April 27, 2024

మహా భారతము నుండి ఏమి నేర్చుకోవచ్చు ?

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. మహాభారతమును పంచమ వేదము అంటారు. అంటే వేదాలు మనకు అనేక విషయాలను తెలియజేస్తాయి. చాలా విషయాలకు వేదాలలో చెప్పబడ్డవే ప్రామాణికంగా ఈ నాటికి నిలుస్తున్నాయి. అలాగే మహాభారతము దాయాదుల పోరు అయినప్పటికీ రాజనీతి అనేక ధర్మసూక్ష్మాలు, వేదాంత విషయాలు, యుద్ధ తంత్రాలు మొదలైన అనేక విషయాలు విపులముగా చర్చింపబడ్డాయి. విదురుడు, భీష్ముడు లాంటివారు అనేక రాజనీతి సూత్రాలు వివరిస్తారు. దురదృష్టము ఏమిటి అంటే దృతరాష్ట్రుడు దుర్యోధనుడు లాంటి వారు పెడచెవిన బెట్టి […]

చిన్ని ఆశ

రచన: నాగజ్యోతి రావిపాటి పక్షిగా నా పయనం ఎటువైపో తెలియదు..కాని నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నా.. ఆ దూర తీరాలు కనిపించి కవ్విస్తున్నా.. అలుపెరగక ముందుకు సాగుతున్నా.. నా ఈ ఒంటరి పయనంలో ఒక చోట నాలాగే మరిన్ని ఆశా జీవులు కనిపించాయి..మాట మాట కలిసి మనోభావాలు తెలిపి ఈ సారి గుంపుగా తరలి వెళుతుంటే..ఎన్నో సూర్యోదయాలు పలకరించి పారవశ్యం కలిగించాయి. ఆ మేరు పర్వతాలు గర్వంగా నిల్చుని తమ శోభను చూపుతున్నాయి. హిమాని నదుల అందం […]

నలదమయంతి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు . మహాభారతములో ధర్మరాజు ,సోదరులు అరణ్యవాసములో అనేక కష్టాలు పడి ఒకసారి వృహదశ్వ అనే ఋషి పుంగవుడిని కలిసి అరణ్యవాసములో వారు అనుభ విస్తున్న కష్టాలను మహర్షికి వివరిస్తాడు ఆ మహర్షి వారి బాధలను తొలగించటానికి అంతకన్నా ఎక్కవ కష్టాలు పడ్డ నల -దమయంతుల కధ వివరిస్తాడు ఎందుకంటే ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోవటం నలుడు రాజ్యాన్ని కోల్పోవటం జూదము ఆడటంవల్లే. ముందు నలుడి గురించి తెలుసుకుందాము. అందగాడు పరాక్రమవంతుడు అయినా నలుడు […]

కాశీ లోని పాతాళ వారాహి అమ్మవారి దేవాలయము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు… వారాహి అమ్మవారి దేవాలయము కాశీలో విశ్వనాధమందిరానికి దగ్గరలో త్రిపుర భైరవి ఘాట్ వద్ద ఉన్నది. ఈ దేవాలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. వారాహి అమ్మవారు సప్తమాతలలో ఒకరు.  శ్రీ మహావిష్ణువు హిరాణ్యాక్షుడిని చంపి భూమిని కాపాడటానికి వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ అమ్మవారు శక్తిని ఇచ్చింది. ఈ దేవాలయము ఉదయము ఐదు గంటలనుండి ఎనిమిది గంటలవరకే భక్తుల సందర్శనార్ధము తెరచి ఉంచుతారు అమ్మవారికి జరిపే పూజలు సూర్యోదయానికి ముందే  తలుపులు మూసి […]

కర్ణాటక సంగీత విద్వాంసుడు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గారు

రచన:  శారదాప్రసాద్   జాన్.బి.హిగ్గిన్స్ ను భారతీయ సంగీత ప్రియులు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గా పిలుస్తుంటారు.అమెరికా దేశానికి చెందిన ఈ గాయకుడు అమెరికాలోని వెస్లే విశ్వవిద్యాలయంలో విద్యార్ధిగా మరియు వృత్తి నిపుణుడిగా పనిచేశారు.18-09 -1939 న అమెరికాలోని Andover లో పుట్టారు.ఫిలిప్స్ అకాడమీలో ప్రాధమిక విద్యను  అభ్యసించాడు.తండ్రి ఆంగ్లాన్ని బోధించాడు.తల్లి సంగీతాన్నిచాలా సంవత్సరాలు నేర్పింది.వెస్లే విశ్వవిద్యాలయం నుండి 1962 లోనే మూడు డిగ్రీలను తీసుకున్నారు. సంగీతంలో కూడా పట్టాను సంపాదించారు.వివిధ దేశాలకు చెందిన సంగీతాన్ని గురించి పరిశోధన […]

