April 27, 2024

నాన్న అడుగుజాడలే పరమావధి

సమీక్ష: సి. ఉమాదేవి   మొవ్వ రామకృష్ణగారు రచించిన శత కవితా సంకలనం నాన్న అడుగుజాడల్లో ప్రతి కవితలో కవి మనసు పారదర్శకంగా కనిపిస్తుంది.  వారి వెన్నుతట్టి ప్రోత్సాహాన్నందించిన రామా చంద్రమౌళిగారు,  సౌభాగ్యగారు, నందినీ సిధారెడ్డిగారు, లంకా శివరామకృష్ణగారు,  ప్రచురించిన జగన్నాథశర్మగారికి వారు అర్పించిన అక్షరాంజలి మనసును సంతోషంతో నింపుతుంది. తల్లిప్రేమ ఎన్నటికి మరువలేము. అయితే తండ్రి మనపట్ల చూపే అనురాగంలో బాధ్యాతయుతమైన ప్రేమ వెలకట్టలేనిది. ఈ సమాజంలో మనం తలెత్తుకు తిరగాలంటే నాన్న అడుగుజాడల్లో నడవాల్సిందే […]

మనసుకు ఉద్దీపనగా నిలిచిన రచనా చికిత్స

సమీక్ష: సి. ఉమాదేవి డా. లక్ష్మీ రాఘవగారు మన సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలకు తన కథలద్వారా పరిష్కారమందించే ప్రయత్నం చేయడం ముదావహం. జీవితం వడ్డించిన విస్తరికాదు. ఎన్నో సమస్యలు మిళితమై మనసును పట్టి కుదుపుతాయి. కాని వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నపుడే మనిషి తన ఉనికిని స్థిరంగా నిలుపుకో గలుగుతాడు. ఈ నేపథ్యంలో రచయిత్రి మనకందించిన కథలు మనలో ఆలోచనాబీజానికి మొగ్గ తొడుగుతాయి. ఇక మనం కథాబాటలోకి అడుగిడదాం. పుస్తకానికి శీర్షికగా నిలిచిన కథ మనసుకు చికిత్స. […]

కథాపరిశోధనలో సామాజికాంశాలకు ప్రాముఖ్యతనొసగిన కథలు – ఔను .. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

సమీక్ష: సి. ఉమాదేవి   గౌతమి సత్యశ్రీ సాహిత్యానికి సమయాన్ని కేటాయించి తన వృత్తిధర్మాన్ని నెరవేరుస్తూనే ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు శీర్షికతో కథాసంపుటిని తీసుకుని రావడం ముదావహం. పదహారు కథలున్న ఈ కథాసంపుటిలో ప్రతి కథకు సమాజంలో జరిగే సంఘటనలే నేపథ్యం. మంచి చెడుల విశ్లేషణలో కథలలోని పాత్రలు పలికే పలుకులు అందరినీ ఆలోచింపచేస్తాయి. ఆమెలాగా ఎందరో కథ ప్రకృతి నేర్పిన పాఠమే. లక్ష్మమ్మ భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయినా భీరువై దుఃఖపడక తను కూర్చున్న చెట్టునీడే […]

మనసున సుగంధం నింపిన అక్షరపూదోట

సమీక్ష: సి. ఉమాదేవి పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు జగమెరిగిన రచయిత్రి. వారి సాహితీప్రస్థానంలో బహుమతులు, బిరుదులు, పురస్కారాలు అనేకం అందుకున్న రచయిత్రి. సాహితీబాటలో వారందుకున్న సన్మానాలకు తప్పక అభినందించాలి. వీరి కథలలో అంతర్లీనంగా ప్రవహించే సామాజికాంశాలు కుటుంబసభ్యులకు బాధ్యతలను, విలువలను, బంధాలను గుర్తుచేస్తాయి. వీరి అక్షరనావలో పన్నెండు నవలలు, ఆరు కథాసంపుటాలు నిక్షిప్తం గావించబడ్డాయి. వీరి రచనలపై పి. హెచ్. డి, ఎమ్. ఫిల్ పరిశోధనలు చేసిన వారున్నారు. లోపాముద్ర బిరుదు, రమ్యకథారచయిత్రి బిరుదులు వీరందుకున్నారు. బెజవాడ గోపాలరెడ్డిగారు […]

స్త్రీల మనసులను ఉద్దీపనదిశగా నడిపిన నవల

రచన: సి. ఉమాదేవి పోలంరాజు శారదగారు జగమెరిగిన రచయిత్రి. ఆంధ్రభూమిలో ప్రచురింపబడిన నవల బంగారు కంచం. ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో రచింపబడిన నవల. నేటి పరిస్థితులకు భిన్నంగా ఒకనాటి హద్దులు, సామెతలు కొడుకునైనా, కోడలినైనా కట్టడి చేసే విధంగా అత్తలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వల్లెవేయడం పరిపాటి. ఈ నవల వాటి పరిణామాలను బహిర్గతపరచింది. ఒకనాటి ఉమ్మడి కుటుంబాలలో పెద్దలమాటే శిరోధార్యం. వారి మాటలను అతిక్రమిస్తే నలుగిరిలో చిన్నబోవడమేకాక కఠినమైన శిక్షలకు కూడా గురవుతారు. తరాలు మారాయి. కాని […]

