రచన: రమా శాండిల్య
హరి ఓం
భద్రాసనం
భద్రాసనం అంటే ఆసనం పేరులోనే భద్రత యిముడ్చుకున్నది. అంటే ఆ ఆసనం వేయడం వలన మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది అని వేరే చెప్పక్కరలేదు కదా.
భద్రాసనం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది అరుగుదల ఆహారం ఆరగడానికి పనికి వస్తుంది. కాంష్టిపెషన్ ఉండదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ , ఇన్డేజెషన్ ఇలాంటి వాటికి కూడా చాలా మంచిది.
ఈ రోజుల్లో ప్రతివారికి నడుము నొప్పి ఉంటోంది ఆ నొప్పికి మందు ఈ భద్రాసనం.
కాళ్ళు , తొడలు, పొత్తికడుపు దగ్గరవున్న కొవ్వు కరగడానికి ఈ ఆసనం చాలా ఉపయోగం. చిన్నగా మొదలు పెట్టి ఎంతసేపు కూర్చోగలిగితే అంతే సేపు చెయ్యాలి. ఆసనంలో ఉన్నంతసేపు శ్వాసను గమనించాలి. ఆలోచనల మీద ధ్యాస పెట్టొద్దు.
కొంతమంది ధ్యానం గురించి , మరి కొందరు ప్రాణాయామం చెప్పమని అడుగుతున్నారు.
వారందరు కూడా మొదట శాంతిగా కూర్చోవడం వస్తే గాని అవి చెయ్యలేరు. అందుకే మొదట ఆసనంలో కూర్చోవడం సాధన చేయాలి.
ఆసనం వెయ్యడం అనే నియమంతో సాధన చేస్తున్నాము మనం.
పద్మాసనం
ఈ ఆసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొందాం
పద్మాసనం వేయడానికి ముందుగా కాళ్ళు రెండు చాపి కూర్చోవాలి. తరువాత ఒక కాలుని చాపి, రెండవకాలు మడిచి తొడమీద పాదం వచ్చేలా పెట్టుకోవాలి. అదే విధంగా రెండవ కాలు కూడా పెట్టుకోవాలి.
ఈ ఆసనం వేయడం వల్ల తొడల దగ్గర నడుములో పెరిగిన కొవ్వు కరిగి, కూర్చోవడానికి శక్తి పెరుగుతుంది.
వెన్నుముక గట్టి పడుతుంది. ఆసనం వేయడం మొదలైనప్పటి నుంచీ విశ్రమ స్థితి వరకు శ్వాస మీద ధ్యాస ఉండాలి. పై పెదవి మీద గాలిని గమనిస్తూ ఉండాలి.
ఇంక పద్మాసనం రెండవ స్థితి.
మొదట పద్మాసనం వేసి కూర్చున్నాక అరచేతిలో బొటన వేలు పెట్టి చూపుడు వేలిని వదిలేసి మిగిలిన మూడు వేళ్ళతో మూసి గన్ ఫోజు పెట్టి కూర్చోవాలి. చూపుడు వేళ్ళతో చెవులను గట్టిగా మూసుకొని నోరు కూడా బంధించి ఉంచి గొంతుతో శబ్దం చెయ్యాలి.
ఆ శబ్దం మనసుతో ఓం అని వింటూ ఉండాలి. ఈ రకంగా శబ్దం చేసే సమయంలో శ్వాసమీద ఆంటే మన పై పెడవిమీద మాత్రమే ధ్యాస ఉండాలి.
ఈ రకంగా 2నిముషాల నుంచి 5నిముషాల సమయం ఉండొచ్చు. ఈ క్రియ చేసిన వెంటనే కళ్లు తెరవ వద్దు. 5 నిమిషాలు శ్వాసను, శరీరాన్ని గమనిస్తూ ఉండాలి.
పద్మాసనం వేయలేనివారు సుఖాసనంలో చేయవచ్చు. క్రింద కూచోలేనివారు కుర్చీలో కూడా కూర్చుని చేయవచ్చు.
