May 2, 2024

మధ్యమహేశ్వర్

రచన: కర్రా నాగలక్ష్మి ఓఖిమఠ్ మఠ్ నుంచి కారులో సుమారు 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ‘ ఉనియాన ‘ గ్రామం చేరేం. అక్కడ రాత్రి చిన్న గదిలో బసచేసుకొని మరునాడు పొద్దున్నే మధ్యమహేశ్వర్ వెళ్లాలనేది మా సంకల్పం. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరితే రాత్రికి మధ్యమహేశ్వర్ లో బసచేసుకొని, మరునాడు పొద్దుట తిరిగి బయలుదేరి ఉనియానా చేరాలనేది మా ఆలోచన. రాత్రి మా బస యజమానిని మధ్యమహేశ్వర్ దారి యెలావుంటుంది వగైరా వివరాలు అడిగేం. పొద్దున్నే […]

తేనెలొలుకు తెలుగు – పర్యాయ పదాలు, నానార్థాలు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు గత నెల తెలుగుభాషలో ఆమ్రేడితాల గురించి చర్చించుకున్నాం. ఒక భాష సుసంపన్నం, సుందరంగా రూపొందాలంటే అనేక విషయాలు పాటించాలి. భాషా సౌందర్యం మనం వాడే పదాల ఎంపికతో ఇనుమ డిస్తుంది. దానికి భాషలోని అనేక పదాలమీద అవగాహన, సాధికారికత ఉండాలి. అవసరమైనప్పుడు, ఎక్కువ విశదంగా చెప్పటం, అవసరంలేనప్పుడు సంక్షిప్తంగా చెప్పటం ఆవశ్యకం. సాధ్యమైనంతవరకు భావం పునః ప్రస్తావన రాకుండా, పదాలు పునరుక్తి కాకుండా, శబ్దాలంకారము, యతి ప్రాసలు మొదలైనవాటి మీద దృష్టి ఉంటే […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 36

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య   మానవుడు కన్ను, ముక్కు, చెవి, చర్మము, నోరు అనే పంచేంద్రియాలకు లోబడి వ్యవహరిస్తుంటాడు. కాలం గడిచే కొద్దీ వీటిపై వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. వాటికి బానిసలై వ్యవహరిస్తాం. కానీ వీటిని ఎలా జయించాలి?  అని ఈ కీర్తనలోవాపోతున్నాడు అన్నమయ్య.   కీర్తన: పల్లవి: ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే బట్టరానిఘనబలవంతములు   చ.1. కడునిసుమంతలు కన్నులచూపులు ముడుగక మిన్నులు ముట్టెడిని విడువక సూక్ష్మపువీనులు యివిగో బడిబడి నాదబ్రహ్మము మోచె           ॥ […]

మహాకవి శ్రీశ్రీ ని గురించి కొందరు ప్రముఖులు

రచన: శారదాప్రసాద్   ఒక్కడే మహాకవి, అతని పేరు శ్రీశ్రీ –శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు “ఆనందం ఆర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం. ” గిరి-అహో, ఏమిగీతం. ఎంత సొగసుగా వుంది. కవిత్వాన్ని వడబోసినట్లుందే. ఎవరయ్యా ఈ పాట రాసింది? హరి-ఈ పాట వ్రాసినతని పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. గిరి-కొత్త కవుల్లో ఇంతటి మహాకవులుంటారా? హరి-అట్టే మాట్లాడితే ఈ క్రొత్తకవుల్లో ఒక్కడే మహాకవి. అతని పేరు శ్రీశ్రీ. గిరి-అయితే శ్రీశ్రీ వంటి నవ్యకవిలో […]

కాముని పున్నమి

రచన: లక్ష్మీదేవి ఫాల్గుణ పూర్ణిమ నాటికి పువ్వుల రంగులతో చిగుళ్ళ ఎఱుపుతో వెన్నెల నిండిన నింగీ నేలా వసంతాలాడు కుంటుంటాయి. ఫాల్గుణాలలో తెలివెన్నెలలు కురిసే కామునిపున్నమి (హోళీ) ఆమని రంగిలి శోభించడానికి ముందుమాట/ స్వాగత గీతం వంటిదే. నిండుగా పూచిన వేప , మామిడి, కానుగ అనేముంది, తరువులన్నీ, తనువులన్నీ పూలగుచ్ఛాలై శుభాకాంక్షలు అంది పుచ్చుకుంటుంటాయి. సంజె వేళల్లో వీచే ఆహ్లాదకరమైన పిల్లగాలుల వేణునాదాలకు మదిలోని తలపులు పదాలు పలుకుతుంటే పెదాలు ఒద్దికగా ఒదిగిపోతూ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి. […]

