April 26, 2024

సంస్కరణ

రచన: శ్రీ మహాలక్ష్మి మృదుల – ఆనంద్ ఇద్దరూ ఉద్యోగస్తులు. వారికి ఒక పాప. ఇద్దరూ ఉద్యోగస్తులు అవటం వల్ల పాపా సంరక్షణ మృదుల వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. ఏ చీకు చింత లేని కాపురం. అన్ని సమకూర్చినట్టు ఉన్న జీవితం. మృదులకి ఆఫీస్ లో తెలివైంది అని, కలుపుగోలు మనిషి అని, మంచి సమర్థురాలని ఇలా మంచి పేరుంది.ఆ పేరుని అలాగే నిలబెట్టుకోవాలని చాలా తాపత్రేయ పడుతుంది. ఆ రోజు తన ప్రతిభను చూపించగలిగే ఒక […]

కౌండిన్య హాస్య కథలు – తప్పెవరిది?

రచన: రమేశ్ కలవల   భార్యా భర్తలన్నాక సవాలక్షా ఉంటాయి. వారి విషయంలో మనం జోక్యం  చేసుకోకూడదు. కానీ ఇది జోక్యం జేసుకోవడం కాదేమో, ఏం జరిగిందో తెలుసుకుంటున్నాము అంతే కాబట్టి ఓ సారి ఏం జరిగిందంటే… ఆఫీసు నుండి వచ్చి బట్టలు విడిచి భార్యకు వాటిని ఉతకడానికి  అందజేసాడు చందోళం. ఆ ప్యాంటు చూస్తూ “ఉతుకడానికేనా?” అంది ఇందోళం. “ఏంటి, నన్నా” అని అడిగాడు హాలులోకి వెడుతూ అప్రమత్తం అవుతూ. “మీ ప్యాంటు తో మాట్లాడుతున్నానండి. […]

అన్యోన్య దాంపత్యం

రచన: నిష్కల శ్రీనాథ్   ‘అలనాటి రామచంద్రునికి అన్నింటా సాటి ..” అంటూ టీవీలో వస్తున్న పాటకు కూనిరాగం తీస్తూ బాల్కనీలో కుండీలలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తుంది శ్రావణి. ఆ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తూ పక్కింటి నుండి పెద్దగా అరుపులు వినపడ్డాయి , రోజు అవి విని విని అలవాటు పడిన శ్రావణి మాత్రం తన పని తాను చేసుకోసాగింది. ” మొదలైయిoది మళ్ళి ” అంది పని మనిషి సత్తెమ్మ ఇల్లు తుడిచిన […]

ఆడాళ్లూ…. మీకు జోహార్లూ

రచన: పద్మజ యలమంచిలి   50వ దశకంలో..ఆధునికత అప్పుడప్పుడే వంటబట్టించుకున్న  కుటుంబాల్లో ఆడపిల్లలు చదువుకుని వారికి కావాల్సిన జీవితాన్ని బాగానే ఎంచుకుని జీవించగలిగినా..పల్లెటూరి పోకడలు, అజ్ఞానంతో కొట్టు మిట్టాడే కుటుంబాల్లోని ఆడపిల్లలు మాత్రం ఎంత ధనికులైనా తల్లి తండ్రులు చెప్పినట్టు బుద్దిగా పెళ్ళిచేసుకుని పిల్లలు ,సంసారం ఇదే ప్రపంచంగా బ్రతికేసే వారు.. అదిగో అలాంటి కుటుంబం నుంచి వచ్చిందే …మా ఇంటి పక్కన వుండే నా ఈడు ఈ సీతమ్మ తల్లి కూడానూ.. భర్తలేని పల్లెటూరి స్త్రీ […]

శాకుంతలం

రచన : శ్రీపాద   శకుంతలకు అన్నం సయించటం లేదు, కంటికి కునుకూ పట్టడం లేదు. కారణం ’అబ్బే ఏమీ లేదు ’ అన్నా ఆవిడకు తెలుసు ఏ మూలో ఉన్న దాని ఉనికి. అక్కడికీ ఆవిడకు పట్టు పరిశ్రమ అనేది బాగానే తెలుసు. ఎవరు ఏ కాస్త పనికి వస్తారనిపించినా అస్సలు వదలదు గాక వదలదు చీటికీ మాటీకీ చెట్టెక్కే భేతాళుడిని భుజాన వేసుకునే విక్రమార్కుడిలా. అ”రామ సీత గొప్ప మనిషి ఎంత చక్కని కవిత్వం […]

