April 27, 2024

రక్షాబంధనం

రచన: స్వర్ణలతానాయుడు   శ్రావణమాసంలో శుక్లపక్షమి పౌర్ణమి రోజునాడు వచ్ఛేదే రాఖీ పండుగ. భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లని చెప్పడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు.అన్నాచెల్లెళ్ళ అనురాగబంధానికి ప్రతీకగా జరుపుకునే వేడుక ఇది.   ఈ రోజున వేకువజామునే లేచి తలస్నానం చేసి దైవపూజ కావించుకుని సోదరుల నుదుట తిలకం దిద్ది, మంగళహారతిచ్ఛి  నోరు తీపి చేసి సప్తవర్ణాలను తలపించే రంగురంగులదారాలతో అన్నాతమ్ముళ్ళకు రాఖీ కట్టి  వారి ఆశీర్వాదం తీసుకుంటారు.అదే తమ్ముడైతే అక్క ఆశీర్వదిస్తుంది కలకాలం సోదరుల జీవితాలు ఆనంద […]

జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధి -శ్రీ రావూరి భరద్వాజ గారు

రచన: టీవీయస్.శాస్త్రి     తెలుగు సాహితీ జగత్తులో కేవలం స్వయంకృషితో,ప్రతిభా పాటవాలతో ఎదిగిన గొప్ప రచయిత శ్రీ రావూరి భరద్వాజ. శ్రీ రావూరిగారు తాను అనుభవించిన కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను, అభిశంసలను, నిరాదరణలను, అనుభవాలను,  అనుభూతులను,కథా వస్తువులుగా మలుచుకున్నారు. ‘పాకుడురాళ్ళు’. కాదంబరి’ నవలలు–“అధోజగత్సహోదరుల కథా సరిత్సాగరం…”అని మహాకవి శ్రీశ్రీ నుండి అభినందనలు అందుకున్నట్టి రచయిత శ్రీ రావూరి వారి’జీవన సమరం’వంటి  ఒక యదార్ధ గాధా సంపుటం–“ఒక్క భారతీయ భాషల్లోనే కాదు, నాకు తెలిసిన ,ఏ విదేశీ […]

“బనవాసి” – చారిత్రక సాహిత్య కధామాలిక – 4

రచన: మంధా భానుమతి  పదవ శతాబ్దం.. పూర్వార్ధం.. “బనవాసి”.. ఉత్తర కేరళ నుండి, ఉత్తర కర్ణాటక వరకు ఏక ఖండంగా రాజ్యమేలిన కాదంబ రాజుల ముఖ్య పట్టణం. కాల క్రమాన కాదంబ వంశ పాలన క్షీణించి, ఆ ప్రదేశమంతా చాళుక్యుల, ఆ తరువాత రాష్ట్రకూటుల సామంత రాజ్యంగా మారిపోయింది. కాదంబరాజు శివకోటి, యుద్ధాలలో రక్తపుటేరులు పారడం సహించలేక,  జైన మతం స్వీకరిస్తే, అప్పటినుండీ ఆ రాజ్యం జిన సంస్కృతికి మారుపేరుగా నిలిచింది. భీమనప్పయ్య జైనమతం నుండి మారి, […]

మాలిక పత్రిక జ్యేష్టమాస సంచికకు స్వాగతం.

మాలిక పత్రిక జ్యేష్టమాస సంచికకు స్వాగతం. మాలిక పత్రిక ఇప్పుడు మాసపత్రికగా మిమ్మల్ని అలరించబోతుంది.  కొత్త కొత్త రచనలను, ఆలోచనలను మా పత్రిక ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. ఏదైనా కొత్తగా రాయాలన్న తపన, రాయగలము అన్న నమ్మకం మీకుంటే తప్పకుండా రాయండి..మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ సంచికలో ఒక కొత్త ప్రయోగం చేయడమైనది అదే కవితామాలిక. ఈ ప్రయోగం విజయవంతం ఐతే ముందు ముందు మరిన్ని చేయాలని ఉంది.. ఈ సంచికలోని అన్ని రచనలు మీకు నచ్చుతాయని […]

సంపాదకీయం : పసలేని (పనికిరాని) ప్రకటనలు

జ్యోతి వలబోజు   ఏ వస్తువైనా తయారు చేసాక అమ్మడం ఎంతో ముఖ్యం . అలాగని ఆ వస్తువు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ అమ్మడం  చాలా కష్టం. మార్కెట్లో తయారైన కొత్త వస్తువులగురించి ఎక్కువమందికి తెలియాలంటే ఒకటే దారి ఉంది. అదే వ్యాపార ప్రకటన.. బట్టలు, పిల్లలకు అవసరమయ్యే వస్తువులు, తినే వస్తువులు, వాహనాలు, నగలు, గృహావసర వస్తువులు ఇలా ఏదైనా సరే.. ఆ వస్తువుకు సంబంధించి అందమైన, అర్ధవంతమైన ప్రకటన తయారు చేసి […]