April 27, 2024

నంజనగూడు, దొడ్డమల్లూరు ఆలయాలు

రచన: రమా శాండిల్య ఈ సారి నా కర్ణాటక యాత్రానుభవాలులో రెండు క్షత్రాలను గురించి వ్రాస్తున్నాను. అవి మొదటిది నంజనగూడు, రెండవది దొడ్డ మల్లూరు. 1. శ్రీ నంజుండేశ్వర స్వామి, కర్ణాటక, మైసూర్! నంజన గూడు! కర్ణాటక యాత్రలలో భాగంగా, నంజనగూడు యాత్ర అనుకోకుండా ఈ మధ్య చేసాము. చాలా మంచి యాత్రగా దీనిని చెప్పుకోవచ్చు! భక్తజన సులభుడు ఈ నంజనగూడు శ్రీ కంఠేశ్వరుడు. దక్షిణ కాశీగా పిలవబడే ఈ నంజనగూడు, భక్తుల సర్వ రోగాలనూ పోగొట్టే […]

పంచనదీశ్వరస్వామి

ధర్మసంవర్థనీసమేత శ్రీ పంచనదీశ్వర స్వామి ఆలయం!! రచన: రమా శాండిల్య ఈ మధ్య మేము చేసిన తమిళనాడు, కేరళ యాత్రలో ఒక భాగమైన, ఒకరోజు దర్శించుకున్న క్షేత్రమే ఈ, ‘పంచనదీశ్వర స్వామి’ ఆలయం. తమిళనాడు రాష్ట్రంలోని, తంజావూరు జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లె ఈ ఆలయం ఉన్న, ‘తిరువయ్యారు’. తంజావూరు నుంచి ఉదయం ఎనిమిది గంటలకు తిరువయ్యారు బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ, మొదట పంచనదీశ్వరాలయము దర్శించుకున్నాము. దర్శనానికి వచ్చిన తోటి భక్తులనుంచి సేకరించిన సమాచారం ప్రకారం, […]

*సోమనాథ్ పురా ఆలయం – ప్రశాంతతకు నిలయం*

రచన: రమా శాండిల్య బెంగుళూర్ నుంచి ఒక్కరోజులో వెళ్ళి, తిరిగి రాగలిగిన అద్భుతమైన వినోద, విజ్ఞాన, ఆధ్యాత్మిక, చారిత్రక యాత్ర, ఈ సారి నేను వ్రాస్తున్న ఈ యాత్రాదర్శిని. బెంగుళూర్ మా ఇంటినుంచి, ఉదయం ఆరుగంటలకు బయలుదేరి, సాయంత్రం ఏడుగంటలకు ఇంటికొచ్చేసాము. ఈ ట్రిప్పులో, మేము చూసిన స్థలాలు, సోమనాథ్ పురాలోని, శ్రీ కేశవస్వామి ఆలయం. ఈ మధ్యలో ఏ ఆలయానికి ఇంత ‘థ్రిల్’ అయి చూసిన అనుభవమే లేదు. అంత అద్భుతమైన ఆలయం. రెండవది, ఒక […]

“గవి గంగాధరేశ్వరుడు” బెంగుళూర్

రచన: రమా శాండిల్య గవి అంటే కన్నడలో, ‘గుహ అని అర్థంట!! పాత బెంగుళూర్ లో అతి పురాతన ఆలయం. గవి గంగాధరాలయం. ఈ ఆలయం ఒక కొండ గుహ లోపల ఉన్నది. ఏ మాత్రము మార్పులు చెయ్యకుండా అలాగే కాపాడుతున్న అతి పురాతన ఆలయం ఈ శివాలయం. పైగా ఎన్నో ప్రాముఖ్యతలున్న ఆలయం ఇది. ఈ ఆలయం సూర్య ప్రతిష్ట అని, ఇక్కడ శివుడితో సమానంగా సూర్యుడికి కూడా ఆరాధన జరుగుతోందని ఇక్కడి పూజారులు చెప్పారు. […]

సారంగపూర్ ఆంజనేయస్వామి గుడి:

రచన: రమా శాండిల్య నిజామాబాద్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ‘సారంగపూర్ ‘ అనే ఒక గ్రామంలో వందల సంవత్సరాల క్రితం నుంచీ, చిన్న కొండ మీద ఉన్న దేవాలయమే ఈ సారంగపూర్ ఆంజనేయస్వామి దేవాలయం. ఈ దేవాలయం వెనుక చాలా చరిత్ర ఉన్నది. భారతదేశ చరిత్రలో సమర్థ రామదాసు యొక్క పాత్ర చాలా ఉన్నదని చరిత్ర చెబుతున్నది. ఈ సారంగపూర్ ఆంజనేయస్వామి గుడి ఛత్రపతి శివాజీ కూడా దర్శించుకునేవాడట. ‘ఛత్రపతి శివాజీ’ హిందూసామ్రాజ్యాన్ని స్థాపించడానికి అతని […]