ఇలా 40 రోజులు చేయడం వల్ల పొట్టను తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. బరువు తగ్గుతుంది ఇబ్బంది పెట్టే ఆలోచనలు తగ్గుతాయి.
పద్మాసనంతో చేస్తే ఫలితం తొందరగా చూడొచ్చు కాకపోతే కొంచెం ఆలస్యమయే అవకాశం ఉంటుంది.
దీనితో పాటు 11 గాని, 21 గానీ ఓం కారం పెద్ద శబ్దంతో చేసి 10 నిముషాలు మనము ఏ శబ్దం పైకి చేసామో, అదే శబ్దాన్ని మనసుతో వింటూ కూర్చోవాలి.
పద్మాసనం – శాంతి మంత్రం
పద్మాసనంలో చేసే రెండవ క్రియను శాంతి మంత్రము అంటారు.రెండూ చేయడం వలన బాధపెట్టే ఆలోచనల నుంచీ స్వాంతన పొందవచ్చు. 5 నిమిషాల సమయం నుంచీ పదిహేను నిమిషాలు వరకు చేయవచ్చు.
పద్మాసనంలో అలా కూర్చోవడం వలన, ధ్యానం మీద ఏకాగ్రత పెరుగుతుంది. మన వెన్నుపూస నిటారుగా ఉండడాని సహకరిస్తుంది. కాళ్ళు రెండు మడవడం వలన, పొత్తికడుపులో అగ్ని ప్రజ్వలన జరిగి, మనం తిన్న ఆహారం అరగడానికి ఉపయోగపడుతుంది. మన నరాలు మరియు కండరాల పై ఒత్తిడి తగ్గి, blood pressureని కూడా నియంత్రిస్తుంది.
తర్వాత ఆసనం మార్జాలాసనం. లేదా గోవాసనం.
Cat pose or cow pose ఈ ఆసనం వేయడం వలన నడుము నొప్పి పూర్తిగా తగ్గుతుంది.
నడుము నొప్పి ఉన్నవారు కూడా వేయడానికి ట్రై చేయచ్చు కానీ శరీరము సహకరించి నంతవరకు మాత్రమే మరీ నొప్పి ఉంటే వేయక పోవడం మంచిది.
నడుము నొప్పి లేనివారికి ఆసనం వేయడం వలన వెన్నుముకకు వీపు మొత్తం బలంగా వుంటాయి. ఈ ఆసనం వేసే పద్ధతి పది నెలల పిల్లలు మోకాళ్ళ మీద పాకడానికి మొకాళ్ల మీద వంగి, నడుము క్రింద భాగం కొంచం పైకి ఎత్తి, ఆ టైమ్ లో ముందు తల్లీ నుంచుని పిలిస్తే తల పైకెత్తి చూస్తారు. అలాంటి స్థితిలో ఉండడమే ఈ ఆసనం స్థితి పిల్లిలా ఉండగలగడం. ఈ ఆసనం కూడా రెండు నిమిషాలు నుండి పదిహేను నిమిషాలు వరకు చేయవచ్చు.
ఆసనం మొదలు పెట్టినప్పుడు శ్వాసమీద దృష్టి పెట్టి ఆసనం మరియు విశ్రాంతి స్థితి వరకు కూడా శ్వాస మీద దృష్టి ఉండాలి. పై పెదవి మీద గాలిని గమనిస్తుండాలి. మొదటి రోజు నేర్చుకున్న ఒక విషయం మళ్లీ గుర్తు చేసుకుందాం. ఆసనానికి మూడు స్థితులు ఆసనం వేయాలి అని శరీరాన్ని, మనసుని సిద్ధం చేయడం. ఆసనం వేసిన స్థితి, విశ్రమస్థితి ఆసనానికి ఇవి మూడు తప్పనిసరి.
ఎక్కువ ఆసనాలు తక్కువ సమయం కాకుండా తక్కువ ఆసనాలు ఎక్కువ సమయం ఉండేలా చూడండి ఫలితం ఎక్కువగా వుంటుంది. శ్రీ గురుభ్యోనమః