April 27, 2024

జానపదబ్రహ్మ బి.విఠలాచార్య

రచన: శారదాప్రసాద్ ‘జురాసిక్ పార్క్’లో రాక్షస బల్లుల్ని చూసి స్పీల్‌బర్గ్‌ ని బ్రహ్మాండంగా మెచ్చుకున్నాం! వాళ్లకు హైటెక్ కెమెరాలు, అడ్వాన్స్ గ్రాఫిక్సులున్నాయ్!మిలియన్ డాలర్ల డబ్బులున్నాయి ! విఠలాచార్య దగ్గర ఇవేవీ లేవు. ఆయన దగ్గర ఉందల్లా ఓ మిఛెల్ కెమెరా,మూణ్ణాలుగు లక్షల బడ్జెట్టు మాత్రమే ! వీటితోనే వెండితెరపై పరకాయ ప్రవేశాలు… గుర్రపు స్వారీలు… కత్తి ఫైటింగులు… వింత పక్షులు, జంతువులు… పుర్రెలు, అస్థిపంజరాలు… సృష్టించాడు. బి.విఠలాచార్య ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా […]

జ్ఞానజ్యోతి శ్రీమతి సూరి నాగమ్మ గారు

రచన: శారదాప్రసాద్ కష్టాలు, కన్నీళ్ళతో నిండిన జీవితానుభవాలు ఒక్కొక్కసారి జీవితాన్ని అనుకోని మంచి మలుపులు తిప్పుతాయి. శ్రీమతి సూరి నాగమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం. ఈ వ్యాసం చదివే వారిలో చాలామందికి శ్రీమతి సూరి నాగమ్మ గారు ‘సూరి నాగమ్మ గారి లేఖలు’ అనే ఆవిడ గ్రంధం ద్వారా సుపరిచితులు. ఈ లేఖలను ఆవిడ 1940 ప్రాంతంలో రమణ మహర్షి ఆశ్రమం నుండి తన సోదరునికి వ్రాసారు. 20 వ శతాబ్దానికి చెందిన ఒక దివ్య […]

గరుడ పురాణం

రచన: శారదాప్రసాద్ వేదవ్యాస మహర్షి రాసిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. గరుడుడు(గరుత్మంతుడు)పక్షులకు రాజు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు వాహనం కూడా!ఈ పురాణంలో అనేక కధలు కూడా ఉన్నాయి. ఇవి విష్ణువుకు, గరుడుడికి జరిగిన సంభాషణ రూపంలో ఉంటాయి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి. తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని […]

చైతన్య స్రవంతి (Stream of consciousness)-జేమ్స్ జోయిస్-యులిసెస్

  ​రచన: శారదాప్రసాద్ అంతరంగాన్ని మధిస్తే అద్భుతమైన కావ్యాలు పుట్టుకు వస్తాయి. మనం ఒక గంటసేపు ఆలోచించిన సంఘటలన్నిటినీ, వ్రాస్తే, కొన్ని​వందల పుటల గ్రంధమౌతుంది. 20 వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ నూతన సాహిత్య ప్రక్రియకు ఆద్యుడైనవాడు జేమ్స్ జోయిస్. ఆ ప్రక్రియే​ ​stream of consciousness. ఈ​ ​ప్రక్రియలో ఆయన స్పూర్తితో తెలుగులో కూడా చక్కని నవలలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి గోపీచంద్ గారి అసమర్ధుని జీవయాత్ర, బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, వినుకొండ నాగరాజు […]

‘ధ్యానం’ అంటే ఏమిటి?