ముక్తిక్షేత్రంలో ముక్తిక్షేత్రం

‘ముక్తిక్షేత్రంతో ముక్తిక్షేత్రం’ రచన: రమా శాండిల్య ఈ మధ్య నేను ‘ముక్తిక్షేత్రము’ అనే పుస్తకం నా కాశీయాత్రల గురించి వ్రాసాను. ఆ పుస్తకాన్ని కాశీవిశ్వనాథుడి సన్నిధిలో ఒక్కసారి పెట్టి రావాలనే సంకల్పం కలిగింది. నా మనసులోని మాటను గ్రహించినట్లు నా దగ్గర యోగా నేర్చుకుంటున్న నా శిష్యురాలు ఒకరోజు ప్రొద్దున్నే ఫోన్ చేసింది. “అమ్మా! నాకు కాశీ చూడాలని ఉంది. అది కూడా మీతో కలిసి చూడాలనుకుంటున్నాను. మీకు వీలవుతుందంటే కార్తీకపౌర్ణమికి కాశీలో ఉండేలా ప్లాన్ చేసుకుందాము.” […]

రాజస్థాన్ లోని రణతంబోర్ గణేష్:

రచన: రమా శాండిల్య 2018 లో నా స్నేహితురాలు, జైపూర్ లో ఉన్న వారి వియ్యాలవారి ఇంటికి వెళుతూ నన్ను ఆహ్వానించింది. సరే, ప్రయాణాలంటే ఇష్టమున్న నేను ‘అక్కడ ఏదైనా గుడి గోపురం చూపిస్తే వస్తానని’ జోక్ చేసాను. దానికి ఆమె, “మనం వెళ్లేదే గుడి కోసం” అని చెప్పింది. వారి ఇళ్లల్లో పెళ్లిళ్లు, పేరంటాలు అయినా, పిల్లలు పుట్టినా, ఏదైనా ముఖ్యమైన పనులు జరిగినా రణతంబోర్ గణేశ గుడికి తప్పక వెళతారట. నా స్నేహితురాలి రెండవ […]

విహారయాత్రలు ( మలేషియా ) – కౌలాలంపూర్

రచన: నాగలక్ష్మి కర్రా కౌల అంటే రెండు నదులు కలిసిన ప్రదేశం లేక నది సముద్రంలో కలిసిన ప్రదేశాన్ని స్థానిక భాషలో ‘ కౌల‘ అని అంటారు, ‘లంపోర్‘ అంటే బురద అని అర్ధం. కౌలాలంపూర్ కి ఒక కిలోమీటరు దూరంలో ప్రవహిస్తున్న ‘లంపూర్‘, నది ‘ గోంబర్‘ నదిలో కలుస్తోంది 1857 లో ఈ ప్రాంతం సెలంగోరు సుల్తాను పరిపాలనలో ఉండగాగోంబర్ నది క్లాంగ్ నదీ సంగమ ప్రాంతంలో టిన్ను గనుల త్రవ్వకాలు అప్పటి సుల్తాను […]

నా_యాత్రానుభవం_2021_లో_సప్తశృంగి

రచన: రమా శాండిల్య అనుకోకుండా ఒకరోజు, నా దగ్గర యోగా నేర్చుకునే ఒక శిష్యురాలు… విశాఖపట్నం నుండి ఫోన్ చేసింది. “అమ్మా, నాకు షిరిడీ వెళ్లాలనుంది, మీరు కూడా వస్తానంటే ఇరువురం కలిసి ఒక్కరోజులో షిరిడీ చూసి వద్దాము” అన్నది. అప్పుడు కోవిడ్ గురించి భయము కొంచెం తక్కువగానే ఉంది. విశాఖపట్నం నుంచి నా స్టూడెంట్ ‘సంధ్య’ హైదరాబాద్ వచ్చేట్లు, నేను అదే సమయానికి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకునేటట్లు, ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రకారమే టిక్కెట్స్ […]

విదేశవిహారం చేద్దాం నాతోరండి – ( మలేషియా )

రచన: కర్రా నాగలక్ష్మి మలేషియ, ఈ మధ్య కాలంలో బలమైన ఆర్ధిక దేశంగా రూపుదిద్దుకుంటున్న దేశం, మంచి పర్యాటక దేశంగా కూడా రూపు దిద్దు కుంటోంది. మలేషియ ముస్లిం దేశంగా ప్రకటించుకుంది. అయినా ఇక్కడ హిందూ బౌద్ద మతాలకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇచ్చేరు. పదమూడు రాష్టాలు, దక్షిణ చైనా సముద్రం వల్ల రెండు ద్వీపాలుగా విభజింపబడ్డ ఈ దేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు వున్నాయి. ఈ సంచిక నుంచి మీకు మలేషియా లోని ప్రదేశాలను, ఒకటొకటిగా […]