రచన : కావలి కోదండరావు
ఒక గొంతే అరిచిందని చులకన చేయకు.
కాసేపట్లో మరో పది గొంతులు శృతికలిపితే
ఆ కోరస్ నింగినున్న చుక్కను తాకుతుంది.
చీమలైనా క్రమశిక్షణతో నడిస్తే
బండరాళ్లే అరిగిపోతాయి.
ఒకడే నడుస్తున్నాడని హేళన చేయకు.
ఇంకో నలుగురు ఆ నడకకు జతకడితే,
కారడవైనా దారి విడవక తప్పదు.
ఇప్పటి ఈ నదులన్నిఒకప్పుడు
ఏ కొండల్లోనో తప్పటడుగులు వేసినవే.
చినుకేనని చూస్తుండగానే,
అది వర్షోదయానికి తొలిపొద్దే అవుతుంది.
దానికి కాలం కలిసొస్తే ఉప్పెన అయి ముంచేస్తుంది.
వేరుగా పడివుంటే ఇటుకలు ఒట్టి మట్టిబెడ్డలే
కలిసాయంటే మేడలై,మిద్దెలై అవి విభ్రమణని కల్గిస్తాయి.
చిటికెలో తయారవలేదు ఏ చరిత్ర
అది ఎన్నో సంఘర్షణల సమాహారం,
అది మరెన్నో త్యాగాల సమూహతీరం.
అష్టావధాని అయినా ఆరంభం లో
అ,ఆలు నేర్చినోడే,ఓనామాలు వల్లించినవాడే
ఆదిలోనే అంచనా వెయ్యకు,
ఎప్పుడూ ఏ మార్పునీ.
కాలం అనే మహాకావ్యమే,
వివరించగలదు ఆ తీర్పుని.
చక్కగా భావగర్భితంగా ఉంది కవిత, అభినందనలు
అందరికీ ధన్యవాదాలు.
ee sanchikalo.. 14th item pai click chesthe amma bhaasahlo vaadisthe gelupu khayam ane seershika kinda vere kavitha vastondi daya chesi gamaninchagalaru ..veelaithe saricheyandi
nice, one.