మనసును ఆలోచింపచేసే ఆత్మీయ తరంగాలు

రచన:సి. ఉమాదేవి డా. లక్ష్మిరాఘవ గారు సాహిత్యానికే కాదు తనలోని కళాభిరుచికి నైపుణ్యాన్ని జోడించి అందమైన కళాకృతులను రూపొందించి ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తారు. వృధాగా పారెయ్యవలసిన వస్తువులను కళాత్మకంగా వినియోగించడంలోనే వీరి ప్రతిభ ఆవిష్కృతమవుతుంది. వనిత మహావిద్యాలయలో రీడర్ గా పదవీ విరమణ చేసాక తన సమయాన్ని సాహితీబాటలో విహరింపచేస్తున్నారు. చక్కని కథలతో ఆత్మీయులు అనే కథాసంపుటిని మనకందించారు. ఇరవైమూడు కథలున్న ఈ పుస్తకంలో ప్రతి కథ మనసును తట్టిలేపుతుంది. తద్వారా ఆలోచనకు పునాది పడుతుంది. […]

అక్షరాలే ఊపిరిగా రూపుదిద్దుకున్న కవితాస్ఫూర్తి

రచన: సి. ఉమాదేవి అక్షరమంటే ఉన్న ఆర్తిని, ఆప్యాయతను తన కవితలలో ప్రతి పదములోను ప్రతిఫలిస్తూ కవితలు, హైకూలు, రవీంద్రనాథ్ టాగూర్ గీతాంజలికి అనువాదంవంటి ఎన్నో రచనలు తనదైన శైలిలో రచించి మనకందించారు డా. పి. విజయలక్ష్మీ పండిట్. జపాన్ దేశంలో పురుడుపోసుకున్న హైకూలు నేడు ప్రపంచమంతా చక్కటి హైకూలుగా రచింపబడి అందరినీ అలరిస్తున్నాయి. విశ్వపుత్రిక హైకూలుగా రచింపబడిన సంపుటిలో సాంఘిక, సామాజిక అంశాలను తన హైకూలలో పొందుపరచి అనంతార్థాన్ని అందించడం ముదావహం. కళలు, కవితలు కవిహృదయాలను […]

అక్షరపరిమళమందించిన పూలమనసులు

రచన: సి. ఉమాదేవి నండూరి సుందరీ నాగమణి బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూనే అక్షరఆర్తి నింపిన స్ఫూరినందుకుని విభిన్న అంశాలతో నవలలు, కథలు మనకందించడం ముదావహం. శాస్త్రీయసంగీతంలో ప్రవేశం వీరికున్న సంగీతాభిలాషను మనకు విశదపరుస్తుంది. గడినుడి ప్రహేళికలు వీరందించిన ఆటవిడుపులే. పూలమనసులు కథాసంపుటి వైవిధ్యభరితమైన కథాంశాలతో సమస్యలను స్పృశిస్తూనే పరిష్కారాన్ని సూచించడం రచయిత్రి మనసులోనున్న సామాజిక అవగాహనను ప్రస్ఫుటం చేస్తుంది. పిల్లలు విదేశాలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులను రమ్మని వారికి ఆ దేశంలోని ప్రదేశాలను చూపించాలని ఆశిస్తారు. […]

మనిషిలోని భిన్నస్వభావాలను బహిర్గతపరచిన కవితావల్లరి.

రచన: సి. ఉమాదేవి మనిషి అనగానే మానవత్వానికి చిరునామా అని అర్థం చేసుకోవాల్సిన సమాజంలో మనిషి దొంగ అని కవిత్వీకరించి మనుషులలోని భిన్న స్వభావాలను బహిర్గతపరచి మనసును ఆలోచనలతో కుదిపిన కవి మొవ్వ రామకృష్ణగారు. వంద కవితలు రచించిన కవి తన మనసుననున్న భావాలను అక్షరబద్ధం చేసి సమాజతీరును పారదర్శకం చేసారు. ఆశలపల్లకి కవితలో ప్రతివాడికి ఆశ ఉంటుంది అది అత్యాశ కాకూడదని ప్రతిక్షణం తపన మాత్రమే నాకు మిగిలింది అని చెప్తూ కల్మషంలేని మనసు ఏ […]

మనసుతీరాన్ని తాకిన అక్షరాన్వేషణ

రచన: సి. ఉమాదేవి మనిషిని వారి మనసులోతును గ్రహించగల వ్యక్తి రేణుక అయోల. సామాజికస్పందనలకు ఆమె కవితారూపాన స్పందించేతీరు అపురూపం. తన మనసు కదలికల్ని రికార్డు చేయగల నైపుణ్యం, నిజాయితీకి సహజత్వాన్ని మేళవించి కవితలను రచించగల నేర్పరితనం రేణుక అయోలగారిది అంటారు రచయిత సౌభాగ్య. జీవితపు నాటకాల స్టేజి మీద ఈ కృత్రిమవేషాన్ని ఈ కృత్రిమ నాటకాన్ని నేను అభినయించలేను నాకు తెలిసిందల్లా నిజాల జాడల్ని వెతుక్కుంటూ వెళ్లడమే అంటారు రేణుక అయోల. తన అంతరంగాన్ని అర్థం […]