రచన: శారదా ప్రసాద్ ఈ మధ్య కొంతమంది మిత్రులు ‘నేను ఫలానా విధంగా ద్యానం చేస్తున్నాను, అది మంచిదేనా అనో లేకపోతే అటువంటి ధ్యానాన్ని ఏమంటారని ‘ఇలాగా చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు ‘ధ్యానం’ అంటే ఏమిటో తెలుసు కోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఈ మధ్య, చాలా ఊళ్ళల్లో, పెద్ద పెద్ద బానర్లు కట్టి, ‘ మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం, మీ వ్యాపారాభివృద్ధి కోసం నేర్చుకోండి సిద్ధ సమాధి […]

గరిమెళ్ల సత్యనారాయణ గారు

రచన: శారదాప్రసాద్ స్వాతంత్య్రోద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణ గారిది విశిష్టమైన స్థానం. గరిమెళ్ల గేయాలు జాతీయ వీర రసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూ గించాయి. అతను వ్రాసిన ‘మా కొద్దీ తెల్ల దొరతనం’ పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండంలోని ప్రియాగ్రహారంలో 1893 జూలై 15న జన్మించారు. బి. ఏ. డిగ్రీ పూర్తి చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత […]

కమనీయ నాట్యకళామూర్తి పసుమర్తి కృష్ణమూర్తి గారు

రచన: శారదాప్రసాద్ పసుమర్తి కృష్ణమూర్తి ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనులపండువ కనిపించే కొన్ని నాట్యాలు తెర మీద చూస్తూవుంటే పసుమర్తి కృష్ణమూర్తి గారు గుర్తుకొస్తారు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలో మనం చూస్తున్న నృత్యాలకు రూపశిల్పి కృష్ణమూర్తి […]

కర్ణాటక సంగీత విద్వాంసుడు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గారు

రచన:  శారదాప్రసాద్   జాన్.బి.హిగ్గిన్స్ ను భారతీయ సంగీత ప్రియులు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గా పిలుస్తుంటారు.అమెరికా దేశానికి చెందిన ఈ గాయకుడు అమెరికాలోని వెస్లే విశ్వవిద్యాలయంలో విద్యార్ధిగా మరియు వృత్తి నిపుణుడిగా పనిచేశారు.18-09 -1939 న అమెరికాలోని Andover లో పుట్టారు.ఫిలిప్స్ అకాడమీలో ప్రాధమిక విద్యను  అభ్యసించాడు.తండ్రి ఆంగ్లాన్ని బోధించాడు.తల్లి సంగీతాన్నిచాలా సంవత్సరాలు నేర్పింది.వెస్లే విశ్వవిద్యాలయం నుండి 1962 లోనే మూడు డిగ్రీలను తీసుకున్నారు. సంగీతంలో కూడా పట్టాను సంపాదించారు.వివిధ దేశాలకు చెందిన సంగీతాన్ని గురించి పరిశోధన […]

కర్ణాటక సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తిగారు

రచన: శారదాప్రసాద్ కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన నేదునూరి కృష్ణమూర్తి తెలుగువాడు కావడం తెలుగు ప్రజల అదృష్టం. నేదునూరి కృష్ణమూర్తి గారు అక్టోబరు 10, 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. వీరి తండ్రి పిఠాపురం రాజా వారి సంస్థాన కార్యాలయంలో పనిచేస్తూండేవారు. నేదునూరి 1940 లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్‌, గాత్రంలో ప్రాథమిక శిక్షణ పొందారు. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు నాయుడు గారి […]

శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారి కొన్ని ఆలోచనలు

రచన: టీవీయస్. శాస్త్రి ఆలోచన వేరు, తెలివి వేరు-వాటి మధ్యన గల తేడాను పరిశీలించారా? ఒక అడవి మృగాన్ని చూసినప్పుడు స్వీయరక్షణ కోసం లోపలి నుండి స్వత:సిద్ధంగానే వచ్చే ప్రతిస్పందనను తెలివి అనీ, అది భయం కాదని ఇంతకు ముందు మీకు చెప్పాను. భయాన్ని పెంచి పోషించే ఆలోచన ఇందుకు పూర్తిగా విభిన్నమైనదని కూడా అన్నాను. మిత్రుల కోరికపై కొంత వివరణ ఇస్తాను. పైన చెప్పినవి రెండూ భిన్నమైనవి కదా? భయానికి జన్మనిచ్చి, పెంచి పోషించే ఆలోచనకు, […]