నా స్వామి పిలుపు వినిపిస్తుంది…

రచన, చిత్రం : కృష్ణ అశోక్ అరుణోదయ రాగాలు రక్తి కడుతున్న వేళ హృదికర్ణపు శృతిగీతం పరిపూర్ణం కాక మునుపే…. చల్లని మండుటెండల్లో భావుకతపు తరువుల నీడన గుండె వాయువంతా ఆక్సిజన్ ఆశలతో నిండకనే…. వెన్నెల కురిసే రాత్రుళ్ళు ప్రియ తారలు వెదజల్లే వెలుగు ధారల పరితాహాపు మోహ దాహం తీరకనే…. కాన్వాస్ రంగుల చిత్రాలు దేహం ప్రాణం దాటి నా ఆత్మాణువులుగా సంపూర్ణ పరిణామం పొందక మునుపే… కొద్దికాలం ఇంకొద్దికాలం గడువు పొడిగించు స్వామీ నీ […]

తపస్సు

రచన: రామా చంద్రమౌళి   జ్ఞానానికి రూపం లేదు.. గాలి వలె ప్రవహించడం జీవ లక్షణమైనపుడు స్థితి స్థల సమయ కాలాదులు అప్రస్తుతాలు అగ్ని ఎప్పుడైనా, ఎక్కడైనా దహిస్తుంది కదా జ్ఞానమూ, కళా అంతే దహిస్తూ, వెలిగిస్తూ, దీప్తిస్తూ.. లీనమైపోతూంటుంది – అది సంగీతమో, సాహిత్యమో, యుద్ధ క్రీడో శిష్యుడు తాదాత్మ్యతతో భూమై విస్తరించాలి విస్తృతమై .. ఎదుట అప్పుడు ముఖం రెక్కలు విప్పిన ‘ ఆంటెనా ‘ ఔతుంది బీజాలు బీజాలుగా, సంకేతాలు సంకేతాలుగా .. […]

హిమవత్పద్యములు 1

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు మన భూమిపైన ఉత్తర ప్రాంతాలలో, ముఖ్యముగా అమెరికాలో, కనడాలో, యూరోపులో జనవరి, ఫిబ్రవరి నెలలలో ఎక్కువగా మంచు కురుస్తుంది. మంచు (snow స్నో) అంటే మెల్లగా ఘనీభవించిన నీరు. మేఘాలలోని నీళ్లు నేలను తాకడానికి ముందు వాయుమండలములో స్ఫటికరూపములో మారుతుంది. అంటే ఉష్ణోగ్రత సున్న డిగ్రీల సెల్సియస్ (అనగా -32 డిగ్రీల ఫారన్‌హైట్) కంటె తక్కువ ఉంటుంది. నేలపైన మళ్లీ నీరుగా మారకుండా ఉండాలంటే దాని ఉష్ణోగ్రత కూడ సున్న […]

తేనెలొలుకు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు తెలుగు భాషను వన్నెకెక్కించిన ప్రక్రియల్లో అవధాన ప్రక్రియ ఒకటి. ఇప్పటికీ ఈ ప్రక్రియ నిత్య నూతనంగా ఉందని చెప్పడానికి నిన్నమొన్న రవీంద్రభారతిలో జరిగిన ద్విగుణిత అష్టావధానం ఉదాహరణగా చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఎక్కడో దేశంగాని దేశం అమెరికాలో పుట్టి గీర్వాణాంధ్ర భాషలలో సమంగా అష్టావధానం చేయడం మాటలు కాదు. అతననే కాదు అష్టావధానం ఎవరికైనా కష్టావధానమే. పద్యం రాయడంలో పట్టుండాలి. పాండిత్యముండాలి. సద్యస్ఫూర్తి ఉండాలి. ధారణా పటిమ ఉండాలి. వాక్శుద్ధి ఉండాలి. ఉచ్ఛారణాపటుత్వం […]

ఆంధ్రపితామహుడు–శ్రీ మాడపాటి హనుమంతరావు గారు

రచన: శారదాప్రసాద్ మాడపాటి హనుమంతరావుగారు మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు, ఎవరికి, విధిప్రేరణం అనే కధలు ‘మల్లికాగుచ్చం’ పేరుతో 1911 లో పుస్తక రూపంలో వచ్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం ‘తెలంగాణా ఆంధ్రోద్యమం’. మాడపాటి హనుమంతరావుగారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. వీరు 11 -11 -1970 న తెలుగు వారిని […]