అష్టావక్రుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు పూర్వము ఏకపాదుడనే నిరంతర తపోనిరతుడైన బ్రాహ్మణుడు భార్య సుజాతతో శిష్యకోటికీ వేదములు బోధిస్తూ హాయిగా గురుకులములో కాలక్షేపము చేయసాగారు. వేద విద్య బోధించే ఏకపాదుడు విద్య బోధించే విషయములో శిష్యుల పట్ల చాలా కఠినముగా వ్యవహరించేవాడు. చాలా కాలానికి ఎన్నో నోముల ఫలితముగా భర్త అనుగ్రహము చేత సుజాత గర్భవతి అయినది. గర్భములో నున్న శిశువు తండ్రి శిష్యులకు భోధించుచున్న వేదములను వల్లె వేయసాగాడు. ఒకనాడు తండ్రి వల్లె వేస్తున్నప్పుడు గర్భములో […]

మరుజన్మంటూ ఉంటే..

రచన: స్వరూప నేను మహిళా పక్షపాతిని కాదు. పురుష ద్వేషినీ కాదు. ఆడ-మగతోనే సమాజానికి బ్యాలెన్స్ అని నమ్మే వ్యక్తిని. వాస్తవానికి నేను నా కుటుంబంలో ఎక్కడా మహిళా పక్షపాతాన్ని, ఆడపిల్లను అనే చిన్నచూపును ఎదుర్కోలేదు. మా అన్నయ్యలతో సమానంగా మా అమ్మానాన్న నాకు స్వేచ్ఛనిచ్చారు. మా అన్నయ్యల కంటే కూడా నాన్న నన్ను ఎక్కువ ప్రేమగా చూసేవారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే అయి ఉంటుందని నా కాలేజీ రోజుల నుంచే మా కుటుంబానికి […]

బుద్ధుడు-బౌద్ధ మతం

రచన:  శారదా  ప్రసాద్ ​బౌద్ధ మతం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి – మహాయానము, థేరవాదము. తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.”బుద్ధుడు అట్టడుగువర్గాల విముక్తి ప్రధాత. రాజకీయ మార్గదర్శి’’ గౌతమ బుద్ధుని పైనా, ఆయన సామాజిక కార్యాచరణ పైనా విస్తృత పరిశోధన చేసిన సి.ఎఫ్. కొప్పన్ అన్నమాటలివి. […]

పార్శీయులు

రచన: టీవీయస్.శాస్త్రి (పార్శీల మత చిహ్నం) 2004 గణాకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జొరాస్త్రియన్ల సంఖ్య 1, 45, 000 నుండి 2, 10, 000 వరకూ ఉన్నది. 2001 భారత్ జనగణన ప్రకారం 69, 601 పార్శీలు భారత్ లో గలరు. క్రీస్తు శకం తరువాత జొరాస్త్రియన్లు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వీరినే పార్శీయులు అని అంటారు. కుస్తీ యజ్ఞోపవీతము(ఒడుగు / జంధ్యం) ధరించే ఆచారము వీరిలో కూడా ఉన్నది. […]

యక్ష ప్రశ్నలు

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు. సాధారణముగా జవాబు చెప్పటానికి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎవరైనా వేస్తుంటే మనము “వీడి యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పటం కష్టము” లేదా యక్ష ప్రశ్నలతో విసిగిస్తున్నాడు” అని అంటాము అసలు ఈ యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని అడిగారు వాటికి సమాధానాలు ఏమిటి? అనే విషయము గురించి క్లుప్తముగా తెలుసుకుందాము. దేవలోకములో ఉండే వారిని గంధర్వులు యక్షులు అని అంటారు. అటువంటి ఒక యక్షుడు అరణ్యవాసము చేస్తున్న పాండవులను ముఖ్యముగా ధర్మరాజును […]