విశ్వపుత్రిక వీక్షణం – భూమి ద్వారం మూసుకపోతోంది

రచన: విజయలక్ష్మి పండిట్. మన దేశంలో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళలలో చిన్నవయసులోనే 15-45 ఏండ్ల లోపే గర్భసంచి తొలగింపుకు లోనవుతున్నారని, ఇది మహిళలలను ఆరోగ్య సమస్యలకు గురిచేయడమే కాకుండా కొన్ని బీద, వెనుకబడిన, నిరక్షరాస్య మానవ సమూహాలు, జాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్న నిజాలు. ఇటీవల మహిళా దినోత్సవ సధర్భంగా “ వసుంధర “ పురస్కార గ్రహీత గైనకాలజిస్టు డా. వెంకట కామేశ్వరి గారి ప్రత్యక్ష అనుభవం ఆమె మాటలలో మనలో […]

యోగాసనం 2

రచన: రమా శాండిల్య హరి ఓం భద్రాసనం భద్రాసనం అంటే ఆసనం పేరులోనే భద్రత యిముడ్చుకున్నది. అంటే ఆ ఆసనం వేయడం వలన మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది అని వేరే చెప్పక్కరలేదు కదా. భద్రాసనం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది అరుగుదల ఆహారం ఆరగడానికి పనికి వస్తుంది. కాంష్టిపెషన్ ఉండదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ , ఇన్డేజెషన్ ఇలాంటి వాటికి కూడా చాలా మంచిది. ఈ రోజుల్లో ప్రతివారికి నడుము నొప్పి ఉంటోంది ఆ నొప్పికి […]

అంబ -శిఖండి వృత్తాంతము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. మాహా భారతములో అనేక పాత్రలలో కారణజన్మురాలై భీష్ముడి మరణానికి కారణము అయిన అంబది చాలా ప్రత్యేకమైన పాత్ర ఈమె కాశీ రాజు ముగ్గురు కుమార్తెలలో పెద్దది ఈవిడ సాళ్వుని ప్రేమించింది ఇద్దరు వివాహము చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు ఈవిడకు భీష్ముడి మరణానికి గల సంబంధము ఏమిటో తెలుసు కుందాము. శంతనుడు మరణించాక రాజ్యపాలన భారము సత్యవతి పుత్రుల పరము అయింది భీష్ముడు తన ప్రతిజ్ఞ వల్ల రాజ ప్రతినిధిగా ఉండి సత్యవతి […]

విశ్వనాథ వారి భ్రమరవాసిని

రచన: రాజన్ అలల సవ్వడులలతో హోరెత్తుతూ.. తిరిగి నెమ్మదించి, ప్రశాంతత పొందిందనే లోపుగనే మరింత ఉధృత కెరటాలతో ఎగసిపడి, కల్లోలము నుండి ప్రశాంతతకు, ప్రశాంతత నుండి కల్లోలానికి తన పథాన్ని మార్చి మార్చి, నురగల నగవులో లేక నశ్రువులో చిందించే సాగరానికి సైదోడు… మనిషి మనస్సు. ఆలోచనల, కోరికల పుట్టినిల్లయిన అటువంటి మనస్సును గూర్చి, దాని స్వభావమును గూర్చి ఒక ఆలోచన చేయించి, ఆంతరిక ప్రపంచ జ్ఞానమును, బాహ్య ప్రపంచ విజ్ఞానమును కలబోసి, అక్షరములుగా పోతపోసి మనకందించిన […]

కవితా నీరాజనమైన నివేదన

రచన: సి.ఉమాదేవి కవయిత్రి కవితా చక్ర పలికించిన నివేదన, రాగాలు పలికిన కవితాఝరి. అక్షర ఆర్తితో లిఖించిన ప్రతి పదము రచనాపూదోటలో కవితాసుమమై మధురిమలను వ్యాపింపచేస్తుంది. కలము, గళము యుగళగీతమై అందించిన కవితార్చనలోని తాత్వికత, తాదాత్మ్యతకు గురిచేస్తుంది. పుస్తకం శీర్షిక నివేదన, కాని ప్రతి వాక్యములో ఆరాధన, ఆవేదన సమ్మిళితమైన నివేదనగా రూపుదిద్దుకున్న రచన. ‘దోసిటనిండిన ఆశల పూలరెక్కలు మాయమై హృదయభారాన్ని మిగిల్చాయనడంతో’ నివేదన అక్షరానికి ఊపిరవుతుంది. ‘నేను నడిచే దారుల్లో నీమాటల పూవులు నన్ను తాకుతున్నాయి, […]