రచన : జగద్ధాత్రి “తెలుగు సాహిత్యంలో మీరే మొదటి స్త్రీవాద రచయిత కదా?” అన్న ప్రశ్నకు “కాదు, మూడవ వాడిని, మొదటి వారు వీరేశలింగం గారు, రెండవ వారు గురజాడ వారు” అంటూ తన స్థానం మూడవదని చెప్పారు చలం గారు ఒక ఇంటర్వ్యులో. బాల వితంతువుల మోడు వారిన జీవితాలను ఉద్ధరించడానికి నడుం కట్టింది వీరేశలింగం గారైతే, స్త్రీ విద్యకు ప్రాముఖ్యత నిచ్చిన వారు గురజాడ. ఇక చలం స్త్రీ లైంగిక స్వేచ్చను కూడా […]
Month: August 2011
సత్రవాణి
రచన : సత్య (ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరిభాషకు, ఒక తెలుగు‘మాట’అందించడానికే ఈ కథ) ఆరోజు రమణమూర్తిగారు దేనికోసమో టేబిలు మీదా,సొరుగులోనూ వెదికారు.అది కనిపించలేదు. హడావుడిగా తనగదిలోనూ,వరండాలోనూ వెదికారు.దొరకలేదు.అలా వెదికి వెదికి విసుగెత్తి భార్యను పిలిచారు. ఆవిడ హడావుడిగా వచ్చారు.”ఏదీ?నా సత్రవాణి?ఎక్కడా కనిపించదేంటి?”అన్నారాయన.”ఎక్కడో మీరే ఎడమచేత్తో పెట్టి మర్చిపోయుంటారు అదెవరికావాలి? వెదుక్కోండి, కనిపిస్తుంది”అన్నారావిడ. “అన్నీ వెతికాకే నిన్నడగుతున్నాను. మీరే ఎక్కడో పెట్టేసుంటారు.వెతికి కాసేపట్లో నాకు తెచ్చివ్వాలి”అని ఆజ్ఞ జారీ చేసారు. ఆవిడ విసుక్కుంటూ లోపలికి వెళ్ళి కూతుర్నిపిలిచారు.”మీనాన్న […]
మొక్కగా వంగనిది
రచన : సోమంచి వినయభూషణరావు పగలు 9గంటలౌతుంది. ప్రొద్దున్నే 7గంటలమొదలు అంతవరకు ఇంటిముందు తోటలో తిరుగుతూ మొక్కల సంరక్షణ చూడ్టం చంద్రశేఖరం గారి దినచర్యలోని రెండవ అంశం. తెల్లవారు ఝామునేలేచి కాలకృత్యాలు ముగించి యేదో ఒక గ్రంథం కాసేపు పఠించి కాసేపు ఆలోచనాసమాధిలో కాలం గడిపి, తూర్పున వెలుగు వెల్లవేసే సమయానికి సంధ్యావందనం’చేసుకుని, దేవతార్చన ముగించి తోటలోకి అడుగుపెడ్తే ఆతర్వాత యింట్లో అడుగుపెట్టి ఇల్లాలు సిద్ధంచేసిన భోజనంచేసి బడికి బయలుదేరటం. వయసు నాలుగోయామం లోకి అడుగుపెడ్తుండగా […]
గురజాడ అంతరంగ నివేదనే – మధురవాణి పాత్ర
రచన : మన్నె సత్యనారాయణ గతచరిత్రలోని అంధకారాన్ని చీల్చుకుంటూ ఒక సూర్యుడుదయించాడు! మేలుకొలుపులు కోడి కూసింది.‘తూర్పు’బలబల తెలవారింది. అప్పటి విశాఖ మండలం, ఎస్.రాయవరం గ్రామంలో గొడవర్తి కృష్ణయ్య పంతులుగారింట్లో, వారి కుమార్తె కౌశల్యమ్మ ఒక ‘చిన్న మగవానిని’కన్నది. ఆ రోజు 21, సెప్టెంబరు, 1862వతేదీ ఆదివారం అభిజిత్ ముహూర్తం, మఖా నక్షత్రం జన్మకాల కేతు మహర్దశ. అది దుందుభినామ సంవత్సరం, భాద్రపదమాసం. కౌసల్యమ్మ భర్త గురజాడ వెంకట రామదాసు. ఆరోజు ఉదయించిన చిన్ని సూర్యుడే […]
జయించు జగాన్ని
రచన : డా. వి.సీతాలక్ష్మి . విశ్రాంత తెలుగు రీడర్ ఏ ఇంటి కథనం విన్నా ఏమున్నది కొత్తదనం ప్రతి ఇంటి చరిత సమస్తం వృద్ధాప్యపు ఒంటరి పయనం అమ్మానాన్నా ఆరునెలలకే అనుమతి అమెరికా డాలరు స్వర్గాదపీ గరియసి స్వదేశీ సౌరభ సంస్కృతి పరిమితి విదేశీ వింత వికృతి దిగుమతి.. తాను నాటిన మొక్క ఎదిగి మ్రానై నీడనిస్తే తాను సాకిన కన్నబిడ్డే నీడనివ్వక త్రోసివేస్తే చెట్టా? బిడ్డా? ఏది మనకు తోడూ […]
