంద మహర్షి […]

రామేశ్వర ఆలయం

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు . పరమేశ్వరునికి ఉన్న 12 జ్యోతిర్లింగాలలో దక్షిణాదిన ఉన్న రామేశ్వరము లోని ఆలయము ఒకటి ఈ దేవాలయము రామేశ్వర ద్వీపములో ఉంది ఇక్కడి ప్రధాన దేవాలయము రామనాధ స్వామి ఆలయము ఈ దేవాలయాన్ని నిత్యము వేలాది మంది భక్తులు దాని పవిత్రత మరియు నిర్మాణ సౌందర్యం కోసం దర్శించుకుంటారు ఈ ఆలయం మూడు ముఖ్యమైన భారతీయ మత విభాగాలలో పవిత్ర తీర్థయాత్రగా పరిగణించబడుతుంది.ఆ మత విభాగాలు శైవ మతం (శివుడిని ఆరాధించేవారు) […]

నవరాత్రులలో రాత్రికే ప్రాదాన్యము.

రచన: సంధ్యా యల్లాప్రగడ “సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే॥” సంవత్సరములో వచ్చే నవరాత్రులలో శరన్నవరాత్రులు ముఖ్యమైనవి. శరత్నఋతువులో అశ్వీజమాసపు శుక్ల పాడ్యమి మొదలు నవమి వరకూ వచ్చే ఈ నవరాత్రులు పావనమైనవి, పరమ ప్రశస్తమైనవి. సనాతన ధర్మములో వచ్చే పండుగలలో అత్యంత ఆహ్లాదకరమైన పండుగ ఈ నవరాత్రులతో కూడిన దసరా. వాతావరణములో వేడి, చలి లేని సమశీతల ఉష్ణోగతలతో వుండి ప్రకృతి కూడా రాగరంజితమై వుంటుంది ఈ సమయములో. […]