సహజ భాషా ప్రవర్తనం (Natural Language Processing) – 2
రచన : సౌమ్య వి.బి. “కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్” అని ఒక జర్నల్ ఉంది. Computational Linguistics అంటే గణనాత్మక భాషాశాస్త్రం (అనుకుందాం తాత్కాలికంగా). సాధారణంగా, సహజ భాషా ప్రవర్తనానికి సమానార్థకంగానే వాడుతూ ఉంటారు. సహజ భాషా ప్రవర్తనం (నేచురల్ లాంగ్వేజీ ప్రాసెసింగ్ – రంగంలోని ప్రముఖ పత్రికల్లో ఇదీ ఒకటి. తరుచుగా సమకాలీన పరిశోధనల గురించిన పత్రాలతో పాటు, “చివరి మాటలు” (Last Words) అన్న శీర్షికన, ఈ పరిశోధనల గురించిన ఆలోచనల వ్యాసాలు కూడా […]
మనసులో మాట నొసటన కనిపించెనట
రచన : లలిత.జి పార్వతీ పరమేశ్వరులు పరవశించి నాట్యం చేస్తున్నారు. సరస్వతీ దేవి వీణా గానం వింటూ బ్రహ్మదేవుడు పుట్టబోయే ప్రతి శిశువు నుదుటి మీదా వారి భాగ్య రేఖలు రాస్తున్నాడు. పాలకడలిలో పాముపై పడుకుని తలవంచుకుని తన పాదాలు వత్తుతున్న శ్రీమహాలక్ష్మిని మందహాసంతో చూపు మరల్చుకోలేక చూస్తున్న శ్రీమహావిష్ణువు ఒక్క సారి ఉలిక్కి పడ్డాడు. “పతికిన్ చెప్పక…” శ్రీదేవి పరుగు అందుకుంటే ఆమె వెనకే హరి, అతని వెనుకే అతని శంఖ చక్రాలతో […]
చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు
రచన: ……….. నూర్ భాషా రహంతుల్లా గత పది సంవత్శరాలలో516 భాషలు దాదాపుగా అంతరించిపోయాయట. చాలా కొద్దిమంది పెద్దవాళ్ళు మాత్రమే ఆ భాషలు మాట్లాడుతున్నారట. ప్రస్తుతం 7299 భాషలు ప్రపంచంలో వాడుకలో ఉన్నట్లు గుర్తించిన సంస్థలు, వాటిలో సగానికి సగం రాబోయే తరానికి అందకుండా అంతరించిపోయే దశలో ఉన్నాయని చెబుతున్నాయి. అంతరించిపొయే దశలో ఒక భాష ఉంది అనటానికి ప్రాతిపదికలు ఏంటంటే- 1. ఆ భాషను పెద్దవాళ్ళు పిల్లలకు నేర్పరు. 2. రోజువారీ […]
రఘునాథ నాయకుని గ్రీష్మర్తు వర్ణన …
రచన – డా.తాడేపల్లి పతంజలి ఒక కవి చరిత్రను మొట్టమొదట కావ్యంగా వ్రాసిన మహాకవి రఘునాథ నాయకుడు. కృష్ణ దేవరాయలు మళ్ళీ రఘునాథ నాయకునిగా పుట్టాడేమో అనిపిస్తుంది.ఆయన భువన విజయం నడిపిస్తే ఈయన ఇందిరామందిరం స్థాపించాడు.రాయలు, నాయకుడు ఇద్దరూ మహాకవులే. కాకపోతే రాయలు ఇలలోనూ, కవిత్వంలోనూ సమ్రాట్టు. రఘునాథ నాయకుడు కేవలం కవిత్వంలోనే సమ్రాట్టు. రఘునాథ నాయకుని కావ్యాల్లో ప్రసిద్ధికెక్కిన కావ్యం వాల్మీకి చరిత్ర. మొత్తం మూడాశ్వాసాలు. 122+155+169 వెరసి 446 గద్య పద్యాలు […]
నయాగరా! కవితా నగారా!
రచన : డా. రాధేయ ఒక విషయం గురించిగానీ, ఒక దృశ్యం గురించిగానీ కవితామయంగా కన్నులకు కట్టినట్లు చూపి ఆ దృశ్యీకరణశైలితో ఆలోచన్లని కవిత్వంగా మలిచే దిశగా ప్రయాణించే కవులు కొందరే కన్పిస్తారు మనకు. సామాజిక అనివార్యతనుంచి ఏకవీ తప్పించుకోలేడు. ఇప్పుడు ప్రపంచీకరణతో ప్రపంచమే మన ముంగిట్లో వాలింది. యాంత్రీకరణ మనిషి అవసరాల్ని తీర్చలేని స్థితిలో మనిషి బతుకును మార్కెట్లో నిలబెట్టింది. ఈ మార్కెట్ సంస్కృతిలో మానవ సంబంధాలు లేవు. ప్రేమలు, ఆపేక్షలు లేవు. అన్నీ […]